ఇంటా బయటా ఉక్కపోతతో విజయసాయి ఉక్కిరిబిక్కిరి!

Publish Date:Nov 18, 2024

Advertisement

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయికి ఇంటా బయటా ఉక్కపోత తప్పడం లేదు. విజయసాయిని ఇటు సొంత పార్టీకీ, అటు మీడియాకీ కూడా టార్గెట్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది.  ఆయన ప్రకటనలకూ, వ్యాఖ్యలకూ కనీసం జగన్ రెడ్డి సొంత మీడియాలో కూడా ప్రాముఖ్యత లభించడం లేదు. పార్టీ నేతలూ కార్యకర్తలూ కూడా ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదు. పోనీ ఇంత కాలం అవమానించినా, కాదు పొమ్మన్నా, పాపం ముసలోడైపోయాడంటూ చులకన చేసినా పెద్దగా పట్టించుకోకుండా, దులిపేసుకుని జగన్ పట్ల తన వీర విధేయతను శ్రద్ధంగా, భక్తిగా, భయంతో చాటిన విజయసాయిరెడ్డికి కనీసం జగన్ నుంచి కూడా సరైన గుర్తింపు లేకుండా పోయింది.  ఈ నేపథ్యంలోనే విజయసాయి ఇటీవల తరచుగా సంయమనం కోల్పోతున్నారు. మీడియాలో ఎక్కడా తన మాటలకు ప్రాధాన్యత లభించకపోవడంతో సోషల్ మీడియాను ఆశ్రయించి ఇష్టారీతిగా నోరు పారేసుకుంటున్నారు. 

 గతంలో కూడా ఒక సారి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంతంగా చానల్, పత్రిక ప్రారంభించబోతున్నట్లు ప్రకటించేశారు. ఆ సందర్భంలో ఆయన మనసులో ఉన్న మాట అనుకోకుండా బయటకు చెప్పేశారు. వైసీపీలో కూడా తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందనీ, ఆ పార్టీ సొంత మీడియాలో కూడా తనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనీ ఆవేదన వ్యక్తం చేసేశారు. గతంలోనే తాను టెలివిజన్ చానల్ ప్రారంభిద్దామని అనుకున్నాననీ, అయితే అప్పట్లో జగన్ వారించడం వల్ల ఆగిపోయాననీ చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఎవరి చెప్పినా వినే పరిస్థితి లేదనీ, చానెల్ ప్రారంభించడం తధ్యమనీ కుండబద్దలు కొట్టేశారు.  అంతే ఆ తరువాత ఆయన మళ్లీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. 

అసలింతకీ విజయసాయిరెడ్డి ఆవేదనకు, ఆక్రందనలకూ కారణమేమిటంటే.. మొదటి నుంచీ వైసీపీలో నంబర్ 2గా ఉండే విజయసాయి రెడ్డికి  ఆ తరువాత పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆయన నంబర్ 2 స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించేశారు. ఆ తరువాత విజయసాయికి పార్టీలో నామమాత్రపు ఉనికి మాత్రమే మిగిలింది.  ఆ సమయంలో  ఆయన సొంత చానల్, సొంత పత్రికా అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటన చేశారు. 

అన్నిటి కంటే ముఖ్యంగా  విజయసాయిపై  ఒక మహాళా అధికారితో అక్రమ సంబంధం ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో ఆయనకు మద్దతుగా వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఆరోపణలు ఖండించడానికి ముందుకు రాలేదు.  దీంతో ఆయన ఇక పార్టీ అండ కోసం అర్రులు చాస్తూ కూర్చుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేసి సొంత మీడియా ఏర్పాటుపై ప్రకటన చేసేశారు. ఆ సమయంలోనే..  తాను ఏ పార్టీలో ఉన్నా తన చానల్ మాత్రం నిఖార్సైన వార్తలే ప్రసారం చేస్తుందని చెప్పి పార్టీ మార్పు సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ సంకేతం ఇవ్వడం ద్వారా   జగన్ కు దాదాపుగా ఓ హెచ్చరిక చేశారు. లేదా బ్లాక్ మెయిల్ చేశారని అప్పట్లో  పరిశీలకులు విశ్లేషించారు.   

నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీలో ఆయనను పట్టించుకునే నాథుడే కరవయ్యారు. అక్రమ సంబంధం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన సమయంలో కూడా ఆయనకు డిఫెన్స్ గా పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన సోంత చానల్ అంటూ హడావుడి చేశారు.   ఇదంతా జరిగి ఐదు నెలలు కావస్తోంది. అయినా విజయసాయి చానెల్  ఏర్పాటు విషయంలో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.  ఇక తాజాగా విజయసాయి రెడ్డి మరో సారి ఇక్కట్లలో పడ్డారు. ఆయన హద్దూ ఆపూ లేకుండా ఓ మీడియా సంస్థ అధిపతిపై చేసిన వ్యాఖ్యలకు ఆయన దీటుగా సమాధానం ఇచ్చారు. తన చానెల్ లోనే లైవ్ డిబేట్ కు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. దీంతో విజయసాయి మళ్లీ సొంత చానల్ ప్రకటన చేసి, తన చానెల్ ద్వారానే ఆ మీడియా ప్రతినిథికి బదులిస్తానని చెప్పి ప్రస్తుతానికి తప్పించుకోవడం కోసం చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.