స్వీడ్ న్యూస్ 3

Publish Date:Jul 17, 2023

Advertisement

21. జగనన్న స్మార్ట్‌ సిటీ నిర్మాణానికి వ్యతిరేకంగా బద్దేలులో  ఎస్సీలు ఆందోళనకు దిగారు.  తమకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారంటూ  జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు.  ఈ సందర్భంగా  పోలీసులు, ఎస్సీలకు మధ్య తోపులాట జరిగింది.

..........................................................................................................................................................

 22. కోడిని కుక్క కరిచిన ఘటన వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఘర్షణకు కారణమైంది. ఉమ్మడి కడప జిల్లా మాధవరం గ్రామంలో  జరిగింది. స్థానిక  తెలుగుదేశం నేతకు చెందిన కోడిని  వైసీపీ నేత పెంపుడు కుక్క కరవడంతో ఇరు వర్గాల మధ్యా ఘర్షణ జరిగింది. ఈ దాడిలో  ఒకరు గాయపడ్డాడు.

...................................................................................................................................................

23. ఓటర్ల జాబితాలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారి ఓట్లు పెద్ద సంఖ్యలో గల్లంతయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు.  ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందో, లేదో చెక్ చేసుకోండని సూచించారు. ఓటు లేకపోతే వెంటనే ఓటరుగా మీ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. 

.............................................................................................................................................

24.  బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో  నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే బీజేపీయేతర పక్షాల సమావేశాన్ని దేశ ముఖచిత్రాన్ని మార్చే  సమావేశంగా కర్నాటక  డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు.  140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్ ను మార్చే   సమావేశమన్నారు.

........................................................................................................................................................

25. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో   రానున్న మూడు  రోజులూ  వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు  కురుస్తాయనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

....................................................................................................................................

26.  ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో  ప్రజలకు సగం ధరకే  టమాటాలు దొరుకుతున్నాయి. భారత ప్రభుత్వ సహకారంతో ఎన్‌సిసిఎఫ్‌ఐ ద్వారా.. లక్నోలోని 11 చోట్ల టమాటోలను మొబైల్ వ్యాన్‌లలో కిలో రూ.80కి ప్రజలకు అందుబాటులో  ఉంచుతోంది యోగి సర్కార్.

..........................................................................................................................................................

27.  జనసేన కార్యకర్తపై చేయిచేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై పవన్ కల్యాణ్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు చేయడం కోసమే ఆయన తిరుపతి వచ్చారు.  కాగా ఇప్పటికే సీఐ అంజూ యాదవ్ కు ఛార్జ్ మెమో జారీ చేశారు.

.............................................................................................................................................

28.  మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే వింధ్య ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. వింధ్య రీజియన్ ప్రత్యేక రాష్ట్ర హోదా సాధన కోసం  ప్రజలు స్థాపించిన  పార్టీ వింధ్య జనతా పార్టీకి తాను నేతృత్వం వహిస్తానని  ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి తెలిపారు.

..................................................................................................................................

29.  అగ్రరాజ్యాన్ని పిడుగులతో కూడిన వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి.  ముఖ్యంగా   ఈశ్యాన్య ప్రాంతంలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.  దీంతో ఈశ్యాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దయ్యాయి.  అలాగే భారీ వర్షాల కారణంగా ఈశాన్య అమెరికా  వరద ముంపులో చిక్కుకుంది.

..........................................................................................................................................................

 

30.  భారీ వర్షాలు ఉత్తర భారత దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.  భారీ వర్షాలతో హరిద్వార్‌ వద్ద గంగానది  ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది.  దీంతో హరిద్వార్‌, రూర్కీ, ఖాన్‌పుర్‌, భగవాన్‌పుర్‌, లస్కర్‌ పరిధిలోని అనేక గ్రామాల్లో వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.