గుంటూరులో మొన్నమిట్ట మధ్యాహ్నం నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కలిసి నిర్వహించిన సభకి భగభగ మండుతున్న ఎండలని కూడా లెక్క చేయకుండా జనం పోటెత్తారు. అది చూసి మోడీ కూడా చాలా ఆశ్చర్యపోయారు. సభకు వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పుకొని తనపై ఇంత ఆప్యాయత చూపుతున్న సీమాంధ్ర ప్రజల ఋణం తప్పకుండా తీర్చుకొంటానని హామీ ఇచ్చారు. ఈరోజు అదే ప్రాంతంలో సోనియాగాంధీ సభ కూడా జరిగింది. జనాలకి ఎండ వేడి తగలకుండా షామియానాలు వేసారు. సుఖంగా కూర్చొనేందుకు కుర్చీలు వేసారు. దాహం తీర్చుకోవడానికి చల్లటి నీళ్ళ ప్యాకెట్లు కూడా అందించారు. కానీ పాపం జనాలే లేరు. మహా అయితే ఓ రెండు వేలమంది హాజరయి ఉంటారేమో! వారిలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నేతలె ఎక్కువగా కనబడ్డారు. మిగిలిన వారిలో రోజుకూలి లెక్కన వచ్చిన వారే అధికంగా కనిపించారు. సభలో దాదాపు మూడొంతులు కుర్చీలు ఖాళీగ కనబడ్డాయి. కాంగ్రెస్ నేతలు ప్రసంగిస్తుంటే వాటి మధ్య చిన్న పిల్లలు పరుగులు తీస్తూ హాయిగా ఆడుకోవడం నయనానందకరంగా ఉంది. బహుశః ఆ ఖాళీ కుర్చీలను చూసి సోనియాగాంధీకి కూడా రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి అర్ధమయిందేమో అందుకే "రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర ప్రజలను ఎంతగా బాధించిందో అర్ధమైందని" అన్నారు.
చిరంజీవి ప్రసంగం మొదలు పెట్టె ముందు జనాలు కొంచెం హుషారుగా ఈలలు, కేకలు వేసారు. కానీ ఆ తరువాత ఆయన ప్రసంగిస్తునంత సేపు చీమ చిట్టుకుమంటే ఒట్టు. ఇక సోనియా ప్రసంగిస్తుంటే ఉన్న జనాలు కూడా మెల్లగా జారుకోవడం కనబడింది. ప్రజాభిప్రాయాన్ని, స్వంత పార్టీ నేతలనీ ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజన చేసి, ప్రజలను, స్వంత పార్టీలో సీనియర్ నేతలను కూడా వదులుకొన్నాక, ఇప్పుడు ప్రజలను రమ్మంటే ఎందుకు వస్తారు? ఇది స్వయంకృతాపరాధమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sonia-gandhi-39-33164.html
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.