జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిళ ముగ్గురూ కలిసి గత ఐదేళ్ళుగా జనంలో వైయస్ మరణం తాలూకు సానుభూతి కరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొస్తున్నారు. ఇప్పడు దానిని ఓట్ల రూపంలోకి మార్చుకోవలసిన సమయం ఆసన్నమయింది. వారు ముగ్గురూ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. చేతిలో ఒక పేపరు, న్యూస్ ఛానల్ ఉంటే అది ఎంత ఉపయోగకరమో ఇప్పటికే సాక్షి మీడియా చూపింది. ఇక కీలకమయిన ఈ సమయంలో ఇప్పుడు దానిని నూటికి రెండువందల శాతం ఏవిధంగా ఉపయోగించుకోవచ్చునో అది మరొకసారి చూపుతోంది. గత రెండు రోజులు సాక్షి టీవీ ఛానల్లో ఆనాడు వైయస్స్ హెలికాఫ్టర్ లో బయలుదేరేముందు మాట్లాడిన మాటలు, ఆయన ప్రయాణిస్తున్నహెలికాఫ్టర్ జాడ తెలియనప్పుడు విజయమ్మ, ప్రజలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అందరూ స్పందించిన తీరు, ఆయన మరణ వార్త తెలిసిన తరువాత ప్రజల స్పందన ఇత్యాది సంఘటనలన్నిటినీ చూపుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన వర్ధంతి కాదు జయంతి కాదు. మరి ఎన్నికలకు ఇంకా కేవలం మూడు రోజుల ముందే ఎందుకు అవ్వనీ చూపుతున్నారు? అంటే సమాధానం అందరికీ తెలిసిందే.
తండ్రి చనిపోయిన తరువాత ఇంకా అంత్యక్రియలు కూడా జరపకుండానే తను ముఖ్యమంత్రి అయ్యేందుకు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంతకంటే మరింత దిగజారిపోయి, తన తండ్రి మరణాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్లు మరొకమారు చూపించి వారి సానుభూతిని ఓట్లుగా మలచుకోవాలనుకోవడం చాలా దారుణమయిన ఆలోచన. ఇది జగన్మోహన్ రెడ్డిలో ముఖ్యమంత్రి కావాలనే కాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెపుతోంది.
జగన్ తన పార్టీని బలోపేతం చేసుకొని, తన పార్టీ సిద్దాంతాలు, మ్యానిఫెస్టో గురించి ప్రచారం చేసుకొని ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ తండ్రి మరణాన్ని, దానిపై ప్రజలలో ఉన్న సానుభూతిని పెట్టుబడిగా చేసుకొని ముఖ్యమంత్రి అయిపోవాలని ఆలోచించడం చాలా దారుణం.
ఇటీవల ఆయన సోదరి షర్మిళ బాలకృష్ణపై విమర్శలు గుప్పిస్తూ ‘బాలకృష్ణ మంచి నటుడు అనిపించుకోగలిగేడేమో కానీ ఒక మంచి కొడుకు అని మాత్రం అనిపించుకోలేకపోయాడు,’ అని ఎద్దేవా చేసారు. ఇప్పుడు అవే మాటలను ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తింపజేయవచ్చేమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sakshi-39-33166.html
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.