ఇన్ చార్జికి ముఖం చాటేసిన సోము వీర్రాజు? ఆయన సీన్ అయిపోయిందా?

Publish Date:Feb 26, 2023

Advertisement

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధిష్ఠానం ఆయనపై ఆగ్రహంగా ఉందా? రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారడానికి సోము వీర్రాజు తీరే కారణమని భావిస్తోందా? అంటే పార్టీ వర్గాలు ఔననే అంటున్నాయి. అధిష్ఠానం ఆగ్రహంగా ఉందని తెలియడం వల్లనే సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ రాజమహేంద్ర వరం వచ్చినా ఆయనను కలవకుండా మొహం చాటేశారని అంటున్నారు.  

ఏపీ బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో మెజారిటీ నాయకులు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేయడంతో రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుని సమస్య పరిష్కారం కోసం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేంద్ర మంత్రి మురళీధరన్ రాష్ట్రానికి వచ్చారు.  నేరుగా రాజమహేంద్రవరం వెళ్లారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఆయనకు ఎదురుపడలేదు. సాధారణంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ రాష్ట్ర పర్యటనకు వస్తే పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఎదురు వెళ్లి ఆహ్వానించడం అన్నది ఆనవాయితీ. కానీ అందుకు భిన్నంగా సోము వీర్రాజు అసలు మురళీధరన్ కు ఎదురు పడలేదు. ఆయన రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చిన సమయంలో సోము వీర్రాజు కడప పర్యటనకు వెళ్లారు. 

ఏపీ బీజేపీలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి సోము వీర్రాజు చేరుకున్నారు. అందుకే ఆయన మురళీధరన్ కు మొహం చాటేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇటీవల ఏపీ నుంచి పలువురు నేతలు హస్తిన వెళ్లి మరీ అధిష్ఠానానికి సోము వీర్రాజుపై ఫిర్యాదు చేశారు. వారు అలా ఫిర్యాదు చేసి వచ్చారో లేదో.. ఇలా పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ రాజమహేంద్రవరం చేరుకున్నారు.  పోతే సోము వీర్రాజు ముఖం చాటేసినా మురళీధరన్ మాత్రం రాజమండ్రిలో పార్టీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా పలు ఇతర జిల్లాల నుంచి కూడా నేతలు, కార్యకర్తలు ఈ సమావేశానికి వచ్చి సోముకు వ్యతిరేకంగా గళమెత్తినట్లు చెబుతున్నారు.   ఏపీ బీజేపీలో ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభానికీ, నాయకులు, కార్యకర్తలలో అసంతృప్తికీ సోము వీర్రాజే కారణమని మురళీధరన్ కు పలువురు చెప్పినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో సహా పలువురు పార్టీకి రాజీనామా చేయడం, ఆ రాజీనామాల పర్వం ఇప్పట్లో ఆగేలా లేదని ఆ తరువాతి పరిణామాలు స్పష్టం చేయడంతో బీజేపీ హైకమాండ్ కూడా సోము వీర్రాజు తీరు పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు.  

సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దాదాపు 200 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు రాజీనామాలకు కూడా సిద్ధపడినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణలా మధ్యలో వచ్చి చేరిన వారే కాకుండా బీజేపీ వ్యవస్థాపక కాలం నుంచీ పార్టీలో పని చేస్తున్న వారు కూడా సోము వీర్రాజు కారణంగా పార్టీ నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు రాజమహేంద్రవరం సమావేశంలో పలువురు మురళీధరన్ దృష్టికి తీసుకు వెళ్లారు.   సోము వీర్రాజునే పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడిగా కొనసాగించాలని భావిస్తే, తాము ఆయనతో పనిచేయడం కష్టమని పలువురు ఈ సమావేశంలో స్పష్టం చేశారంటున్నారు.   

By
en-us Political News

  
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.