పాకిస్తాన్ కోసం పాపిష్ఠి ప్లాన్ వేసిన కాంగ్రెస్!

Publish Date:Sep 21, 2016

Advertisement

సెప్టెంబర్ 21... ఇంటర్నేషనల్ పీస్ డే! పీస్ అంటే శాంతే కాదు... ఇంగ్లీషులో చిన్న ముక్క అని కూడా అర్థం! గత యూపీఏ ప్రభుత్వం బహుశా పీస్ అంటే శాంతికి బదులు ముక్క అని అర్థం చేసుకుందేమో! అందుకే, పాకిస్తాన్ కు మన దేశం లోంచి ఓ ముక్కను తీసి ఇచ్చేద్దామనుకుంది! అదీ ఏ పనికిమాలిన ప్రాంతమో కాదు. ఏకంగా అత్యంత భౌగోళిక ప్రాధాన్యమున్న సరిహద్దు ప్రాంతాన్నీ! ఇంతకీ మన్మోహన్ సింగ్ వారి సోనియా ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా?

వికీలీక్స్ తాజా లీకేజీల్లో కాంగ్రెస్ మార్కు జాతి విద్రోహం బయటపడింది. భారత్, పాక్ సరిహద్దులో వున్న సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం శత్రు దేశానికి అప్పగిద్దామని యూపీఏ భావించిందట! కాని, ఇండియన్ ఆర్మీ తీవ్ర అభ్యంతరం చెప్పటంతో మన్మోహన్ వారు వెనక్కి తగ్గారట. ఇంతకీ సియాచిన్ పాక్ కు ఇచ్చేస్తే లాభం ఏంటి? ఏం లేదనే అంటున్నారు బుర్రలో ఏ మాత్రం గుజ్జు వున్న వారైనా. కాని, సోనియా నేతృత్వంలోని యూపీఏకు అలా అనిపించలేదు. సియాచిన్ హిమనీ ప్రాంతం పాక్ కు ఇచ్చేస్తే ఆ దేశం మంచిదైపోయి మనల్ని ఇబ్బంది పెట్టకుండా వుంటుందని అనుకున్నారు! అంతే కాదు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి, పాక్ తో శాంతికి మన్మోహన్ కూడా తన వంతు కృషి చేశారని చరిత్ర చెప్పుకుంటుందని కక్కుర్తి పడ్డారు! 

సియాచిన్ ఊరికే మన దేశంలో అంతర్బాగం కాలేదు. ఇప్పటి వరకూ దాదాపు 900ల మంది జవాన్లు అమరులైతే అది మన చేతుల్లో వుంది. 1984లో భారత ఆర్మీ ఎంతో కష్టపడి, ప్రాణాలొడ్డి దాన్ని కైవసం చేసుకుంది. ఎత్తైన ఆ ప్రాంతం ఒకవేళ పాక్ చేతిలో వుంటే పై నుంచి కాల్పులు జరపటం తేలిక. బుల్లెట్స్ కి ఎదురొడ్డి పైకి ఎక్కుతూ యుద్ధం చేయటం మన సైనికులకి నరకం లాంటిది. అయినా ఇవేవీ సోనియా, మన్మోహన్ లకు పట్టలేదు... 

యూపీఏ అధికారంలో వుండగా సియాచిన్ పాక్ కు అప్పగించి మంచి పేరు తెచ్చుకుందామని అప్పటి పాలకులు దాదాపు నిర్ణయించారట. కాని, ఆర్మీ వద్దని పట్టుబట్టడంతో వెనక్కి తగ్గారట. వికీలీక్స్ చెప్పిన సారాంశం ఇది. కాని, ఇక్కడ విబ్రాంతికరం ఏంటంటే మన పాలకుల జాతి వ్యతిరేక స్వార్థ చింతన!

అసలు కాశ్మీర్ సమస్యకు నెహ్రు ఎంతగా మూల కారణమో అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఇందిర దైర్యంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించి పాక్ కు చుక్కలు చూపించింది. కాని, ఆమె కూడా ప్రపంచం ముందు మంచి పేరు తెచ్చుకోవటం కోసం 90వేల మంది పాక్ సైనికుల్ని బేషరతుగా విడిచిపెట్టింది. కాని, బంగ్లాదేశ్ యుద్దం తరువాత మన వద్ద గొప్ప అవకాశం వుండింది. పాక్ తన 90వేల సైనికులు, మన చేతిలో వున్న కరాచీ నగరం కోసం అప్పుడే కాశ్మీర్ సమూలంగా మనకు ఇచ్చేసేది. కాని, చరిత్రలో తనకంటూ గొప్ప పేరు వుండాలని ఇందిరా గాంధీ కాశ్మీర్ తేల్చకుండానే పాక్ ను విడిచిపెట్టేసింది!
ఇందిర తరువాతి కాలంలో పీఎం అయిన మరో అతి సెక్యులర్ మేధావి ఐకే గుజ్రాల్. బారత దేశ ముస్లిమ్ లను వెనకేసుకు రావటానికి, పాక్ ను వెనకేసుకురావటానికి కూడా ఈయనకు తేడా తెలియదు. పాకిస్తానీలు తనకు ఓటు వేస్తారన్నట్టుగా రా కార్యకలాపాలు మూసేయించాడు. అవును, గుజ్రాల్ మహానుభావుడు పాక్ పై నిఘా పెట్టే ఆర్ సంస్థ కార్యకలాపాలే కట్టి పెట్టేశాడు! అది సృష్టించిన సమాచార లోపమే చివరకు వాజ్ పేయ్ టైంలో కార్గిల్ ఉదంతంగా మారింది. 

వాజ్ పేయి,ఇప్పుడున్న మోదీ కూడా పాక్ తో సత్సంబంధాలే కోరుకున్నారు. కాని, చరిత్ర స్పష్టంగా చెబుతోన్న గుణపాఠం ఏంటంటే పాక్ ది వంకర తోక. అది ఇక్కడి ప్రధాని ఎవరు స్నేహ హస్తం చాచినా ఆ చేయిపై వేటు వేయాలనే చూస్తుంది! అందుకే, ఒకవేళ మన్మోహన్ సియాచిన్ ఇచ్చివేసి వుంటే కూడా ఇలాగే ఉగ్రదాడులు చేస్తూనే వుండేది. పైగా మన సైన్యం ఆ నిర్మానుష్యమైన మంచు ముక్క కోసం చేసిన త్యాగాలు వృథా అయ్యేవి!

కాంగ్రెస్ పాలనలో సాగిన యూపీఏ శకం దారుణమైన పాక్ అనుకూల వాదులకి సాక్షి. ఆ పార్టీ నేత మణిశంకర్ అయ్యర్ మోదీ ప్రధాని అయ్యాక కూడా పాక్ వెళ్లి అక్కడి వారితో కలిసి మోదీని ఓడిద్దాం అంటాడు. దిగ్విజయ్ సింగ్ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని జనాభ్, సాహెబ్ అంటూ గౌరవంగా పిలుస్తుంటాడు. మొన్నటికి మొన్న భారత ఆక్రమిత కాశ్మీర్ అంటూ సిగ్గు లేకుండా మాట్లాడాడు. అంతే కాదు, ముంబై దాడులకి పాక్ ఉగ్రవాదులు కాదు ఆరెస్సెస్ కారణమంటూ రాసిన పిచ్చి పుస్తకాన్ని కూడా దిగ్విజయ్ సింగే ఆవిష్కరించాడు... 

ఎవరో చిన్నా చితక నేతలు కాదు ఏకంగా రాహుల్ గాంధీనే... అరెస్సెస్, ఇస్లామిక్ ఉగ్రవాదం కంటే డేంజర్ అంటూ చెప్పాడు. ఆ విషయం కూడా వికీలీక్సే బయటపెట్టింది! ఇలా పార్టీ మొత్తం ఇండియాకు వ్యతిరేకంగా పని చేస్తూ వచ్చింది సోనియా నేతృత్వంలో. తాజాగా బయటపడ్డ ఆధారాలతో ఇటలీ నుంచే కాశ్మీర్ వేర్పాటు వాదులకి నిధులు కూడా వస్తున్నాయని తేలింది. ఇన్ని విధాలుగా మన నాయకులు దేశానికి హాని చేయటానికి సిద్ధపడ్డారు... 

సియాచిన్ పాక్ కు ఇచ్చేస్తే ఆ దేశం బాగుపడుతుందని ఒకవేళ నిజంగానే మన్మోహన్ ఆశిస్తే అది గొప్పతనం కాదు... ఆయన అమాయకత్వం అవుతుంది. ఇంకా కాదంటే సోనియా కారణంగానే అతను అలా ప్రవర్తించి వుంటాడని అనుకోవచ్చు. ఎందుకంటే, యూపీఏలో ప్రభుత్వం మన్మోహన్ దైనా పాలన సోనియాదే కదా! అప్పుడు ఈ సియాచిన్ పాపం కూడా గాంధీల ఖాతాలోకే వెళ్లాలి... 

By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.