సికిందరాబాద్ అల్ల‌ర్ల సూత్ర‌ధారి ఆవుల అరెస్టు

Publish Date:Jun 18, 2022

Advertisement

కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం ‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం తీవ్ర విధ్వంసం సృష్టించిన కేసులో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ అల్లర్లను పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు ప్రోత్సహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆవుల సుబ్బారావును అతని ప్రకాశం జిల్లా కంభంలో పోలీసులు అదుపులోకి తీసుకుని, నరసరావుపేటకు తరలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆవుల సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లకు సుబ్బారావు పాత్ర ఉందనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సుబ్బారావుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 9 ఆర్మీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.

పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సైన్యం లో చేరేందుకు తమ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను రెచ్చగొట్టి సుబ్బారావు ఈ విధ్వం సాన్ని ప్రోత్సహించినట్లు పోలీసు గుర్తించారు. అగ్నిపథ్ వల్ల నష్టం కలుగుతుందని వీడియో సందేశం ద్వారా ఆర్మీ అభ్యర్థులను సుబ్బారావు రెచ్చగొట్టినట్లు పోలీసులు తేల్చారు. సుబ్బారావు ఆధ్వర్యంలోనే ఆందోళనకారులు సికింద్రాబాద్ వచ్చినట్లు గుర్తించారు. నిరసనకారులకు సుబ్బారావు తమ అకాడమీ లోనే షెల్టర్ ఇచ్చినట్లు కూడా పోలీసులు తేల్చారు. ఆందోళనకారులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సరఫరా చేసినట్లు పోలీసు విచారణలో వెలుగు చూసిందని తెలుస్తోంది.

సికింద్రాబాద్ స్టేషన్ అల్లర్ల కేసులో ఇంతవరకు పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు 12 మంది యువకులు ప్రధాన కారకులని పోలీసుల అనుమానం. వీరంతా ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను రెచ్చగొట్టారని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేష్ బాక్స్, 17/6 గ్రూప్ తో పాటు పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ వాట్సాప్ సందేశాలు ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో పాల్గొన్న పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ లో అల్లర్ల వెనుక కరీంనగర్ లోని స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీం హస్తం ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సికింద్రాబాద్ స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన ఆందోళనకారులపై పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐఆర్ఎస్, ఐపీసీ, జీఆర్పీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐఆర్ఏ 150 సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ లేదా మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉంది. ఈ కేసుల్లో చిక్కు కున్న వారు సైన్యంలో పనిచేసేందుకు అనర్హులవుతారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు కూడా ఇబ్బందులు వస్తాయి.  శిక్ష‌ణ‌నిచ్చేవారే ఉద్రిక్త ప‌రిస్థితులు క‌ల్పించేందుకు పూనుకుంటే స‌మాజం ఏం కావాలి?    

అగ్నిప‌థ్ ప‌థ‌కంతో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల దేశ‌మంత‌టా తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఇంకా  వెల్లువెత్తుతోంది. అన్ని రాష్ట్రాల్లో దాడులు, హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే శుక్ర‌వారం సికింద్రాబాద్‌లో జ‌రిగిన దాడులు, హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు ముఖ్యంగా  రైళ్లకు  నిప్పు పెట్ట‌డా లు వంటివి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ  క‌నీ వినీ ఎరుగ‌నివి. ఇంత స్థాయిలో యువ‌త తిరుగుబాటు, దాడు ల‌కు పూనుకోవ‌డానికి వారిని రెచ్చ‌గొట్టిన‌ది  సాయి డిఫెన్స్ అకాడ‌మీ వ్య‌వ‌స్థాప‌కుడు ఆవుల సుబ్బారావు అని తేలింది. 

సాయి డిఫెన్స్ అకాడెమీ  సైనిక శిక్ష‌ణా కేంద్రాన్నించీ  ప్ర‌తీ యేడూ చాలామందికి శిక్ష‌ణ‌నిచ్చి సైన్యంలో చేర‌డానికి వీలు క‌ల్పిస్తున్నారు. అయితే ఈ సారి కేంద్రం అగ్నిప‌థ్ ప‌థ‌కంతో  సైనిక శిక్ష‌ణ‌లో వున్న యువత‌కు అన్యాయ‌మే జ‌రుగుతుంద‌న్న‌ది స్ప‌ష్ట మ‌యింది. 17 నుంచి 23 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌లో యువ‌త శిక్ష‌ణ‌లో వున్న‌వారికి అగ్నిప‌థ్ ప‌థ‌కం ద్వారా సైన్యంలోకి తీసుకున్న‌ప్ప‌టికీ వారికి  కేవ‌లం నాలుగేళ్లు మాత్ర‌మే ఉద్యోగ భ‌ద్ర‌త వుంటుంది. ఆ త‌ర్వాత తొల‌గించ‌వ‌చ్చు. ఈ  నియ‌మం దేశంలో సైనిక శిక్ష‌ణ పొందుతున్న యువ‌త‌కు ఆశాభంగ‌మ‌యింది. దాన్ని వ్య‌తిరేకిస్తూ దేశంలో యువ‌త తిరగ బ‌డ్డారు. కానీ కేంద్రం ఇసుమంత కూడా వెన‌క‌డుగు వేయ‌లేదు.   ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికే  గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది. 

ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో రైళ్ల ద‌గ్ధం, హైద‌రాబాద్ లో అనేక ప్రాంతాల్లో అల్ల‌ర్లు, పోలీసుల లాఠీచార్జీ చివ‌ర‌గా ఫైరింగ్ కూడా చోటుచేసుకుంది. అస‌లు కుర్రాళ్లు ఇంత‌గా రెచ్చి పోవడానికి రైళ్ల రాక‌పోక‌ల‌ను స్థంభింప‌జేయ‌డానికి వారిని రెచ్చ‌గొట్టింది ఆవుల సుబ్బారావు డిఫెన్స్  అకా డ‌మీ సృష్టించిన ప్ర‌త్యేక యాప్ పుణ్య‌మే అన్న‌ది తేట‌తెల్ల‌మ‌యింది. వాట్స‌ప్ గ్రూప్ ద్వారా వేగంగా స‌మా చారం విస్త‌రించి మ‌రింత మంది రెండు తెలుగు రాష్ట్రాల యువ‌త విరుచుకుప‌డ్డార‌న్న‌ది బ‌య‌ట ప‌డిం ది.  ఇదంతా చాలా ముందుగానే ప్లాన్ చేసుకుని అమ‌లు చేసిన ప‌థ‌కంగా తోస్తోంద‌ని ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తున్న విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రీ దారుణ‌మేమంటే అటు ఆంధ్రా నుంచి పెద్ద సంఖ్య‌లో యువ‌త వ‌చ్చి ఇక్క‌డ దాడుల్లో పాల్గొన‌డానికి కావ‌ల‌సిన మ‌ద్ద‌తు సుబ్బారావు సృష్టించిన యాప్ ద్వారానే ల‌భించింద‌న్న వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. శిక్షణ‌నిచ్చిన వారే ఇలాంటి దాడులు, దారుణాల‌కు ప్రోత్స హించ‌డం అమానుష‌మే అవుతుంది. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ డిఫెన్స్ అకాడెమీలు, శిక్ష‌ణా కేంద్రాలు మ‌రో విధంగా శాంతియుతంగా త‌మ గోడును తెలియ‌జేయాలి అనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కానీ చాలా కాలం నుంచి శిక్ష‌ణ పొందుతూ ఎంతో ఆశ‌తో ఎదురుచూస్తున్న యువ త‌కు కేంద్రం అగ్నిప‌థ్ నిర్ణ‌యం పెద్ద షాక్ అనాలి. వూహించ‌ని నిర్ణ‌యానికి వూహించ‌ని ప‌రిణామాలే చోటుచేసుకున్నాయి. 

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.