పంచాయతీలకు ఆన్ లైన్ నామినేషన్లు? జగన్ కు నిమ్మగడ్డ షాక్ ఇవ్వబోతున్నారా? 

Publish Date:Jan 28, 2021

Advertisement

ఏపీ సర్కార్, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య తీవ్ర వివాదంగా మారిన పంచాయతీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టు తీర్పుతో కొలిక్కి వచ్చింది. జగన్ సర్కార్ ఎన్ని ఎత్తులు వేసినా పంచాయతీ ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల నిర్వహణలోనూ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా నామినేషన్ల అంశంలోనూ నిమ్మగడ్డ అధికార పార్టీకి షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

పంచాయతీ పోరులో వీలైనన్ని ఎక్కువ గ్రామాలను ఏకగ్రీవంగా గెలుచుకోవాలని అధికార వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను భారీగా పెంచేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంపై  ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  నజరానాలను ఎరగా చూపి ఏకగ్రీవాలు చేసుకోవాలని, అవసరమైతే ఇతర పార్టీ నేతలను భయపెట్టి, బెదిరించి నామినేషన్లు వేయకుండా చూడాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని.., ప్రతిపక్షాలు బలపర్చే అభ్యర్థులను పోటీ చేయనీయకుండా బెదిరిస్తున్నారని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్ లైన్ నామినేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

బీజేపీ, జనసేన నేతలు  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.  ఏకగ్రీవాల విషయంలో ప్రభుత్వం వైఖరిని వారు గవర్నర్ కు వివరించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగేలా చూడాలని కోరారు. బీజేపీ నుంచి  సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్ జీ.. జనసేన తరఫున నాదేండ్ల మనోహర్, శ్రీనివాస్ యాదవ్  రాజ్ భవన్ వెళ్లారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా చోట్ల ఏకగ్రీవం చేసేందుకు, విపక్ష పార్టీల అభ్యర్థులు పోటీలో లేకుండా చేయడం, నామినేషన్లు వేసిన వారిని కూడా భయపెట్టి వారు విత్ డ్రా చేసుకునేలా చేసిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ, జనసేన నేతలు.  

 పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వానికి అడ్డుకట్ట వేయాలంటే ఆన్ లైన్ నామినేషన్లు ఒక్కటే మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏకగ్రీవాల పేరుతో ప్రతిపక్ష అభ్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలను పునరావృతం కాకుండా ఉంటే ఆన్ లైన్ నామినేషన్ ఒక్కటే మార్గమని.. అలాగే అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్ వేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు సోము వీర్రాజు. అధికార పార్టీ దాడులను అరికట్టాలని ఎస్ఈసీని కోరారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు యత్నిస్తోందని.. ఎస్ఈసీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు ఉపేక్షించేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. . 

ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.., ఏకగ్రీవాలపైనే దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చేరు. బలవంతపు ఏకగ్రీవాలు ఎక్కడ జరిగినా అడ్డుకోవాలన్నారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని ఆదేశించారు. ఏకగ్రీవాల సంఖ్య అపరిమితంగా పెరిగితే ఖచ్చితంగా జోక్యం చేసుకుంటామన్నారు నిమ్మగడ్డ.  తాజా పరిణామాల నేపథ్యంలో ఆన్ లైన్ లో నామినేషన్ల స్వీకరణపై అధికారులతో నిమ్మగడ్డ చర్చిస్తున్నారని తెలుస్తోంది. సాఫ్ట్ వేర్ సమస్యలపై చర్చించాకా.. ఆయన ఆన్ లైన్ నామినేషన్ల దిశగా చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్న అధికార పార్టీ ప్రయత్నాలకు చెక్ పడినట్లే.  

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.