ప్రధాని మోడీ డేంజర్ గేమ్ ఆడుతున్నారా? ఎర్రకోట ఘటనతో జనాల్లో భయాందోళన?

Publish Date:Jan 28, 2021

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీ నిప్పుతో చెలగాటమాడుతున్నారా? గత అనుభవాలు కమలనాధులను  భయపెడుతున్నాయా? దేశం ఎటు వైపు వెళుతుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోందా?  దేశంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇవే అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా రైతులు చేస్తున్న ఉద్యమం గణ తంత్ర దినోత్సవం రోజున హస్తినలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీతో గతి తప్పింది. దేశ రాజధానిలో హింసకు కారణమైంది. దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా కొందరు వ్యక్తులు  ఎర్రకోటలోకి చొరబడటం..  ప్రతి ఏటా ప్రధానమంత్రి  జాతీయ జెండా ఎగరేసే చారిత్రక కట్టడంపై రైతన్న జెండా ఎగరవేయడం  తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన పరిణామాలు దేశ ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఎర్రకోట ఘటన తర్వాత వెలుగుచూస్తున్న విషయాలు మరింత విస్మయపరుస్తున్నాయి. 
     
ఎర్రకోటను మట్టడించింది తమ పని కాదని, విద్రోహ శక్తులు తమ ర్యాలీలో చేరి అల్లర్లు సృష్టించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.  ఖలీస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ర్యాలీలో చొరబడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రాక్టర్ల పరేడ్ సందర్భంగా కొందరు తల్వార్లతో రోడ్లపై తిరగడం, పోలీసులపై దాడి చేయడం వంటి ఘటనలు జరగడంతో.. ఢిల్లీ అల్లర్ల వెనక సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఖలీస్తాన్ ఉగ్రవాదుల పేరుతో ఒక సామాజిక వర్గాన్ని కొందరు టార్గెట్ చేస్తున్నారు. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదీ దేశానికి ప్రమాదకరమని కొందరు మేధావులు చెబుతున్నారు. ఇందుకు గతంలో జరిగిన పరిణామాలను వారు వివరిస్తున్నారు. గతంలో సిక్కులకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుని.. ఐరన్ లేడీగా పేరొందిన ఇందీరా గాంధీనే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. 

మన దేశ రక్షణలో సిక్కులు, పంజాబీల పాత్రే గొప్పది. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కువగా అసువులు బాసింది పంజాబీలే. దేశ స్వాతంత్రం కోసం ఉరి తీసిన 121 మందిలో 93 మంది పంజాబీలే ఉన్నారు. జీవిత ఖైదు విధించిన 2 వేల 626 మందిలో 2 వేల 147 మంది పంజాబీలేనని లెక్కలు చెబుతున్నాయి.  ఇండియా ఆర్మీలో ఎక్కువ మందే వారే ఉంటారు. దేశం కోసం ఏటా వందలాది ప్రాణాలు అర్పిస్తుంటారు. దేశ భక్తిలో సిక్కులతో ఎవరూ పోటీపడలేరని చెబుతారు. అలాంటి సిక్కుల గురించి కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం అందరిని కలవరపరుస్తోంది. రైతుల ఉద్యమంపై  మొదటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు బీజేపీ నేతలు. రైతులకు ఖలిస్తానీయులు, మావోయిస్టులతోను లింక్ ఉందన్నారు. కేవలం పంజాబ్ రైతులే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని మరికొందరు ఆరోపించారు. బీజేపీ నేతల కామెంట్లపై సిక్కు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ రక్షణలో ముందుండే సిక్కులతో విభేదాలు తెచ్చుకోవడం మంచిది కాదనే అభిప్రాయం బీజేపీ సీనియర్ల నుంచి కూడా వస్తుందట. 
 
 ఢిల్లీ హింసాత్మక ఘటనల తర్వాత కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.  కేంద్ర సర్కార్ సమస్య పరిష్కారానికి సీరియస్ గా స్పందించలేదనే ఆరోపణలే ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నాయి. రైతులను ఒప్పంచి ఆందోళన విరమించేలా చేస్తే.. ప్రపంచం ముందు భారత్ పరువు పోయేది కాదనే  అభిప్రాయం  వస్తోంది. రైతుల చేస్తున్న పోరాటాన్ని గౌరవించి వారితో కేంద్ర సర్కార్ చర్చలు జరిపితేనే బెటరనే చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి చర్చలు జరిపితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందంటున్నారు. రైతుల దగ్గరకే మోడీ వెళితే.. ఆయన కూడా హీరోగా నిలుస్తారని  చెబుతున్నారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాకా దేశాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరికింది. అయోధ్య రామాలయం, త్రిపుల్ తలాక్, జమ్మూ కశ్మీర్ సమస్యలు కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు రైతుల ఆందోళన విరమించేలా ప్రధాని మోడీ చొరవ తీసుకుని.. వారితో చర్చించి సమస్య పరిష్కరిస్తే.. ఇది కూడా ఆయన చరిత్రాత్మక విజయాల్లో ఒకటిగా నిలిచిపోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది. 

అంతేకాదు తమిళనాడు రాజకీయాల్లోనూ ప్రస్తుతం బీజేపీ డేంజర్ రోల్ పోషిస్తోంది. కరుణానిధి, జయలలిత మరణాల తర్వాత తమిళనాడులో పాగా కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం అన్నాడీఎంకేను పావుగా వాడుకుంటోంది. సినిమా స్టార్ రజనీకాంత్ తో కొత్త పార్టీకి ప్లాన్ చేసింది. కమల్ హాసన్ ను రెచ్చగొడుతోంది. శశికళ అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందని తమిళనాడు ప్రజల్లో వాదన ఉంది. మొత్తంగా తమిళనాడులో కొంత కాలంగా బీజేపీ చేస్తున్న రాజకీయాలతో తమిళులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. గతంలో తమిళులకు వ్యతిరేకించిన కొన్ని నిర్ణయాలు తీసుకున్న రాజీవ్ గాంధీకి ఏం జరిగిందో దేశ ప్రజలందరికి తెలుసు. అందుకే రైతుల ఆందోళన, సిక్కులపై వస్తున్న విమర్శలు, తమిళ రాజకీయాలు.. ఇవన్ని తమకు ఆందోళన కలిగించేవే అన్న ఆందోళన బీజేపీలో కనిపిస్తుందని తెలుస్తోంది.

 మొత్తంగా  కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో దేశం ఎటు వైపు దారి తీస్తుందోనన్న భయం జనాల్లో ఉందని తెలుస్తోంది. బీజేపీ సర్కార్ ఇప్పటికైనా మేల్కొని.. సమస్యలను పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు. లేకపోతే  గతంలో కాంగ్రెస్ కు జరిగినట్లే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి రావచ్చని కూడా కొందరు పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.   

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.