Publish Date:Jul 27, 2022
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఐదో నెలలోకి ప్రవేశించింది. ఆ యుద్ధం ఆ రెండు దేశాలనే కాక ప్రపంచ దేశాలన్నిటినీ ఆర్థిక ఇక్కట్లలోకి నెట్టివేసింది. ఒక విధంగా ఇది యుద్ధం కాదు.. రష్యా దురాక్రమణ అని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నా రష్యా మాత్రం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లు వ్యవహరిస్తోంది. యుద్ధం విరమించాలని రష్యాను ఐరాస సహా పలు దేశాలు కోరాయి. ఒత్తిడి తెచ్చాయి. ఆంక్షలు విధించాయి. ఐదు నెలలుగా ససెమిరా అంటూ వచ్చిన రష్యా ఎట్టకేలకు ఒక మెట్టు దిగింది.
ఉక్రెయిన్ నుంచి గోధుమలు, వంట నూనె వంటి నిత్యావసరాల ఎగుమతికి అంగీకరించింది. రష్యా నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. యుద్ధ విరమణ దిశగా ఇది ఒక ముందడుగుగా అభివర్ణించాయి. ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియెట్ రష్యాలో అంతర్భాగంగా ఉండి, ఆ తరువాత రష్యా అండదండలతో ఆహార, ఇంధన రంగాల్లో ఎదిగిన ఉక్రెయిన్ రష్యా వ్యతిరేక కూటమి అయిన నాటోలో చేరడాన్ని జీర్ణించుకోలేక రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది. చిన్న దేశం చిదిమేయవచ్చని భావించిన రష్యాకు ఆ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగడం మింగుడుపడటం లేదు.
మరో వైపు స్వదేశంలోనూ పుతిన్ పై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధోన్మాదమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఈ నేపథ్యంలోనే రష్యా ఒక మెట్టు దిగి వచ్చి నల్ల సముద్రం మీదుగా నిత్యావసరాల రవాణాకు అనుమతి ఇచ్చింది. అయితే దీనితోనే అంతా అయిపోయిందని భావంచడానికి లేదు.
మొత్తంగా యుద్ధం విరమించి శాంతి వాతావరణం ఏర్పడితేనే ప్రపంచానికి మేలు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అనివార్యంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు వస్తాయన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమౌతున్నది. అన్న వస్త్రాలకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళనా వ్యక్తమౌతోంది. ఇప్పటి వరకూ రష్యాను సమర్థిస్తూ వచ్చిన చైనా వంటి పలు దేశాలు కూడా యుద్ధాన్ని విరమించాలంటూ రష్యాకు సూచనలు చేస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/russia-ukrain-war-a-step-towards-peace-25-140697.html
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.