కొత్త రాష్ట్రపతికి విపక్షాల లేఖ

Publish Date:Jul 27, 2022

Advertisement

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు విపక్ష సభ్యుల సస్పెన్షన్లతో కొనసాగుతోంది. సమావేశాలు ప్రారంభమ రెండో వారంలోకి ప్రవేశించినా ఇప్పటి వరకూ సభ సజావుగా సాగింది లేదు. నినాదాలు, ఆందోళనలు, సస్పెన్షన్లకే పరిమితమైంది.   ప్రతిపక్షాలపై కేంద్రం ఈడీ, సీబీఐలను ప్రయోగించడాన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉభయ సభలలోనూ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది.  

ప్రజల సమస్యలను పార్లమెంటులో  ప్రస్తావించేందుకే ప్రజలు తమను ఎన్నుకున్నారనీ, అయితే కేంద్రం అందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదనీ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. సభలో నోరెత్తితే సస్పెండ్ చేస్తున్నారనీ, బయట ఆందోళన చేస్తుంటే అరెస్టు చేస్తున్నారనీ, కేంద్రంపై విమర్శలు చేస్తే ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నారనీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయంపై విపక్షాల సభ్యులు కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంయుక్తంగా ఓ లేఖ రాశాయి.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి   ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా తమను కేంద్ర ప్రభుత్వం  అడ్డుకుంటోందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. అలాగే   ప్రతిపక్ష నేతలపై  ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ), సీబీఐలను కేంద్రం ఉసిగొల్పు తోందనీ, పాత కేసులను తవ్వుతూ, అక్రమంగా కొత్త కేసులను బనాయిస్తోందని వారా లేఖలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిపై మాత్రమే ఈడీ, సీబీఐలు దాడులు చేస్తోందని వారు పేర్కొన్నారు. తమ ఆరోపణలలోని వాస్తవాలను గుర్తించి తగిన విధంగా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని వారా లేఖలో కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. సోనియాగాంధీని ఈడీ విచారణ పేరుతో  రోజుల తరబడి మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగితే.. పోలీసులు రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన విపక్షాలు కొత్త రాష్ట్రపతికి రాసిన లేఖలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిందంటూ పేర్కొన్నారు.

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడం, దేశ వ్యాప్తంగా పలు ప్రతిపక్ష ఎంపీలు, నాయకుల ఇళ్లపై దాడులు ఈడీ దాడులను కూడా ప్రతిపక్ష ఎంపీలు తమ సంయుక్త  లేఖలో ప్రస్తా వించారు.   ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాల హక్కులను కాపా డాల్సిన బాధ్యత దేశ రాష్ట్రపతిపై ఉందని ఉందని విపక్షాలు ఆ లేఖలో పేర్కొన్నాయి. ప్రతిపక్ష ఎంపీలపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని వారు ఎండగట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ విపక్షాల పట్ల ఇంత కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్షాలు రాసిన లేఖపై కొత్త రాష్ట్రపతి ఎలా స్పంది స్తారో వేచి చూడాలి.   

By
en-us Political News

  
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.