Publish Date:Jul 27, 2022
ప్రజలకు గతంలో తాను చెప్నిన మాటలు గుర్తుండవు అనుకున్నారో ఏమో జగన్ పోలవరం నిర్వాసితుల విషయంలో గతంలో మాట్లాడిన దానికి పొంతన లేకుండా మాట్లాడారు. వారికి మతిమరుపు ఎక్కువ అని ఆయన భావం అయి ఉంటుంది. అందుకే పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ఆర్ ( రిహెబిలిటేషన్ అండ్ రీ సెటిల్ మెంట్) ప్యాకేజీ తన వల్ల కాదని చెప్పేశారు. కేంద్రమే ఇవ్వాలని కానీ కేంద్రం ఇవ్వడం లేదనీ నెపం కేంద్రం మీదకు నెట్టేశారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటే 20 వేల కోట్లు అవసరం అవుతుందని, అది కేంద్రం ఇవ్వాలే కానీ తన వల్ల ఎలా అవుతుందని బీద అరుపులు అరిచారు. పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఆయన బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పిన విషయాలివి. అయితే గతంలో అంటే విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడిన విషయాన్ని పోలవరం నిర్వాసితులు గుర్తు చేస్తున్నారు.
గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు కేంద్రం ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు ఆ ఆర్థిక ప్యాకేజీలో ఆర్ఆండ్ ఆర్ ప్యాకేజీని కూడా ఆ ఆర్థిక ప్యాకేజీలో చేర్చారు. అంతే వంద శాతం ప్రాజెక్టు వ్యయం కేంద్రమే భరించేలా ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే అప్పట్లో విపక్ష నేత హోదాలో జగన్ దీనిని పూర్తిగా వ్యతిరేకించారు.అంచనాలు పెంచడాన్ని జగన్ గట్టిగా వ్యతిరేకించారు. చంద్రబాబు అవినీతి కోసమే అంచనాలు భారీగా పెంచేశారని విమర్శలు గుప్పించారు.
ఇదే విషయాన్ని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఫిర్యాదుల ఆధారంగానే కేంద్రం అంచనాలను తగ్గించేసింది. ఆర్ఆర్ ప్యాకేజీతో తనకు సంబంధం లేదని కేంద్రం తేల్చేసింది. గతంలో అంటే జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు ఎకరానికి పది వేలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పది లక్షల సంగతి మరిచిపోయి ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఎకరాకు ఐదు లక్షలంటూ చెబుతున్నారు. తీసుకున్న అప్పుల లెక్కలు మార్చేసినట్లుగానే హామీ ఇచ్చిన పది లక్షలను వదిలేసి తానిచ్చిన హామీ ఐదులక్షలే అని చెప్పడానికి ఇసుమంతైనా సంకోచించడం లేదు.
జగన్ వైఖరిని పరిశీలకులు తప్పుపడుతున్నారు. జగన్ తన తీరుతో పోలవరం ప్రాజెక్టునూ, పోలవరం నిర్వాసితులనూ నిండా ముంచేశారని విమర్శిస్తున్నారు. ఇక జగన్ వ్యాఖ్యలు కేంద్రాన్నీ ఇరుకున పెట్టాయి. పోలవరం అంచనాల పెంపు వెనుక భారీ అవినీతి ఉందని, అంచనాలు పెంచవద్దని జగన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే అంచనాలను తగ్గించేశామని కేంద్రం చెబుతోంది. ఇప్పుడు అదే జగన్ కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని కేంద్రంపై ఆరోపణలు చేయడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులకు జగన్ గతంలో చేసిన ప్రసంగాల, అప్పటి చంద్రబాబు సర్కార్ పై పోలవరం అవినీతిపై చేసిన విమర్శలను ప్రజలలోకి తీసుకువెళ్లి జగన్ వైఖరిని ఎండగట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-uturn-on-polavaram-expatriates-25-140695.html
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.