పాపం రోజా..నామినేషన్ ర్యాలీ వెలవెల!

Publish Date:Apr 23, 2024

Advertisement

రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన నటి.  ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె తెలుగుదేశంలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట.  విశాఖ విమానాశ్రయంలో   మధ్య వేలు చూపించి జనసైనికులను రెచ్చగొట్టగలరు. అలాంటి రోజాకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే  సీన్ సితార అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయాన్ని గతంలో రోజాయే స్వయంగా అంగీకరించారు. మంత్రినైన తనను నియోజకవర్గంలో బలహీనపరిచే విధంగా ప్రతిపక్షాల వాళ్లు నవ్వుకునేలా సొంత పార్టీ వారే వ్యవహరిస్తున్నారని రోజా దాదాపు ఏడాదిన్నర కిందటే కళ్లనీళ్లు పెట్టుకుని మరీ మీడియా ముందు చెప్పారు.   సొంత నియోజకవర్గంలోనే రోజాకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైందని అప్పట్లోనే  అందరికీ అవగతమైపోయింది.  దీంతో రోజా వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ లభించే అవకాశాలు లేవని కూడా అప్పట్లో బాగా  ప్రచారం అయ్యింది. అయితే ఈమె నగరి నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అంత వరకూ ఓకే కానీ తన విజయం కోసం నియోజకవర్గ నేతలు పని చేసేలా సమాయత్తం చేసుకోవడంలో  మాత్రం విఫలమయ్యారని ఆమె నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీని చూస్తే అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. 

వాస్తవానికి ఆమె గెలిచిన రెండు సార్లూ కూడా నగరిలో రోజాకు స్వల్ప మెజారిటీయే వచ్చింది. 2014 ఎన్నికలలో రోజా తెలుగుదేశం సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై 871 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో గాలి ముద్దుకృష్ణమ తనయుడు గాలి భాను ప్రకాష్ పై 2,007 ఓట్లు తేడాతో గెలుపొందారు. జగన్ హవా నడిచిన ఆ ఎన్నికలలో ఆ మెజారిటీ స్వల్పమనే చెప్పాలి. 

 ఈసారి ఎన్నికల్లో  కూడా రోజాకు భాను ప్రకాశ్  ప్రత్యర్థి. గత ఎన్నికలలో  ఓడిపోయిన భాను ప్రకాశ్ పై నియోజకవర్గం ఓటర్లలో సానుభూతి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీనికి తోడు నగరి నియోజకవర్గంలో రోజాకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఈ నేపథ్యంలో ఆమె నగరి నుంచి హ్యాట్రిక్ సాధించాలన్న ఆశలు ఆవిరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే రోజాను వ్యతిరేకించే వైసీపీలోని బలమైన వర్గం.. తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అలా చేరకుండా వైసీపీలోనే ఉన్నవారు ఆమెకు సహాయ నిరాకరణ చేస్తూ లోపాయికారీగా తెలుగుదేశంకు సహకరిస్తున్నారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజా విజయం కోసం సహకరించే ప్రసక్తే లేదని నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. రోజాకు నియోజకవర్గ పార్టీ నేతలతో ఉన్న విభేదాలకు ఆమె నామినేషన్ ర్యాలీ అద్దం పట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సొంత నియోజకవర్గం నుంచి పార్టీకి చెందిన నేతలు ఎవరూ రోజా నామినేషన్ ర్యాలీలో పాల్గొనకపోవడంతో ఆమె బైరెడ్డి సిద్ధార్థరెడ్డి  ముఖ్యఅతిధిగా అహ్వానించి నామినేషన్  దాఖలు చేయాల్సి వచ్చింది.  గత ఎన్నికలలో రోజా విజయం కోసం కృషి చేసిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి,   మురళీనాథరెడ్డి వంటి వారు రోజా ను గెలిపించడం కోసం పని చేసే ప్రసక్తే లేదని ప్రకటించి మరీ  పరోక్షంగా తెలుగుదేశం అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కు సహకారం అందిస్తున్నారు. రోజా విషయంలో పార్టీ హైకమాండ్ కూడా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అసమ్మతిని బుజ్జగించే పని కూడా చేయడం లేదు. దీంతో రోజా హ్యాట్రిక్ డ్రీమ్ నెరవేరే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు. 

By
en-us Political News

  
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది.
ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ నేతల ప్ర‌చారం హోరెత్తుతోంది. రాష్ట్రం న‌లుమూల‌లా అభ్య‌ర్థులు గెలుపుకోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్త‌యితే గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌, మేధావి వ‌ర్గ‌మూ ఎక్కువే. అలాంటి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం అభ్య‌ర్థి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్​లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భ‌య‌ప‌డ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.