ఏపీ డీజీపీని సాగనంపిన ఎన్నికల కమిషన్

Publish Date:May 5, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌కి వీర భక్తుడిగా పేరు తెచ్చుకున్న డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. రాజేంద్రనాథ్ రెడ్డి తక్షణం ఎన్నికల విధుల నుంచి వైదొలగాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గారికి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ బాధ్యతనూ అప్పగించవద్దని చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి డీజీపీ ఎంపిక కోసం సోమవారం ఉదయం 11 గంటల లోగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను తమకు పంపాలని ఆదేశించింది. పేర్లను పంపడం మాత్రమే కాకుండా ఈ ముగ్గురికి సంబంధించిన ఐదేళ్ళ కాలానికి సంబంధించిన పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికలను కూడా పంపించాలని సూచించింది. రాజేంద్రనాథ్ రెడ్డి జగన్‌కి విధేయుడిగా పనిచేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల కమిషన్ ఈ చర్య తీసుకుంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి విజయం ఖారారైపోయింది. ఈ విషయాన్ని పోలింగ్ కు ముందు.. అంటే షెడ్యూల్ విడుదల కావడానికి ముందు వెలువడిన దాదాపు డజన్ ప్రముఖ సర్వే సంస్థలు చెప్పేశాయి. పోలింగ్ సరళి, పోలింగ్ తరువాత వైసీపీ నేతలు, శ్రేణుల భాష, బాడీ లాంగ్వేజ్ కూడా తెలుగుదేశం కూటమిదే అధికారమని చెప్పకనే చెప్పేశాయి.
మన యువతను మోసం చేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్ల ఆటకట్టించాలని, ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు.
నరేంద్ర మోడీ కంటే చంద్రబాబు ఒక మెట్టు పైనే వుంటారు. అందుకే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అవ్వాల్సిన ఒక కీలక అంశం.. చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్.
దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది ఇప్పటివరకు అయిదు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది.
నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) కీలకం కాబోతోంది. బారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్న నియోజకవర్గాలను పక్కన పెట్టేస్తే.. హోరాహోరీగా పోటీ జరిగిన నియోజకవర్గాలలో మాత్రం నోటా గెలుపు ఓటములను కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. జూన్ 4వ తేదీన ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
వైసీపీ నేతలు ఓటమి భయంతోనే హింసకు పూనుకున్నారు. జూన్ 4న బాక్సులు బద్దలైయ్యేలా ప్రజా ఆమోదంతో టీడీపీ అఖండ మెజార్టీతో గెలవబోతుంది అని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ధీమా వ్యక్తం చేశారు. అధికారులు భయపడాల్సిన అవసరంలేదు. లీవ్‌లు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరంలేదు.
అసలే ఓటమి భయంతో వణికి పోతున్న వైసీపీ నేతలకు ఇప్పుడు షర్మిల విమర్శల దాడి పుండుమీద కారం చల్లినట్లుగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు వైసీపీకీ, జగన్ కు వ్యతిరేకంగా గొంతెత్తినా వారిని తెలుగుదేశం పెయిడ్ అర్టిస్టులంటూ నిందలేని, విమర్శలు చేసి నానాయాగీ చేసి చంకలు గుద్దుకున్న వైసీపీ నేతలకు షర్మిల రిటార్డ్ మింగుడు పడలేదు.
పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లను బద్దలుకొట్టిన కేసులో పరారీలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి హై కోర్ట్ లో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్న తరుణంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-11
ఆంధ్రప్రదేశ్ లో మార్పు ఖాయమని తేలిపోయింది. మార్చి 13న రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో, మార్పు కావాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మరీ పోలింగ్ బూత్ లకు వచ్చి గంటల తరబడి నిలబడి మరీ ఓటు వేశారు. తమ ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి కాముకుడి చేతుల్లో పెట్టాలన్న పట్టుదలతో రాష్ట్రాలు, దేశాలలో స్థిరపడి కొలువులు చేసుకుంటున్నవారు కూడా స్వస్థలాలకు ఎన్నో వ్యయప్రయాశలకు ఓర్చి మరీ వచ్చారు. దీంతో రాష్ట్రంలో భారీగా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళి వైసీపీ పెద్దల మైండ్ బ్లాక్ చేసింది.
మధ్యం మత్తులో యువతీ యువకుల అరాచ‌కాల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డ్రగ్స్ , గంజాయి తదితర మత్తుపదార్ధాలకు అలవాటుపడి నేషనల్ హైవే రోడ్ పై, ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లోనే గొడవపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.