Publish Date:Apr 12, 2024
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్న వైసీపీ చిత్రవిచిత్ర ఆటల సంగతి అటుంచితే, కేంద్రప్రభుత్వానికి సంబంధించిన వివిధ విభాగాలు కూడా అమరావతి విషయంలో తమవంతు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలో వుండగా జరిగిన అమరావతి అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ కుట్రల కారణంగా ఆగిపోయింది. అమ్మ పెట్టా పెట్టదు
అడుక్కుతినానివ్వదు అన్నట్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని పట్టించుకోదు.. అటు కేంద్రానికి చెందిన సంస్థలకు సహకరించదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల కారణంగా కేంద్రం నుంచి అమరావతికి అందాల్సిన ఎన్నో ప్రయోజనాలు ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల సాకు చూపిస్తూ అమరావతిని అణిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ‘క్లారిటీ లేదు’ అనే సాకు చూపించి ముఖం చాటేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆ లిస్టులో తాజాగా రిజర్వ్ బ్యాంక్ కూడా చేరింది.
విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. దీని కోసం తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో 11 ఎకరాలు కేటాయించింది. ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి కూడా అంత స్థలం వుందో లేదో మరి. తెలుగుదేశం ప్రభుత్వం స్థలం కేటాయించినా ఆర్బీఐ అమరావతిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా నిద్రపోయింది. పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయి వైసీపీ పాపకాలం ప్రారంభమైన తర్వాత నిద్ర మేలుకున్న ఆర్బీఐకి పాపం రాజధాని విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించలేక చేతులెత్తేసింది.
అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు మహాప్రభో అని అఖిల భారత పంచాయితీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. దాంతో ప్రధానమంత్రి కార్యాలయం ఆర్బీఐని సూదితో గుచ్చింది. ఉలిక్కలిపడి నిద్ర లేచిన ఆర్బీఐ, తమకు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని లేఖ రాసింది.ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో క్లారిటీ లేదని రిజర్వ్ బ్యాంక్ అనడం అమాయకత్వం అనాలో, అజ్ఞానం అనాలో అర్థం కాని పరిస్థితి.
ప్రధానమంత్రి మోడీ రాజధానిగా శంకుస్థాపన చేసింది అమరావతికి. కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది రాజధాని అమరావతి అనే. కేంద్రప్రభుత్వం లెక్క ప్రకారం ఇప్పటి వరకు అయితే అమరావతే రాజధాని. ఈ ఏడాది జూన్ వరకు హైదరాబాద్ కూడా రాజధాని అయిప్పటికీ ఆ తర్వాత రాజధాని అమరావతే అనే విషయంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భారతదేశ పటంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే వుంది. ఇన్ని అధికారిక ఆధారాలు వుండగా, మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అనవసరపు రచ్చని ఎందుకు ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటున్నదనేది అర్థం కాని విషయం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reserve-bank-politics-on-capital-amarawati-25-173634.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.