వైసీపీలో విస్త‘రణం’.. అధినేత‌పై ధిక్క‌ర‌ణం!

Publish Date:Apr 15, 2022

Advertisement

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంత కాలం  ఏదైతే తన బలం అని చెప్పుకుంటూ  వచ్చిందో  అదే పెద్ద బలహీనత అని ఇటీవలి మంత్రి వర్గ విస్తరణ తేటతెల్లం చేసేసింది.  ఇంకెంత  మాత్రం  ఆ  పార్టీ  తన బలం గురించీ.. 151 మంది సభ్యుల బలగం గురించీ జబ్బలు చరుచుకునే అవకాశం లేదు.  పార్టీలో ఐక్యత అన్నది మంత్రి వర్గ  విస్తరణతో నీటి బుడగలా పేలిపోయింది. ఇంత కాలం జగన్ మాటే శిలా శాసనంగా అనుకుంటూ వచ్చిన వారందరికీ అది భ్రమే అని విస్తరణ అనంతర పరిణామాలు తేటతెల్లం చేసేశాయి. రాజుగారి దేవతా వస్త్రాల భ్రమలు పటాపంచలు చేసేశాయి. అసలింతకీ పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమనడానికి కారణం ఏమిటి? విస్తరణలో పదవులు దక్కకపోవడమేనా?.. లేదా పదవి ఊడిపోవడమేనా? పార్టీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలను గమనిస్తే.. అదొక్కటే కారణం కాదని తేలుతుంది. అధినేత జగన్ విశ్వసనీయత మసకబారడం కూడా ఒక కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పార్టీలో అధినేతకు సన్నిహితులుగా పేరుపడ్డ వారు సైతం అసంతృప్తితో రగిలిపోతుండడానికి కారణం ఏమిటి? ఒక్క సారిగా పార్టీ అత్యంత  బలహీనంగా మారిపోయిందని అనిపించే పరిస్థితి ఎందుకొచ్చింది. పార్టీ వర్గాలయితే ఇందుకు అధినేత జగన్  దే పూర్తి బాధ్యత అనీ, ఈ పరిస్థితికి ఆయనే కారణమనీ అంతర్గత సంభాషణల్లో కుండ బద్దలు కొట్టేస్తున్నారు. 2019లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చెప్పినట్లుగా రెండున్నరేళ్ల తరువాత  కేబినెట్ సహచరులందరినీ మార్చి కొత్త టీంను ఎన్నుకున్నట్లైతే పార్టీలో ఇంతటి స్థాయిలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడేవి కావని అంటున్నారు. 

అయితే ఈ మూడేళ్లుగా జగన్ తన కేబినెట్ సహచరుల పనితీరును ఎసెస్ చేసినట్లు ఎక్కడా కనిపించదు. వారు తమ శాఖపై పట్టు సాధించే అవకాశమూ  ఇవ్వలేదు. అసలు వారికి పని చేసే అవకాశమే లేకుండా చేశారు. ఆమాత్య పదవి కేవలం అలంకారమన్న చందంగా వారి పదవీయోగం సాగింది. ఈ  విషయాన్ని అంతర్గత సంభాషణల్లో పలువురు మంత్రులు అంగీకరించిన దాఖలాలు ఉన్నాయి.  ఏప్పుడో తప్ప మంత్రులకు తమ శాఖలకు సంబంధించి  విలేకరుల సమావేశాల్లో మాట్లాడే అవకాశమేరాలేదు. అంతా రాజకీయ సలహాదారు సజ్జలే కానిచ్చేసేవారు. ఇక వివిధ శాఖలకు సంబంధించిన  సమీక్షల వ్యవహారమంతా జగన్ స్వయంగా చేసేవారు. ఆయా సమీక్షా సమావేశాల్లో ఆయా శాఖల మంత్రుల పాత్ర ఉత్సవ విగ్రహాల కంటే కొంచం తక్కువే. 

దీంతో  కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పదవులు కోల్పోయిన వారు అసలేం చేయనిచ్చారని, పని చేయలేదంటూ తప్పించారు? ఉన్న వాళ్లేం చేశారని పని తీరు బాగుందంటూ కొనసాగించారంటూ నిలదీస్తున్నారు. ఇక కొద్దో గొప్పో విలేకరుల సమావేశాల్లో విపక్షనేతనూ, విపక్ష నేత తనయుడినీ విమర్శల పేరు చెప్పి దూషణల పర్వానికి తెరలేపుతూ నిత్యం వార్తల్లో ఉన్న కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్,  కురసాల కన్నబాబు.. అలాగే ఉన్నంతలో  ప్రభుత్వ విధానాలకు మీడియాకు తెలియజేస్తూ వచ్చిన పేర్ని నానీ వంటి వారికీ పునర్వ్యవస్థీకరణలో వేటు పడింది. 

దీనిని బట్టి చూస్తేనే.. ఏలాంటి హేతు బద్ధతా లేకుండానే పనర్వ్యవస్థీకరణ తంతును జరిపించారని  భావించాల్సి వస్తున్నది. ఆ కారణంగానే ఉద్వాసనకు గురైన వారిలోనే.. ఆశించి భంగపడిన వారిలోనూ ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ధిక్కార స్వరం  సౌండ్ పెరిగింది. ఆ  సీరియస్ నెస్ ను ఆలస్యంగా గమనించిన పార్టీ అధినేత చేతులు కాలితేనేం.. ఆకులుపట్టుకుని నష్ట నివారణ చేద్దాం అన్న చందంగా చివరి నిముషం వరకూ కేబినెట్ సభ్యుల జాబితాలో మార్పులూ, చేర్పులూ చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ఏం చేసినా జరగాల్సిన నష్టం జరగిపోయంది. బుజ్జగింపుల అనంతరం అసంతృప్తి చల్లారిందని ఎంతగా చెప్పుకుంటున్నా.. అదంతా నివురుగప్పిన నిప్పుచందమే.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.