వల్లభనేని వంశీపై కుట్ర చేసిన అజ్ఞాత శత్రువు దేవినేని ఉమానేనా?

Publish Date:Oct 28, 2019

Advertisement

 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీకి గుడ్ బై చెప్తారు అనుకుంటే.. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ని కలిసిన వంశీ.. మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పు అంశంపై దీపావళి తరువాత స్పష్టత ఇస్తానన్నారు. దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరతారని భావించారంతా. కానీ అనూహ్యంగా రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నట్టుగా వంశీ ప్రకటించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబుకి వంశీ తన రాజీనామా లేఖను పంపారు. రాజకీయ కుట్రలు, దాడుల నుంచి తన అనుచరులని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని వంశీ తెలిపారు. అయితే వంశీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కేవలం అధికార పార్టీ నేత రాజకీయ వేధింపులే కాదు.. సొంత పార్టీ నేత కుట్రలు కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజీనామా ప్రకటన అనంతరం వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యక్ష శత్రువుతోనైనా పోరాడొచ్చు కానీ అజ్ఞాత శత్రువుతో పోరాడలేమన్నారు. దీంతో ఇప్పుడు ఆ అజ్ఞాత శత్రువు ఎవరా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ కార్యకర్తలైతే ఆ అజ్ఞాత శత్రువు మాజీ మంత్రి దేవినేని ఉమా అని భావిస్తున్నారు.

కృష్ణ జిల్లాలో పార్టీ పరంగా చంద్రబాబు.. దేవినేని ఉమాకి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇదే చంద్రబాబు చేస్తున్న పెద్ద తప్పని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అసలు దేవినేని తీరు వల్లే జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని కార్యకర్తలు మండిపడుతున్నారు. కొడాలి నాని వంటి వారు పార్టీని వీడటానికి కూడా ఉమానే కారణమని అంటున్నారు. అంతెందుకు ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేయడానికి కూడా ఉమా తీరే కారణమని వార్తలొచ్చాయి.

కృష్ణా టీడీపీ అంటే ఉమా, ఉమా అంటే కృష్ణా టీడీపీ.. అన్నట్టుగా ఉమా ఫీలవుతారని.. జిల్లాలో తాను చెప్పిందే జరగాలని చూస్తారని అంటున్నారు. జిల్లా టీడీపీ నేతలంతా ఆయన చెప్పినట్టే వినాలని, వినకపోతే వారిని ఎదగనివ్వకుండా కుట్రలు చేస్తారని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వంశీ విషయంలో కూడా ఆ అజ్ఞాత శత్రువు ఉమానే అయ్యుంటారని అంటున్నారు. ఉమా తీరు వల్ల జిల్లా టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అధిష్టానం కూడా ఉమా మాటకే ప్రాధాన్యత ఇస్తూ మిగతా వారిని పట్టించుకోకపోవడంతో.. ఏం చేయాలో తెలియక వారు పార్టీని వీడుతున్నారని అంటున్నారు. ఉమా ఇప్పటికైనా తన తీరు మార్చుకొని, అందర్నీ కలుపుకొని పోతూ జిల్లాలో పార్టీకి భవిష్యత్తు ఉండేలా చూడాలని హితవు పలుకుతున్నారు. ఒకవేళ ఉమా తన తీరు మార్చుకోకపోతే.. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా కళ్లుతెరిచి.. ఉమా చెప్పినదానికల్లా తల ఊపకుండా, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకొని.. ఉమాని, పార్టీని గాడిలో పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.

By
en-us Political News

  
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.