Publish Date:Oct 28, 2019
జంట నగరాల్లో నివసించే యాదవులు సంస్కృతి వేడుకగా నిర్వహించే సదర్ ఉత్సవాలు హైదరాబాద్ నార్సింగ్ లో ఘనంగా జరిగాయి. నార్సింగ్ మాజీ సర్పంచ్ వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ వేడుకల్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. యాదవులతో స్థానికులు భారీ దున్నపోతులను సుందరంగా అలంకరించి ఈ సదర్ ఉత్సవాలకు తీసుకొచ్చారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ఈ సదర్ వేడుకల్లో పాల్గొని ఆనందించారు. దున్నపోతుల్ని గ్రామంలో తిప్పుతూ వాటితో విన్యాసాలు చేయించారు. వెంకటేశ్ యాదవ్ తండ్రి హయాం నుంచి నార్సింగి లో సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
అతిపెద్ద పశువుల సంత కూడా ఇక్కడే ఉండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని భారీ దున్నపోతులని ఇక్కడికి తీసుకొస్తారు. దీంతో ఏటా దీపావళి తర్వాత సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్న యాదవ సోదరులు ఈసారి ఉత్సవాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దున్నపోతుల తిండి దగ్గర నుంచి వాటికిచ్చే శిక్షణ వరకు అవి చేసే సాహసాలు ఉత్సవాల్లో ప్రదర్శనకు తీసుకొస్తారు. ఈసారి నార్సింగి లో పంజాబ్ కు చెందిన దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ దున్నపోతుతో యాదవ సోదరులు విన్యాసాలు చేస్తుంటే మరోవైపు వాటిపై ఎక్కిన చిన్నారులు డీజే మ్యూజిక్ కు స్టెప్పులేశారు.
దీపావళి సందర్భంగా యాదవులు నగరం లోని పలుచోట్ల సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రం లోని ట్రైనింగ్ ఇచ్చిన దున్నపోతులతో పాటు పక్క రాష్ట్రాల నుంచి తెస్తున్న భారీ దున్నలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాచిగూడ చెప్పల్ బజార్ లో బీజేవైఎం నాయకుడు సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనం ఆకట్టుకుంది. తమ వృత్తిలో భాగమైన దున్నపోతులతో సాహస కార్యక్రమాలు చేపట్టారు. ఈ సదర్ వేడుకలకు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.
సదర్ ఉత్సవాల్లో దున్నపోతులని అందంగా అలంకరించిన యజమానులకు బహుమతులను అందజేశారు. రాష్ట్రంలో పాడి పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఎల్బీనగర్ నియోజకవర్గమైన కొత్తపేటలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి, యాదవుల ఐక్యతకు నిదర్శనంగా చెప్పుకునే ఈ వేడుకల్ని యాదవ సంఘం నాయకులు పండగలా జరుపుకున్నారు. ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనున్న సదరులో సర్తాజ్ అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది, హర్యానాకు చెందిన ప్రముఖ రైతు వీరేంద్ర సింగ్ కు చెందిన సర్తాజ్ ప్రపంచంలోనే ఎంతో డిమాండ్ ఉన్న ముర్రా జాతికి చెందిన దున్న. ఇరవై ఏడు కోట్ల ఖరీదైన ఈ దున్నను నగరంలో సదర్ వేడుకల్లో ప్రదర్శించేందుకు అఖిల భారత యాదవ మహాసభ ఏర్పాట్లు చేస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sadar-festival-celebrations-in-nursing-25-90613.html
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.