వంశీని వైసిపి లోకి తీసుకోవద్దు : యార్లగడ్డ వెంకట్రావ్
Publish Date:Oct 28, 2019
Advertisement
కృష్ణాజిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీ వైసీపీ లో చేరుతారు అంటూ వస్తున్న వార్తలు స్థానిక వైసీపీ నాయకుల్లో తీవ్ర అలజడికి దారితీశాయి. బిజెపి నేత సుజనా చౌదరిని గుంటూరులో కలిసిన వల్లభనేని వంశీ ఆ వెంటనే తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. నాటి పరిణామాలకు కొనసాగింపుగా వంశీ తెలుగు దేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబు లేఖ రాయడం, ఆ లేఖకి వంశీ సమాధానం ఇవ్వడం వంటి అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాను రాజకీయాల నుంచి వైదొలగనున్నట్టు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అప్రమత్తమయ్యారు, వంశీ కారణంగా టిడిపి హయాంలో వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఇప్పుడు అతనే పార్టీ లోకి వస్తే తమ పరిస్థితి ఏంటని యార్లగడ్డ ఆందోళన చెందుతున్నారు. వంశీని వైసిపి లోకి తీసుకోవద్దని ఆయన జగన్ ను కోరుతున్నారు, జగన్ తమకు న్యాయం చేస్తారని యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్నారు, ఈ కోణంలోనే ఈ రోజు మధ్యాహ్నం ముఖ్య మంత్రి జగన్ తో యార్లగడ్డ వెంకట్రావు సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం అయితే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సి.ఎం జగన్ మోహన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకూ ఈ సమీక్ష సమావేశం జరగనుంది, మధ్యాహ్నం తరువాత గన్నవరం వైసీపీ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు రెండు రెండున్నర ఆ ప్రాంతంలో సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
http://www.teluguone.com/news/content/yarlagadda-venkata-rao-reveals-about-vallabhaneni-vamsi-25-90610.html





