పొరుగింటికి అంటుకొన్న మంటలను అందరూ కలిసి ఆర్పివేయడమే మంచిది లేకుంటే...

Publish Date:Dec 26, 2015

Advertisement

 

గత ఆరు దశాబ్దాలుగా భారత్ పట్ల మారని పాక్ వైఖరి ప్రధాని నరేంద్ర మోడి ఆకస్మిక పర్యటనతో మారిపోతుందని ఎవరూ భ్రమలలో లేరు కానీ పాక్ తో సంబంధాలు మెరుగుపడటానికి ఇది ఎంతో కొంత వరకు సహాయపడుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదం, మత ఛాందసవాదం, సైనిక పెత్తనం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్, మంటలు అంటుకొన్న పొరుగిల్లు వంటిది. ఆ సెగ ఇప్పటికే మనకి చాలా తగిలింది. ఇంకా దానిని పట్టించుకోకుండా వదిలివేస్తే ఏదో ఒకనాడు ఆ మంటలు భారత్ కి కూడా అంటుకోకమానవు.

 

కొన్ని రోజుల క్రితం “అవసరమయితే భారత్ పై అణుబాంబు ప్రయోగించడానికి కూడా వెనుకాడబోము,” అని పాక్ సైన్యాధ్యక్షుడు అన్నారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా, పాక్ సైనికాధికారుల యుద్దోన్మాదానికి, ఉగ్రవాదులు, మత చాందసవాదులు కూడా తోడయి ఉన్నప్పుడు వారి చేతిలో అణుబాంబు ఉండటం ఎంత ప్రమాదమో తేలికగానే ఊహించవచ్చును. “పాక్ అణుబాంబు ప్రయోగిస్తే, భారత్ కూడా ప్రయోగించలేదా? పాక్ ప్రయోగించిన అణుబాంబుని అడ్డుకోలేదా?” అని ప్రశ్నించవచ్చును. కానీ అణుబాంబుల ప్రయోగం వరకు వెళితే అది వినాశనానికే దారి తీస్తుంది తప్ప విజయానికి కాదనే సంగతి గ్రహించాల్సి ఉంటుంది.

 

కనుక పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం బలంగా ఉండటం భారత్ కి అన్నివిధాలా చాల అవసరం. అందుకోసం యిష్టం ఉన్నా లేకపోయినా దానితో బలమయిన స్నేహ సంబందాలు కలిగి ఉండటమే ఇరువురికీ మంచిది. పాకిస్తాన్ కి నిలకడ ఉండని మాట నిజమే. కానీ దానికి కారణం పాక్ ప్రభుత్వంపై యుద్ధోన్మాదంతో తహతహలాడిపోతున్న సైనికాధికారుల పెత్తనం, ఉగ్రవాదులు, మత చాందసవాదుల నుండి వస్తున్న ఒత్తిళ్ళే కారణమని చెప్పవచ్చును.

 

అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న పాక్ ప్రజా ప్రభుత్వానికి భారత్ అండ చాలా అవసరం ఉంది. ఒకవేళ భారత్ సహకారంతో పాక్ ప్రభుత్వం గట్టిగా నిలబడగలిగితే పాకిస్తాన్ లో క్రమంగా పరిస్థితులలో మార్పు రావచ్చునని ఆశపడటం తప్పేమీ కాదు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అంటూ అమెరికా ప్రతీ ఏటా పాకిస్తాన్ కి కొన్ని లక్షల డాలర్లు ఇస్తోంది. ఇస్తోంది అనే కంటే చెల్లిస్తోంది అని చెప్పడమే సమంజసంగా ఉంటుందేమో? అందుకు చాలా చాలా కారణాలు ఉండవచ్చును.కానీ వాటిలో ప్రధానమయినది పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు, మత చాందసవాదులను అదుపు తప్పకుండా నియంత్రించడం కూడా ఒకటని చెప్పవచ్చును. లక్షల డాలర్లు కప్పం చెల్లించి చేస్తున్న అమెరికా పనినే, ప్రధాని నరేంద్ర మోడి దౌత్యపద్దతుల ద్వారా సవరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చును.

 

పాక్ లో తిష్టవేసిన ఉగ్రవాదులు, మత చాందసవాదులు ఈ ప్రయత్నాలని ఎంత కాలం సాగనిస్తారో తెలియదు. కానీ ఈ ప్రయత్నాలు ఏమాత్రం సఫలమయిన ఖచ్చితంగా పాకిస్తాన్ అంతర్గత పరిస్థితుల్లో ఎంతో కొంత మార్పు రావచ్చును. అదే జరిగితే భారత్ పట్ల పాక్ వైఖరిలో కూడా తప్పకుండా మార్పు రావచ్చునని ఆశించవచ్చును.

 

నిన్న మోడీ ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసినప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచిన బాష్యం వారు చెప్పారు. కానీ ఇరు దేశాల ప్రజలు, ముఖ్యంగా పాక్ ప్రజలు మోడీ దౌత్యాన్ని చాలా హర్షించడం గమనార్హం. అంటే పాక్ ప్రజలు భారత్ తో స్నేహం కోరుకొంటునప్పటికీ, ప్రభుత్వాల వైఖరే ప్రజల వైఖరిగా పైకి ప్రదర్శించబడుతోందని స్పష్టం అవుతోంది. వివిధ కారణాల చేత ఇరు దేశాల ప్రభుత్వాలు ఘర్షణ పడుతుంటే అదే ఇరుదేశాల ప్రజల వైఖరి కూడా అని భావించడం పొరపాటని, ఇరు దేశాల ప్రజల స్పందన చూసినట్లయితే అర్ధమవుతుంది.

 

ముందే చెప్పుకొన్నట్లు పొరుగిల్లు తగలబడుతుంటే అందరూ కలిసి ఆ మంటలు ఆర్పాలి. ఆ ప్రయత్నంలో ఆ మంటలు అదుపులోకి రావచ్చును లేదా ఇంకా పెరగవచ్చును. కానీ అసలు ప్రయత్నమే చేయకుండా ఊరుకొంటే? అందుకే మోడీ పర్యటనకి ఎవరు ఎన్ని బాష్యాలు, కారణాలు చెప్పుకొన్నా అదొక మంచి ప్రయత్నమే కనుక అందరూ సమర్ధించడమే మంచిది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.