మోడీ లాహోర్ పర్యటన: ఒక మంచి ఆలోచన, మంచి ప్రయత్నం

Publish Date:Dec 25, 2015

Advertisement

 

ప్రధాని నరేంద్ర మోడి కాబూల్ నుంచి డిల్లీ వస్తునప్పుడు ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసిరావడం ఇరుదేశాల ప్రజలను ఆశ్చర్యపరిచింది కానీ అందరూ ఆయన చర్యను అభినందించారు. దౌత్య పద్దతులను, నియమ నిబంధనలను పక్కనబెట్టి ఒక ప్రధాని మరొక దేశ ప్రధానిని కలవడం చాలా అరుదు. కానీ ప్రధాని నరేంద్ర మోడి తీసుకొన్న నిర్ణయం వలన భారత్-పాక్ సంబంధాలకు ఒక కొత్త ఊపు తీసుకు వచ్చినట్లయింది. ఇంతవరకు ఇరుదేశాలు ఏదో ఒక కారణంతో ఒకదానిని ఒకటి ద్వేషించుకోవడమే తప్ప ఈవిధంగా స్నేహపూర్వకంగా మెలగలేదు. ఇరువురు ప్రధానుల మధ్య ఏర్పడిన ఈ సత్సబందాల వలన ఇరు ప్రభుత్వాల వైఖరిలో గత కొన్ని రోజులుగా గణనీయమయిన మార్పులు కనబడటం మొదలయ్యాయి. అందుకే ఇరు దేశాల నేతలు, ప్రముఖులు, విదేశాంగ నిపుణులు, ప్రజలు అందరూ కూడా మోడీ చర్యను స్వాగతిస్తున్నారు. సమర్ధిస్తున్నారు.

 

దీనిపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ “దౌత్యపరంగా ఇది చాలా ముఖ్యమయిన, మంచి నిర్ణయం,” అని అన్నారు. “ప్రధాని లాహోర్ పర్యటన వలన పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. ఇరుదేశాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది,” అని రక్షణరంగ నిపుణుడు ఖమర్ ఆఘ అభిప్రాయం వ్యక్తం చేసారు. “ప్రధాని మోడీ సరయిన దిశలో ఒకడుగు వేశారని” జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. “అయితే ఏదో ఆర్భాటం కోసం కాక ఇరుదేశాల మధ్య సబందాలు బలపడేందుకు గట్టిగా, నిలకడగా ప్రయత్నాలు సాగించాలని” ఒమర్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ కి చెందిన చాలా మంది ప్రముఖులు ఇంచుమించు ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తూ, మోడీ ఆకస్మిక పర్యాటనని స్వాగతించారు.

 

“ఇది ఎవరూ ఊహించలేని మంచి ప్రయత్నం. చాలా మంచి ఆలోచన. దీని వలన ఇరుదేశాల ప్రజలకు మంచి సంకేతం పంపినట్లయింది” అని మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ అన్నారు.

 

కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం యధాప్రకారం కోడిగుడ్డుకి ఈకలు పీకే పనిలో పడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ దీనిపై స్పందిస్తూ, “భారత్-పాక్ మధ్య సంబంధాలు ఇంకా బలపడనపుడు, మోడీ మధ్యలో పాక్ లో ఎందుకు దిగారో తెలియడం లేదు. అటువంటి అతి ముఖ్యమయిన సమాచారాన్ని మనం ట్వీటర్ ద్వారా తెలుసుకోవలసి రావడం దురదృష్టకరం. ఈమధ్యనే పార్లమెంటు సమావేశాలు ముగిసాయి. ఆయన పాకిస్తాన్ వెళ్ళదలచుకొంటే వెళ్ళవచ్చును. కానీ పార్లమెంటుకి కూడా తెలియజేయాలనుకోలేదు,” అని అన్నారు.

 

మరో సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ “ఇది ఒక సాహస యాత్ర అని చెప్పవచ్చును. ఆయన చేసిన ఈ సాహసం దేశభద్రతకు సవాలు విసురుతోంది. అంత సాహసం చేసినా ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశించలేము. అంత ఆకస్మికంగా ఆయన లాహోర్ ఎందుకు వెళ్ళారో అర్ధం కావడం లేదు,” అని అన్నారు.

 

“మోడీ, పాక్ ప్రధాని నివాసం చేరుకొనేసరికి అక్కడ ఒక ప్రముఖ పాక్ వ్యాపారవేత్త ఉన్నారు. మరి మోడీ పర్యటన ఆకస్మిక పర్యటన అని ఎలాగ చెప్పగలము?” అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. ఇక డిల్లీలో యువజన కాంగ్రెస్ నేతలు అందరి కంటే చాలా వికృతంగా ప్రవర్తించారు. మోడీ లాహోర్ పర్యటనని నిరసిస్తూ వారు డిల్లీలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు.

 

కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ “మా ప్రభుత్వం ఏమి చేసినా విమర్శించడమే కాంగ్రెస్ నేతల పని. వారికి దేనిలోనూ మంచి కనబడదు. మోడీ వేసిన ఒక చిన్న అడుగు వలన భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడుతుంటే అందుకు హర్షించకపోగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకు ముందు పాకిస్తాన్ పట్ల మేము కటినంగా వ్యవహరిస్తే తప్పు పట్టారు. ఇప్పుడు దానితో స్నేహంగా వ్యవహరిస్తే దానిని కూడా తప్పు పడుతున్నారు. అసలు వాళ్ళు ఏమి కోరుకొంటున్నారో కూడా తెలియదు. ఏదో విమర్శించాలి గాబట్టి విమర్శిస్తున్నట్లుంది తప్ప వారి విమర్శలలో అర్ధం లేదు."

 

"ఎంతో కాలంగా ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇటువంటి ఒక్కడుగు వేయలేదు. కానీ మోడీ ఒక మంచి ప్రయత్నం చేస్తుంటే విమర్శిస్తున్నారు. ఆయన పర్యటన గురించి లోకం ఏమనుకొంటోందో ఒకసారి విన్నాక కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బాగుంటుంది,” అని వెంకయ్య నాయుడు చురకలు వేశారు.

 

మోడీ పర్యటన వలన ఏవో అద్భుతాలు జరిగిపోతాయని అనుకోనవసరం లేదు. కానీ ఇటువంటి మంచి ప్రయత్నాల వలననే అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పకతప్పదు. సరిగ్గా క్రిస్మస్ పండుగ రోజునే మోడీ పాకిస్తాన్ కి ఇటువంటి శాంతి సందేశం తీసుకు వెళ్ళడం కాకతాళీయమే కానీ సత్ఫలితాలను ఇవ్వవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.