2015లో జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలు

Publish Date:Dec 29, 2015

Advertisement

 

2015 సం. ముగియడానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉంది. ఈ సందర్భంగా ఈ ఏడాది జాతీయ స్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి ఒకసారి చెప్పుకొంటే బాగుంటుంది.

 

ఈ ఏడాది మొదట్లో డిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ రెండు ప్రధాన జాతీయపార్టీలయిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను చిత్తుగా ఓడించి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అది ప్రజల పట్ల రాజకీయ పార్టీలు, నేతల తీరు మారవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఇక బీజేపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. ముఫ్తీ మొహమ్మద్ తీసుకొన్న వివాదాస్పద నిర్ణయాల వలన బీజేపీ-పిడిపి పార్టీల మధ్య కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ నిలకడగా పరిపాలన సాగుతోంది.

 

మచ్చలేని నేతగా పేరొందిన మాజీ ప్రధాని. డా. మన్మోహన్ సింగ్ అక్రమ బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో చేతికి మసి అంటుకొంది. ఆయనను ఆకేసు విచారణ కోసం స్వయంగా హాజరు కావలసిందిగా కోర్టు నోటీసులు జారీ చేయడం కలకలం సృష్టించింది. కానీ సుప్రీం కోర్టు ఆయనకు ఆ కేసుల నుండి విముక్తి ప్రసాదించింది. ఇదే కేసులో మాజీ బొగ్గు శాఖ మంత్రి దాసరి నారాయణ రావుపై కూడా చార్జ్ షీట్ దాఖలయింది.

 

భూసేకరణ చట్టానికి పార్లమెంటులో ఆమోదం లభించకపోవడంతో మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టాలని రాహుల్ గాంధీ తహతలాడినపుడు షీలా దీక్షిత్ వంటి సీనియర్ నేతలు నాయకత్వ లక్షణాలను ప్రశ్నించడంతో ఆయన పార్టీపై అలిగి కీలకమయిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో రాజజకీయలకు శలవు పెట్టి విదేశాలకు వెళ్ళిపోవడం ఆయన, పార్టీ కూడా తీరని అప్రదిష్ట మూటగట్టుకొన్నారు.

 

అక్రమాస్తుల కేసులో జయలలితని కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఆమె మళ్ళీ ఉపఎన్నికలలో పోటీ చేసి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేరు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన దోషి రామలింగారాజుకి బెయిలు మంజూరు అవడంతో ఆయన జైలు నుండి విముక్తి లభించింది.

 

డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్-డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య అధికారుల నియామకం విషయంలో యుద్ధం జరిగింది. ఆ తరువాత మళ్ళీ తాజాగా ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ-డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. కేజ్రీవాల్ తనపై నిరాధారమయిన ఆరోపణలు చేస్తున్నందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేశారు.

 

మళ్ళీ చాలా దశాబ్దాల తరువాత జూన్ తొమ్మిదవ తేదీన భారత్ భద్రతా దళాలు విదేశీ భూభాగంలోకి (మయన్మార్) ప్రవేశించి నాగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పన్నెండేళ్ళుగా సాగుతున్న వ్యాపం కుంభకోణంలో ఇంతవరకు 2,500 మంది అరెస్ట్ కాగా, ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కూడా ఈ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణంలో ఆయన కుమారుడు శైలేష్ యాదవ్ తో సహా ఇంతవరకు 47మంది అనుమానాస్పదస్థితిలో మరణించారు. వ్యాపం కుంభకోణంపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించింది.

 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకొన్న మహాకూటమి చేతిలో బీజేపీ ఓడిపోయింది. నితీష్ కుమార్ మళ్ళీ బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టారు. తొమ్మిదవ తరగతి కూడా పాస్ అవని లాలూ చిన్న కొడుకు తేజస్వీ ప్రసాద్ యాదవ్ బిహార్ ఉపముఖ్యమంత్రి అయ్యేడు.

 

జూలై 27వ తేదీన పంజాబ్ లో పాక్ ఉగ్రవాదులు దాడులు చేసారు. వారి దాడిలో తొమ్మిది మంది పౌరులు మరణించారు. సరిగ్గా అదే రోజున భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి చెందారు. ముంబై దాడుల సూత్రధారి యాకూబ్ మీమన్ ని నాగపూర్ జైల్లో ఉరి తీశారు. ఆగస్ట్ ఆరవ తేదీన పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ సజీవంగా పట్టుబడ్డాడు.

 

వ్యాపం కుంభకోణం, లలిత్ మోడీ వ్యవహారాలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు, విదేశంగా మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామాలకు పట్టుబడుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పార్లమెంటుని స్తంభింపజేసాయి. మళ్ళీ ఆ తరువాత జరిగిన పార్లమెంటు సమావేశాలను మత అసహనం, నేషనల్ హెరాల్డ్ కేసుల కారణంగా స్తంభింపజేసింది.

 

సానియా మీర్జాకి ప్రతిష్టాత్మకమయిన ఖేల్ రత్న అవార్డు అందుకొన్నారు. బీసిసిసి మాజీ అధ్యక్షుడు దాల్మియా కన్నుమూసారు. ఆయన స్థానంలో శాశాంక్ మనోహర్ అధ్యక్షుదిగా ఎన్నికయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కోరుతూ హార్దిక్ పటేల్ ప్రారంభించిన ఉద్యమం హింసాయుతంగా మారింది. ప్రస్తుతం అతని వివిధ పోలీస్ కేసులను ఎదుర్కొంటున్నాడు.

 

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ స్వాతంత్ర్య సంగ్రామ పోరాట యోధుడు నేతాజీ సుబాష్ చంద్రబోస్ కి సంబంధించిన రహస్య ఫైళ్ళను బయటపెట్టింది. కేంద్రప్రభుత్వం తన అధీనంలో ఉన్న రహస్య ఫైళ్ళను కూడా బయటపెట్టబోతోంది. మాజీ సైనికులకు ఒకే హోదా-ఒకే పెన్షన్ పధకాన్ని కేంద్రప్రభుత్వం ఆమోదించింది.

 

మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వంలో ఓడిడుకులు ఏర్పడ్డాయి. ఆ తరువాత అవి కొంత సర్దుకొన్నప్పటికీ, నేటికీ అవి అప్పుడపుడు ఏదో రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ప్రకటించిన నల్లదనం వెలికితీత పధకంలో భాగంగా విదేశాలలో నల్లదనం దాచుకొన్నవారు అనేకమంది స్వచ్చందంగా ఆ వివరాలను ప్రకటించి రూ. 3370 కోట్లు జరిమానాలు చెల్లించారు. నిర్భయ కేసులో బాలనేరస్తుడు విడుదలయ్యాడు. అందుకు ప్రజలు తీవ్ర నిరసనలు తెలుపడంతో బాల నేరస్తుల వయసును 18 నుండి 16కి తగ్గిస్తూ బాలనేరస్థుల చట్టానికి సవరణలు చేసి పార్లమెంటు ఆమోదించింది.

 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధాని రూ.80,000 కోట్ల ఆర్ధిక ప్యాకేజీ మంజూరు చేసారు. అంతకు ముందు బిహార్ కి రూ.1.25 కోట్ల ఆర్ధిక ప్యాకేజీ, ఆ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి మరో రూ.40, 000 కోట్లు మంజూరు చేసారు. 2015సం. తమిళనాడుకి ఒక పీడ కలని మిగిల్చింది.

 

కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన బారీ వర్షాలలో చెన్నై నగరం నీట మునిగింది. అనేక వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. సుమారు 542 మందికి పై ప్రజలు మరణించారు. దేశంలో ఉన్నత విద్యావంతులయిన యువకులు ఐసిస్ ఉగ్రవాద సంస్థలలో చేరేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. భారత్ తొలి బులెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్-జపాన్ దేశాల మధ్య ఒప్పందం జరిగిందిఅమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్ళిన 14మంది భారత్ విద్యార్ధులను అమెరికా అధికారులు వెనక్కి తిప్పి పంపేశారు. ప్రధాని నరేంద్ర మోడి ఆకస్మికంగా పాకిస్తాన్ వెళ్ళడం చాలా సంచలనం సృష్టిస్తోంది. రూ.10 లక్షల వార్షికాదాయం గలవారికి జనవరి 2016 నుండి గ్యాస్ సబ్సిడీ ఇవ్వరాదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.