రాష్ట్రపతి రేసులో నాలుగో కృష్ణుడు

Publish Date:Jun 21, 2022

Advertisement

రాష్ట్రపతి ఎన్నికకు ఐదు రోజుల క్రితమే నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 29 ఆఖరు రోజు. అంటే నామినేషన్ల దాఖలుకు మరో ఏడెనిమిది రోజులు మాత్రమే సమయముంది.   అయినా ఇంతవరకు అధికార ,ప్రతిపక్ష కూటములలో ఏ ఒక్కరూ తమ అభ్యర్ధిని ప్రకటించలేదు. అధికార బీజేపీ/ ఎన్డీఎ కూటమిలో ఏమి జరుగుతోందో, ఎవరు అభ్యర్దో పక్కాగా తేలక పోయినా, నిర్ణయం అయితే ఇప్పటికే జరిగి ఉంటుందని, ఈరోజు జరిగే  బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో, ‘మమ’ అనిపించి అభ్యర్ధి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికార కూటమి ఈరోజు కాకున్నా, నామినేషన్ల గడువు ముగిసేందుకు ఒకటి రెండు రోజుల  ముందు తమ అభ్యర్ధిని ప్రకటించినా పెద్దగా. ఫరక్ పడదు. అభ్యర్ధి ఎవరైనా గెలుపుకు అవసరం అయిన సంఖ్యా బలం ఉన్న నేపధ్యంలో, అధికార కూటమి అభ్యర్ధి ఎవరన్న విషయంలో ఏవో కొన్ని పేర్లు వినిపిస్తున్నా, ఎక్కడ పెద్దగా చర్చ జరగడం లేదు. 

కానీ, ప్రతిపక్ష శిబిరంలో మాత్రం ‘ఉమ్మడి అభ్యర్హి’ ఎంపిక  కసరత్తు జోరుగా, అదో ‘ప్రహసనం’లా సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్ధి నిలబెట్టి, ఐక్యతను చాటుకునేందుకు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మొదలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. అయితే ఎందుకనో కానీ, ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే సరికే, కేసీఆర్ మిడిల్ డ్రాప్ పెట్టేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమై పోయిన ఆయన రాష్ట్రపతి ఎన్నికలకు సంబందించినంత వరకు, ఆటలో అరటి పండులా ఒంటరై పోయారు. 
 ప్రశాంత్ కిశోర్ అయితే ఈ క్రతువుకు సంవత్సరం  క్రితమే శ్రీకారం చుట్టారు. గత సంవత్సరం ఇదే జూన్ నెలలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో వరసగా రెండు సార్లు సమావేశ మయ్యారు. ఆ తర్వాత కూడా ప్రశాంత్ కిశోర్ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి పునాదిగా, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాలు కొనసాగించారు. అఫ్ కోర్స్ ఇప్పటికీ ఆయన ప్రయత్నాలు యాల్ సాగుతూనే ఉన్నాయి అనుకొండి అది వేరే విషయం.

అదలా ఉంటే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్ధి కోసం, ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకటో కృష్ణుడు, రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు ..ఇలా ఇంతవరకు శరద్ పవార్ , ఫరూక్ అబ్దుల్లా, గోపాల గోపాల గాంధీ ముగ్గురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఆ ముగ్గురూ కూడా  నో .. అనేశారు. . తమ వల్ల కాదని చేతులెత్తేశారు. నాలుగో కృష్ణుడుగా, యశ్వంత్ సిన్హా పేరు తాజాగా తెర మీదకు వచ్చింది. జస్ట్ 85 ఇయర్స్ సిన్హా అయినా, ఓడిపోయేందుకు సిద్ధమై ఒకే చేస్తారా? అంటే అనుమానమే అంటున్నారు. అలాగే, ప్రస్తుతానికి తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హా అందరికీ ఆమోదయోగ్యం అవుతారా అంటే అదీ అనుమానమే అంటున్నారు.

ఈరోజు (జూన్ 21) శరద్ పవార్ నివాసంలో జరిగే 17 పార్టీల కూటమి సమవేశంలో డిఎంకే, వామపక్షాలు వేరు వేరు పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  మరోవంక ఈ రోజు జరిగే 17 పార్టీల సమావేశానికి మమతా బెనర్జీ హాజరు కావడం లేదు. ఒక్క మమతా బెనర్జీనే కాదు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా  హాజరు కావడం లేదు.  తెరాస, బిజు జనతదళ్, ఆప్ పార్టీలు మొదటి సమావేశానికి కూడా హాజరుకాలేదు. సో.. ఈరోజు భేటీలో అయినా ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయంతో ఉమంది అభ్యర్హ్దిని ప్రకటిస్తాయా? ప్రకటించగలవా? అంటే అనుమానమే అంటున్నారు.  మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో బీజేపీ కమిటీ వేసింది. అయితే, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏదో మొగ్గుబడిగా ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరిపారు, కానీ, బీజేపీ, ప్రతిపక్షాల అనైక్యతను ఎక్స్పోజ్ చేసేందుకు రాష్ట్రపతి ఎన్నికను అవకాశంగా తీసుకుందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.