జనం మరిచిపోతారన్న భయంతోనే పేర్ని ప్రేలాపనలు!

Publish Date:Jun 21, 2022

Advertisement

పేర్ని నాని జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురి కాక ముందు వరకూ ఆయన మీడియా ముందు రాని రోజు ఉండేదంటే అతిశయోక్తి కాదు. నిత్యం విపక్ష తెలుగుదేశంపై విమర్శలు గుప్పించడంలోనూ, పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేయడంలోనే ఆయన అందరి కంటే ముందుండే వారు. మంత్రి పదవి పోయిన తరువాత అలకో, ఉక్రోషమో, నిరాశో, నిర్వేదమో తెలియదు కానీ.. పలుకే బంగారమన్నట్లుగా మారిపోయారు. దానికి తోడు మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంపీతో వర్గ పోరు. ఇక పేర్ని పనైపోయిందన్న గుసగుసలూ వైసీపీలో బాగానే వినిపించాయి.

మౌనంగా ఉంటే కనుమరుగైపోతామని భావించారో ఏమో పేర్కొ ఒక్క సారి గొంతు సవరించుకున్నారు. అలా ఇలా కాదు.. మళ్లీ నెనుకటి పేర్ని కనిపించేలా? ఈ సారి కూడా ఆయన తనకు అచ్చొచ్చినట్లుగా పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా కొన్ని విమర్శలు విసిరారు అది వేరే సంగతి. అధినేతకు ఏం మాట్లాడితే నచ్చుతుందో బాగా తెలిసిన వైసీపీ నేతలలో పేర్ని నాని ఒకరు. అందుకే ఆయన చాలా కాలం గ్యాప్ తరువాత మీడియా ముందుకు వచ్చినా ఆయన విమర్శలలో వెనుకటి పదును తగ్గలేదనిపించేలా మాట్లాడారు. ఎంపీ వల్లభనేని బాలశౌరితో విభేదాల కారణంగా పార్టీలో గుర్పింపునకు ముప్పు వచ్చిందన్న అదురో, బెదురో తెలియదు కానీ తాజా ప్రెస్ మీట్ లో ఆయన విపక్షాలపై విమర్శలతో చెలరేగిపోయారు.

బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులంటూ జనసేనాని రాజకీయం చేస్తున్నారన్నారు. రైతుకు జగన్ చేస్తున్న సహాయంతో, మేలుతో పోలిస్తే జనసేనాని చేస్తున్నది ఏ పాటి అంటూ చెరిగి పారేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ అన్నదాతను అదుకునే విషయంలో జగన్ ను ఫాలో అవుతున్నారంటూ గత కొంత కాలంగా ఆయన పూర్తిగా మరచిపోయిన అధినేత భజనను ఈ మీడియా సమావేశంతో మరో సారి మొదలెట్టేశారు. అంతే కాదు ఒంటరి పోరుకు సిద్ధపడాల్సిందిగా జనసేనానిని రెచ్చగొట్టేందుకే తన వాగ్ధాటిని ఉపయోగించారు. పనిలో పనిగా చంద్రబాబు హయాంలో రైతులకు పంటనష్టపరిహారం చెల్లించలేదన్న ఆరోపణలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చి ముందు వాటిని ప్రశ్నించమని పవర్ స్టార్ కు సూచించారు.

అంతే కాకుండా రైతుల కోసం జగన్ అండగా నిలబడ్డారని కితాబిచ్చేశారు. రైతుకు అండగా జగన్ నిలబడినట్లు గతంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కానీ నిలబడ్డాయా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ దృష్టిలో ప్రశ్నించడమంటే జగన్ ను విమర్శించడమేనని నిష్ఠూరమాడారు.   మాట మీద నిలబడటం జనసేన హిస్టరీలోనే లేదన్న పేర్ని నాని 2014లో పార్టీ పెట్టి చంద్రబాబుకు ఓటేయమన్న పవన్ కల్యాణ్, 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలకుంటే జగన్ కు మేలు జరుగుతుంది కనుకనే ఎన్నికల్లో నిలబడుతున్నామని చెప్పుకున్నారు.

ఇప్పుడేమో జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు కనుక తెలుగుదేశంతో కలుస్తానంటున్నారు. అంటూ ఎద్దేవా చేశారు.  ఎన్ని చేసినా పేర్ని గారికి వైసీపీలో గతంలోలా ప్రాధాన్యత లభిస్తుందా అంటే పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. పూర్తాగా కనుమరుగైపోతానన్న భయంతోనే పేర్ని మీడియా ముందు విపక్షాలపై విరుచుకుపడుతున్నారని, ఆయన ఇప్పుడు కొత్తగా చెప్పిందేమీ లేదనీ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.