Publish Date:Jun 16, 2022
దేశంలో ప్రభుత్వ పని తీరును నిరసిస్తూ భారీ నినాదాలతో ఉద్యమించడం మామూలే. కానీ ఇటీవలి కాలంలో వాటిని నివారించ డంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం మరీ దారుణంగా, అమానవీయంగా మారింది. వారిని అడ్డుకోవడానికి లాఠీఛార్జీలు చేయడం, టియర్ గ్యాస్ వదలడం, వాటర్ కానన్ లను ప్రయోగించడం వంటివి కామన్. కానీ ఇపుడు ఆందోళనకారులపై లాఠీచార్జితో పాటు తన్నడం, దుస్తులు చింపడం వంటి దారుణాలకూ పోలీసులు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలాంటి సంఘటన ఢిల్లీలో జరిగింది. దీని పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకునే క్రమంలో పోలీసుల చర్యలో మహిళా ఎం.పీ జ్యోతిమణి దుస్తులు చిరిగిపోయాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దగిన కాంగ్రెస్ శ్రేణులపై ఢిల్లీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులపై విచక్షనా రహితంగా పోలీసులు దాడులు చేసినట్లు ఆరోపిస్తు న్నారు. మహిళలని కూడా చూడకుండా దుస్తులను చించేశారని తమను అరెస్టు చేసి గుర్తు తెలియన ప్రాంతాలకు తీసికెళ్లారని ఆరోపించారు. తమిళనాడులోని కరూర్కు చెందిన కాంగ్రెస్ మహిళా ఎంపీ జ్యోతిమణి పోలీసుల దాడి తీరుపై సెల్ఫీ వీడియోలో స్పీకర్కు విన్నవించారు.
ఢిల్లీ పోలీసులు తమ పట్ల దారుణంగా వ్యవహరంచారని ఆమె ఆరోపించారు. తన దుస్తులను చించేశారని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు తమను నేరస్థుల్లా ఈడ్చుకు వెళ్లారని తన షూని కూడా లాగేశారని ఆరోపించారు. కనీసం తాగ డానికి మంచినీళ్లు కొనుక్కోవడానికి కూడా వీలు లేకుండా దుకాణదారులను హెచ్చరించడం మరీ దారుణంగా ఆమె పేర్కొ న్నారు. జ్యోతిమని వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. మహిళా నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహ రించిన తీరు మరీ దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యులకు న్యాయం ఎక్కడ జరగుతుందని ఆయన ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని శశి థారూర్ స్పీకర్ను కోరారు.
.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-tore-women-mp-dress-congress-protest-39-137816.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.