Publish Date:Jun 16, 2022
ఏ అవకాశమూ లేని చోట బీజేపీ ఆకాసానికి నిచ్చెన వేస్తున్నంత హడావుడి చేస్తోంది. అధికార పార్టీ ఘన విజయంగా చెప్పుకోవడానికి పూర్తిగా దోహదపడేందుకే ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని పోటీలో నిలిపిందని విపక్షాలు, రాజకీయ పరిశీలకులే కాదు.. సామాన్య జనం కూడా బహిరంగంగా చెప్పేస్తున్నారు. దీనిని బట్టే ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి దిగడంలో బీజేపీ సీరియస్ నెస్ ఏమిటన్నది అవగతమౌతుంది.
అయితు పొలిటికల్ డ్రామాను రక్తి కట్టించడానికి బీజేపీ నానా తిప్పలూ పడుతోంది. బీజేపీ ప్రచారానికి సినీ గ్లామర్ ను రంగంలోకి దించి ప్రజలను ఆత్మకూరు ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకుందని నమ్మించడానికి తంటాలు పడుతోంది. అలనాటి అందాల తార, ప్రస్తుతం బీజేపీ నాయకురాలు అయిన జయప్రదను ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దించుతోంది.
స్టార్ క్యాంపెయినర్ గా సినీ గ్లామర్ ను రంగంలోనికి దించుతోంది. గత కొంత కాలంగా రాజకీయాలలో ఏ మంత చురుకుగా లేని జయప్రద తిరిగి తన ఉనికిని ఘనంగా చాటాలని భావిస్తున్న సంగతి విదితమే. అయితే అందుకు ఉత్తర భారతంలో కాకుండా.. తనకు సినీ నటిగా గుర్తింపును తీసుకువచ్చిన తెలుగు గడ్డ మీద నుంచి అయితే బాగుంటుందని ఆమె భావించారు. రాజకీయంగా తన ఉనికిని బలంగా చాటేందుకు తెలుగు రాష్ట్రాలైతేనే ఏదో ఒక మేరకు ప్రయోజనం ఉంటుందనీ భావించారు.
అందుకే ఆమె ఇటీవల తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఇటీవలే రాజమహేంద్రవరంలో జరిగిన బీజేపీ సభలోనూ పాల్గొన్నారు. ఆ సభలో ఏపీలో వైసీపీ పాలన అధ్వానం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అవే మాటలు ఆత్మకూరులోనూ వల్లించి.. తాను రాజకీయాలలో క్రియాశీలంగానే ఉన్నానంటూ చాటేందుకు సిద్ధపడుతున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం లాంఛనమేనన్నది పరిశీలకుల అభిప్రాయం. అక్కడ ప్రధాన విపక్షం పోటీలో లేదు. పోటీలో ఉన్న బీజేపీకి ఓటు లేదు.
అటువంటి చోట వైసీపీ కూడా చతురంగ బలాలను మోహరించినట్లు పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను అక్కడ దింపి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మంత్రి రోజా ఇప్పటికే అక్కడ ప్రచారం చేస్తున్నారు. అక్కడ వైసీపీకి ప్రత్యర్థిగా పోటీలో ఉన్న బీజేపీపై కాకుండా.. పోటీలో లేని తెలుగుదేశంపై విమర్శలు కురిపిస్తూ ఆత్మకూరులో వైసీపీ, బీజేపీ పోటీ వెనుక ఉన్న రహస్యమేమిటో చెప్పకనే చెప్పేస్తున్నారు. అలాగే బీజేపీ కూడా ఇంత వరకూ ప్రచారం గురించే పట్టించుకోలేదు. తమ అభ్యర్థి తరఫున నియోజకవర్గంలో పర్యటించి సభలు, ఇంటింటి ప్రచారంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలెవరూ బయటకు రాలేదు. ప్రెస్ మీట్లతో సరిపెట్టేస్తూ వచ్చారు. అయితే జనం నవ్విపోతున్నారన్న గ్రహింపునకు వచ్చి.. ఇప్పుడు ఆత్మకూరు ఉఫ ఎన్నికలో బీజేపీ తరఫున ప్రచారానికి జయప్రదను రంగంలోకి దింపుతున్నారు. ఇటు రాజకీయాలలోనూ, అటు సినిమాలలోనూ ప్రాధాన్యత పెద్దగా లేని జయప్రద ఆత్మకూరు ఉప ఎన్నికలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొని కనీసం ఏపీలోనైనా రాజకీయ గుర్తింపు తెచ్చుకుని క్రియాశీల రాజకీయాలలో ఉనికి చాటాలని భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jayaprada--to-campign-for-bjp-in-atmakur-by-poll-39-137818.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.