Publish Date:Jun 16, 2022
నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఈడీ నోటీసులు విచారణ దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో తమ నాయకుడిని ఇ.డి. విచారణ పేరుతో వేధించడంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దేశంలో అనేక ప్రాంతాల్లో నిరసనకు దిగారు. హైదరాబాద్లో గురువారం పెద్ద ఎత్తున రాజ్భవన్ ముట్డిడికి ఉపక్రమించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదాలకు దిగారు. ఊహించని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
సీనియర్ నాయకులను అరెస్టు చేశారు. దీనిపై బీజేపీ విమర్శలకు దిగింది. కాంగ్రెస్ ఆందోళన పేరుతో విధ్వంసం సృష్టిస్తోందని ఆరోపిస్తోంది. గురువారం హైదరాబాద్ లో జరిగిన విధ్వంసంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. అసలు కాంగ్రెస్ చలో రాజ్భవన్ ఎందుకు చేపట్టిందో అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేసి భయానక వాతావరణం కల్పించారని బండి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆ పార్టీని ఎవరూ అంతగా పట్టించు కోవడం లేదని ఎద్దేవా చేశారు.
స్వాతంత్ర్య సమరయోధులు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వంటి సంస్థ నుంచి వేలాది కోట్లు దోచుకుంటే చోద్యం చూసినట్టు చూడాలా? విచారణ జరిపితే ఆందోళనలా. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరపడం సహజమేననీ, విచారణను ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వస్తే జనం కూడా మెచ్చుతారని హితవు పలికారు. రాహుల్ గాంధీని ఈ.డి. విచారించడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అక్రమాలు బయట పడితే ప్రజలు పూర్తిగా ఆ పార్టీని మర్చి పోతారని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఇప్పటి నుంచే భయం పట్టుకుందన్నారు.
తమ నాయకులు మోదీ, షా కూడా ఇ.డి. విచారణను ఎదుర్కొన్నారని, నిజాయితీ నిరూపించుకొని బయటకు వచ్చారేగాని విధ్వంసాలకు పాల్పడలేదని బండి అన్నారు. ఇదంతా టిఆర్ ఎస్ సౌజన్యంతోనే జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి బలపడుతుందనే భయంతోనే కాంగ్రస్, టిఆర్ ఎస్ కలిసి ఈ నాటకం ఆడుతున్నాయన్నారు. అసలు రాహుల్ గాంధీ పాదయాత్రను కాంగ్రెస్ నాయకులే అంతగా పట్టించు కోవడం లేదని బండి ఎద్దేవా చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bandi-sanjay-fires-on-congress-for-protests-39-137814.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.