పోలవరం మరో అమరావతేనా?.. ప్రాజెక్టు కథ ముగిసినట్లేనా?

Publish Date:Apr 24, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం కథ ఇంక ముగిసిందా? ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఉద్దేశానికి జగన్ సర్కార్ తిలోదలాకిచ్చేసిందా? అన్న ప్రశ్నకు ఏపీ కొత్త జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి ఔననే సమాధానమని అనుకోవలసి వస్తుంది. 
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్న విషయాన్ని తాను చెప్పలేనని కుండ బద్దలు కొట్టేశారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందనీ, అది ఏ స్థాయిలో దెబ్బతింది, దానిని ఎలా మరమ్మతు చేయాలి, ఎంత వ్యయం అవుతుంది ఇత్యాది విషయాలన్నీ పరిశీలించిన తరువాతే పోలవరం పురోగతిపై ఒక నిర్ణయానికి రాగలమని అంబటి చెప్పారు. 
మూడేళ్లుగా పోలవరాన్ని మూలనపడేసి ఇఫ్పుడు గత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్లే పోలవరం పరిస్థితి ఇలా తయారైందని అన్నారు.  ఈ విషయంలో పోలవరం నిర్మాణంలో భుజకీర్తుల కోసం చంద్రబాబు పడిన తాపత్రయమే ఈ పరిస్థితికి కారణమని ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలవనరుల శాఖ అనుమతులతోనే పనులు జరిగాయి కదా అన్న విలేకరుల ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేశారు. మీ ప్రశ్నలకు నేను జవాబివ్వడం కాదు...నేను చెప్పింది మీరు రాసుకోండంటూ  అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి గత మూడేళ్లుగా జరగాల్సి మట్టి పని నిలిచిపోవడ వల్లనే ప్రస్తుత పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతుండగా.. మంత్రి అంబటి రాంబాబు మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపించారు.
డయాఫ్రం వాల్ ఏ స్థాయిలో దెబ్బతిందన్న అంశం తేలాకే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తేలుతుందని అన్నారు. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన స్థలంలో గుంతలు పడ్డాయన్న ఆయన అక్కడి నీటిని తోడేయడానికి రెండు వేలకు పైన వ్యయమౌతుందని విరించారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే...ఇప్పటి వరకూ డయాఫ్రం వాల్ ఎంత మేర దెబ్బతింది అన్న విషయంపై నిపుణుల కమిటీ నివేదికే ఇవ్వలేదు. ఇక నీటిని తోడేయడానికి ఎంత వ్యయం అవుతుందన్న విషయంపై రాష్ట్ర జల  వనరుల శాఖ అధికారులు చెబుతున్న అంకెకు, అంబటి చెప్పిన అంకెకూ పొంతనే లేదు. అసలు రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులకు పోలవరం ప్రాజెక్టుతో సంబంధమే లేదన్నట్లుగా అంబటి వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ పోలవరం అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పోలవరం సందర్శన అయితే పూర్తయ్యింది కానీ ఇంకా నివేదిక ఇవ్వలేదు. నివేదికకు ముందే నష్టం ఇంత, ఖర్చు ఇంత అంటూ అంబటి విలేకరుల సమావేశంలో ప్రకటించడాన్ని బట్టి నివేదిక కేవలం నామమాత్రమేననీ, భారీ వ్యయం బూచి చూపి పొలవరం ఎత్తు తగ్గించి చాపచట్టేయడమో లేదా మూడు రాజధానుల పేరు చెప్పి అమరావతిని నిర్వీర్యం చేసిన చందంగా పోలవరం పనులకు ఫుల్ స్టాప్ పెట్టేయడమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. 
ఇక జల రంగ నిపుణులైతే...నీటిని తోడడానికి అంత భారీ వ్యయం అవసరం లేదనీ, డయాఫ్రం గోడలను కొద్ది పక్కకు జరిపితే నీరు దానంతటదే దిగువకు వెళ్లిపోతుందనీ చెబుతున్నారు. 
దేశంలో దాదాపుగా పోలవరమే చివరి బహుళార్థక ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టు విషయంలో రాజకీయం చేస్తూ వైఫల్యాలకు ప్రత్యర్థి పార్టీలను నిందిస్తూ ప్రాజెక్టు పనులు ముందుకు సాగకుండా ప్రభుత్వమే ప్రయత్నాలు చేయడం పట్ల జల వనరుల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపుతున్న మంత్రి దానికి సరిచేయడానికి మూడేళ్లలో ప్రభుత్వం ఎందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదనడానికి మాత్రం స్పష్టమైన జవాబు ఇవ్వడం లేదు. 
అమరావతి విషయంలో ఎలా అయితే...అమరావతే రాజధాని అంటూ తొలుత ప్రకటనలు గుప్పించి, ఆ తరువాత దానిని నిర్వీర్యం చేశారు.ఏపీ జీవ ప్రదాయిని అంటూ కొనియాడిన పోలవరం పురోగతిని ఉద్దేశ పూర్వకంగా ఆపేసి జగన్ సర్కార్ చోద్యం చూస్తోందని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. 

By
en-us Political News

  
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.