పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రికార్డు మెజారిటీతో విజయం సాధించడం వెనుక ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మ త్యాగం, కృషి, పట్టుదల ఉన్నాయనడంలో ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. పైగా పిఠాపురంలో తన విజయానికి సర్వశక్తులూ ఒడ్డి శ్రమించిన వర్మను విజయం తరువాత స్వయంగా పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా వర్మ త్యాగాన్ని, కృషిని గుర్తించారు. సరైన న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు.
నిజమే గత ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించినప్పుడు, ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించి గత ఐదేళ్లుగా నియోజకవర్గంలోనే పని చేస్తూ వస్తున్న వర్మ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన అభిమానులైతే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. సరిగ్గా ఆ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని వర్మను ఉండవల్లి పిలిపించుకుని మాట్లాడారు. కూటమి అవసరాలు వివరించారు. సమన్వయంతో పని చేసి పవన్ కల్యాణ్ విజయానికి దోహదపడమని ఆదేశించారు.
దీంతో క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తలా వర్మ ఆ క్షణం నుంచీ పవన్ కల్యాణ్ విజయమే లక్ష్యంగా పని చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్ కూడా వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. పవన్ కల్యాణ్ అయితే వర్మకు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ క్రమంగా పరిస్థితిలో మార్పు వచ్చింది. జనసేన మద్దతు దారులతో వర్మకు గ్యాప్ ఏర్పడింది. తన నాయకుడి ఘన విజయం క్రెడిట్ లో కొంతైనా వర్మకు ఇచ్చుందుకు ఇష్టం లేకపోవడమో మరో కారణమో తెలియదు కానీ నియోజకవర్గంలో వర్మను క్రమంగా దూరం పెట్టడం మొదలైంది. అంతే కాకుండా నియోజకవర్గంలో ఆయన వ్యతిరేకులైన వైసీపీ వారిని జనసేనలో చేర్చుకున్నారు. ఇది సహజంగానే వర్మకు ఒకింత ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో వర్మ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు వర్మకు ప్రధాన్యమున్న పోస్టులోకి తీసుకుం టానని హామీ ఇచ్చినట్లు చెబుతారు. ఇప్పుడు చంద్రబాబుతో వర్మ భేటీ ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అటువంటి తరుణంలో వర్మ చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pithapuram-verma-meets-cbn-39-192460.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.