LATEST NEWS
వైసీపీలో అంతర్గత విభేదాలు, అసంతృప్తులు మరోసారి బహిర్గతమయ్యాయి. గతంలో  వైసీపీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ  కోసం ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆంధ్రప్రదేశ్) అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్..  తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తన భార్యతో కలిసి రోడ్డుపై బైఠాయించి  నిరసన వ్యక్తంచేశారు. వైసీపీ అగ్రనాయకత్వం తనను వాడుకుని వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ చేపట్టిన ఈ ధర్నా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. గతంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో   నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై బోరుగడ్డ అనిల్  తీవ్ర  వ్యాఖ్యలు చేశారు. జగన్ టైమిస్తే.. గంట, అరగంటలో  చంద్రబాబు, లోకేష్ లను లేపేస్తానంటూ బోరుగడ్డ  నోటికొచ్చినట్లుగా దూషణలు చేశారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అయితే..  ఇప్పుడు   వైసీపీ నాయకత్వం తనను పూర్తిగా పక్కన పెట్టిందని బోరుగడ్డ అనిల్ ఆరోపిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసుకు వెళ్తే కనీసం లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని..  ముఖ్యంగా వైసీపీ ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణ రెడ్డి తనను తీవ్రంగా అవమానిస్తున్నారని  ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద గంటల తరబడి వేచి చూసేలా చేసి,  నువ్వు ఎవరు?  అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  పార్టీ తరఫున తాను కేసులు ఎదుర్కొని జీవితాన్ని నాశనం చేసుకుంటే, ఇప్పుడు తనను రౌడీషీటర్‌గా ముద్రవేసి దూరం పెట్టడం దారుణమంటూ బేల మాటలు మాట్లాడారు.   వైఎస్ జగన్ ఇంటి ముందే ప్రాణాలు వదులుతానని, తనకు న్యాయం జరగకపోతే వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కారుమూరి వెంకట్ రెడ్డి వంటి నేతలు సైతం తనను కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆడియో సాక్ష్యాలను బయటపెట్టారు. అయితే ఈ వ్యవహారంపై తెలుగువన్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్  వైసీపీలో ఇది సహజ పరిణామమేనని విశ్లేషించారు.  శ్రీరెడ్డి, వర్రా రవీంద్రరెడ్డి, బోరుగడ్డ అనిల్ వంటి వారిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని, ఆ తర్వాత చేతులెత్తేయడం వైసీపీ అగ్రనాయకత్వానికి అలవాటేనని   శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. గతంలో విజయసాయి రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి సీనియర్లు సైతం పార్టీలోని కోటరీ వల్ల తీవ్ర అవమానాలకు గురయ్యారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు పెంచి పోషించిన నాయకులే ఇప్పుడు వారిపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుండటం కర్మ ఫలమని విశ్లేషించారు.   పార్టీ కోసం సర్వస్వం కోల్పోయిన కార్యకర్తలకు, మద్దతుదారులకు ఈ పరిణామాలు ఒక హెచ్చరిక లాంటివని పేర్కొంటున్నారు. అయితే బోరుగడ్డ ఇలా రోడ్డున పడటానికి కారణం స్వయంగా జగనేనని డీవీ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్ కోసం పాదయాత్ర చేసిన షర్మిల ఉదంతాన్ని గుర్తు చేశారు.   తాడేపల్లిలో బోరుగడ్డ అనిల్ దంపతుల ధర్నా వైసీపీ కోటరీ రాజకీయాలను మరోసారి ఎండగట్టిందన్న ఆయన రాబోయే రోజుల్లో ఇలాంటి అసంతృప్తులు మరిన్ని బయటపడే అవకాశం ఉందని చెప్పారు.    Borragadda Anil Dharna, Tadepalli YCP Office Protest, Borragadda Anil Vs Sajjala, YS Jagan Mohan Reddy,AP Political Updates, Telugu One
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ తమిళనాడు రాజకీయం రసకందాయంలో పడింది.  డీఎంకే నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి  ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.   తంజావూరులో ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో  ఉదయ నిథి స్టాలిన్.. టీవీకే అధినేత, సీఎం  విజయ్, సినీ నటి త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి  స్టాలిన్  సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు  తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.  ఈ వ్యవహారంపై తెలుగు వన్ చానల్  డిబేట్ లో సీనియర్ జర్నలిస్టులు వీవీరావు, గోపీ..    ఉదయనిధి అరెస్ట్ వ్యవహారంలో విజయ్ ప్రభుత్వం   తొందరపాటుగా వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు.  సభల్లో మాట్లాడే వ్యాఖ్యలను ఎదుర్కోవడానికి ప్రజాక్షేత్రం ఉండగా, అధికారాన్ని ఉపయోగించి తక్షణ  అరెస్టులకు పాల్పడటం విజయ్ రాజకీయ అనుభవ రాహిత్యానికి, అపరిపక్వతకు అద్దం పడుతోందని విశ్లేషించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధిస్తే, అది చివరికి బాధితుడికి రాజకీయంగా  సానుభూతి తెచ్చిపెడుతుందనడానికి చరిత్రలో అనేక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో తమిళనాడులో కరుణానిధి అరెస్ట్ ఘటన, తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్టు పరిణామాలు వారికి ప్రజాదరణను పెంచాయన్నారు.  ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ విషయంలో కూడా విజయ్ ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లి అంతిమంగా డీఎంకేకు ప్రయోజనం చేకూరుస్తుందని వీవీరావు చెప్పారు.  మరోవైపు నటి త్రిష పేరును ఈ వివాదంలోకి లాగడం, టీవీకే కార్యకర్తలు తీవ్ర నిరసనలు వ్యక్తంచేయడం వివాదాన్ని మరింత రాజేసింది. కేవలం క్షమాపణలు డిమాండ్ చేయడమో లేదా రాజకీయంగా తిప్పికొట్టడమో చేయకుండా, ఇలా పోలీసు బలగాలను ఉపయోగించడం వల్ల ఉదయనిధి ప్రతిష్ట దెబ్బతినడం కంటే ఆయనకు మైలేజ్ పెరిగే అవకాశమే ఉందన్నారు.   Udhayanidhi Stalin Arrest, Vijay Immature Politics, TVK vs DMK, Tamil Nadu Politics, Tone News News Analysis
దేశ రాజకీయాలలో ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని గుర్తింపు పొంది.. ఇప్పుడు తన స్వరాష్ట్రంలో రాజకీయ నాయకుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిశోర్ ఇటీవల రాష్ట్రంలోని బంకిపునా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాలలో తొలి అడుగు వేశారు.    బంకీపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం తొలి సారిగా మీడియా సమావేవంలో మాట్లాడిన ఆయన బీహార్ తక్షణావసరాలు పొత్తులు కాదనీ, పరిశ్రమలూ ఉద్యోగా లన్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం పొత్తులు, రాజకీయ సమీకరణాలపైనే దృష్టి పెడుతోందని విమర్శించారు.  అయితే రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. తమ పార్టీకి ఇతర పార్టీలతో ఎటువంటి పొత్తూ ఉండదని కుండబద్దలు కొట్టిన ప్రశాంత్ కిశోర్..  జనసురాజ్  అలయెన్స్ బీహార్ ప్రజలతో మాత్రమేనన్నారు.  స్వార్థ రాజకీయాల కోసం సిద్ధాంతాలను పక్కనబెట్టి  కొలువుదీరే సంకీర్ణ ప్రభుత్వాల వల్లు రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం లేదన్నారు.  జన సురాజ్ పార్టీ   లక్ష్యం అధికారం కాదనీ, సుపరిపాలన, పారదర్శకత,  సమగ్ర అభివృద్ధి మాత్రమేనని క్లియర్ కట్ గా చెప్పారు. అధకారం కంటే ప్రజాసంక్షేమం, అభివృద్ధే జనసురాజ్ పార్టీకి ముఖ్యమన్నారు.  Prashant Kishor,  Jan Suraaj Party, Bihar Jobs and Industrialization, Bihar Politics, Bankipur Bypoll Results
తమిళనాడులో అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం ప్రభుత్వం బుధవారం తన  తొలి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రి మేరీ విల్సన్ బుధవారం ( ఆగస్టు5) సభలో ప్రవేశపెట్టనున్నారు.  కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సమర్పిస్తున్న తొలి బడ్జెట్ కావడంతో.. ప్రభుత్వ   ప్రాధాన్యతలు, కొత్త పథకాలు, పాలనా  సంస్కరణలపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది.   రాష్ట్రం ఎదుర్కొంటున్న  ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన  హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య  సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం భారీ నిధులు వెచ్చించాల్సిన నూతన సంక్షేమ పథకాల ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పటివరకు అధికారికంగా అమలు చేస్తున్న  తైమామన్ తంగ మోదిరం' పథకం తప్ప, ఇతర పెద్ద పథకాల ప్రకటనలేవీ వెలువడలేదు.   ఈ తొలి బడ్జెట్‌లో సామాన్య ప్రజలను ఆకట్టుకునేలా కొన్ని కొత్త పథకాలతో పాటు, సేవా రంగాన్ని బలోపేతం చేసే కీలక పాలనా సంస్కరణలను ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.  ప్రజలపై అదనపు పన్నుల భారం వేయకుండా ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడంపై ప్రభుత్వం   దృష్టి సారించింది. అనవసర వ్యయాలను తగ్గించుకుంటూ, ఆదాయ సేకరణను మెరుగుపరచడం ద్వారా ఆర్థిక లోటును పూడ్చాలని భావిస్తోంది. ప్రజా సేవలను మరింత వేగవంతం చేయడం, పారదర్శకతను పెంచడం ద్వారా పాలనా వ్యవస్థలో   మార్పులు తీసుకురావడానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే  బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో శాసనసభ నిర్వహణ, బడ్జెట్‌పై చర్చలకు కేటాయించే వ్యవధి,  సంబంధిత షెడ్యూల్‌  ఖరారు చేయనున్నారు.   మొత్తానికి, టీవీకే ప్రభుత్వం తన తొలి వార్షిక బడ్జెట్ ద్వారా ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నది తమిళనాటే కాకుండా, దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది.   TVK Budget 2026, Tamil Nadu First Budget, Mary Wilson TVK, Thaimaman Thanga Mothiram Scheme, Tamil Nadu
  దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఈ ఎన్నికల సరళిని పరిశీలిస్తే, సుదీర్ఘకాలంగా స్థిరపడిన రాజకీయ సమీకరణాలు  ఓటర్ల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా బీహార్‌లోని పాట్నా పరిధిలోని బ్యాంకీపూర్ నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ‘జన్ సురాజ్’ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం జాతీయ స్థాయిలో తీవ్ర రాజకీయ చర్చకు తెరలేపింది. ఈ అంశంపై  టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర విశ్లేషణ జరిగింది. బీహార్‌లోని ఈ నియోజకవర్గం దాదాపు మూడు దశాబ్దాలుగా (1995 నుండి) భారతీయ జనతా పార్టీకి చెక్కుచెదరని కోటగా ఉంటూ వచ్చింది. అధికారంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం, పార్టీ జాతీయ స్థాయి నేతలకు అత్యంత ప్రాతినిధ్యం ఉన్న స్థానం కావడం వంటి అనేక సానుకూలాంశాలు ఉన్నప్పటికీ బిజెపి ఇక్కడ భారీ తేడాతో ఓటమి పాలైంది. ప్రశాంత్ కిషోర్ దాదాపు 19,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీని మూడో స్థానానికి నెట్టివేయడం గమనార్హం. మరోవైపు గుజరాత్‌లో బిజెపి విజయం సాధించినప్పటికీ, గతంలో ఉన్న లక్ష మెజారిటీ ఈసారి కేవలం 30,000కు పడిపోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తన మెజారిటీని రెట్టింపు చేసుకుంది. ఈ పరిణామాలు అధికార పక్షంలో క్షేత్రస్థాయి అసంతృప్తి పెరుగుతోందనడానికి స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ఫలితాల వెనుక వ్యూహాత్మక మార్పులు  సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించాయి:  బ్యాంకీపూర్ నియోజకవర్గంలో మూడో వంతు ఓటర్లు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులే. ఇటీవల దేశంలో చోటుచేసుకున్న విద్యార్థి, ఉద్యోగ, యువజన ఉద్యమాలు  సామాజిక అంశాలపై యువతలో వ్యక్తమవుతున్న నిరసన ఈ ఓటింగ్ సరళిపై నేరుగా ప్రభావం చూపింది. ప్రశాంత్ కిషోర్ పాదయాత్రలు, ప్రజా సమస్యలపై నేరుగా మాట్లాడటం, సాంప్రదాయ కుల-మత రాజకీయాలకు అతీతంగా విద్యా-ఉపాధి అంశాలను ముందుకు తీసుకురావడం పట్టణ ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం బిజెపి వైఫల్యాలే కాకుండా, ప్రతిపక్షంలో ఉన్న బిహార్ సాంప్రదాయ పార్టీలు కూడా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. దీనిని జన్ సురాజ్ పార్టీ ఒక అవకాశంగా మలుచుకోగలిగింది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్ జాతీయ రాష్ట్ర రాజకీయాలపై బహుముఖ ప్రభావాన్ని చూపనున్నాయి. రాబోయే రోజుల్లో ప్రాంతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తులు రూపుదిద్దుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజల్లో పెరుగుతున్న 'యాంటీ-ఇంబంబెన్సీ'ని సకాలంలో గుర్తించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గుజరాత్, బీహార్ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాకుండా, కేవలం సాంప్రదాయ కుల సమీకరణాలు, భావోద్వేగ నినాదాలు మాత్రమే కాకుండా ఉపాధి, విద్య, పాలనా పారదర్శకత ప్రాతిపదికగా ఓటర్లు, ప్రత్యేకించి యువత తీర్పు ఇస్తున్నారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే సాధారణ శాసనసభ ఎన్నికల్లో యువత ఓటింగ్ సరళినే జయాపజయాలను శాసించే ప్రధాన శక్తిగా మారనుందనడంలో సందేహం లేదు. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.   Bankipur election results, Prashant Kishor, Bihar politics,  Gujarat bypoll result, BJP setback Bihar Gujarat
ALSO ON TELUGUONE N E W S
వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్ సెన్సేషనల్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘దందా’తో దర్శకుడు ఆదిత్య దేవులపల్లి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తన సినీ జర్నీ, నేపథ్యం గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పండి? నేను చదువులో టాపర్‌నే, కానీ చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే పిచ్చి. ఆ ప్యాషన్‌తోనే ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసి రాడికల్ డెసిషన్ తీసుకున్నా. ఇంట్లో కెమెరా మీద ఉన్న ఆసక్తిని చెప్పడంతో ఓ చిన్న కెమెరా కొనిచ్చారు. ఇండస్ట్రీలో నాకంటూ ఎవరూ లేరు, ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా ఫోటోగ్రఫీ నేర్చుకుని ఇక్కడికి వచ్చా. ఆ తర్వాత సెయింట్ మేరీస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్‌లో చేరా. అక్కడ నా ప్రొఫెసర్ అమృత్ సార్‌కి కూడా సినిమా అంటే పిచ్చి. ఆయన వల్లే ఫ్రెంచ్, ఇంగ్లీష్‌తో సహా వరల్డ్ సినిమా వైపు నా చూపు మళ్ళింది. ఆ తర్వాత జర్నలిజంలోకి వచ్చి కాంటాక్ట్స్ పెంచుకున్నా. ఆ క్రమంలోనే చాయ్ బిస్కెట్ అనురాగ్ అన్నకి ఓ వైలెంట్ కథ నరేట్ చేశా. నేను ఎప్పుడు అనుకునే వాడిని నేను 28 years కల్లా డైరెక్టర్ అవ్వాలి అని, అయ్యాను  చాయ్ షాట్స్‌లోకి ఎంట్రీ ఎలా జరిగింది? నేను చెప్పిన కథ అనురాగ్ అన్నకి బాగా నచ్చింది. "తెలుగులో సాధారణంగా ఇలాంటి కథను తీసే ధైర్యం ఎవరూ చేయరు" అని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ నన్ను పిలిచి మాట్లాడారు. అప్పటికే నేను జర్నలిజంలో ఉన్నా, ఆయన కొత్తగా చాయ్ షాట్స్ ప్రారంభించి నన్ను క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా జాయిన్ అవ్వమన్నారు. అక్కడ కొన్ని షోస్ చేసిన తర్వాత, నాకు అదంతా రొటీన్ గా, ఏమాత్రం ఎగ్జైటింగ్ లేదనిపించింది. దాంతో నేరుగా అనురాగ్ అన్న దగ్గరకే వెళ్లి, "నేను నీకో క్రేజీ షో డైరెక్ట్ చేసి చూపిస్తా" అని పట్టుబట్టి చెప్పా. అలా ‘దందా’ ప్రయాణం మొదలైంది. ‘దందా’ కథలో మీ ప్రమేయం ఎంతవరకు ఉంది? ఒరిజినల్ కథను విజయ్ కుమార్ రాశాడు, కానీ అందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను మొత్తం రీ-రైట్ చేసి కథకు ఒక కంప్లీట్‌నెస్‌ తీసుకొచ్చా. గణేష్ ఠాకూర్, అరవింద్, ప్రకాష్ ఠాకూర్ క్యారెక్టర్ బ్యాక్‌గ్రౌండ్స్‌తో సహా దాదాపు 40 శాతం మార్పులు చేశాను. ఆ తర్వాతే దొరసాయి తేజ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాడు. ‘దందా’కి వస్తున్న రెస్పాన్స్ అండ్ అప్రిషియేషన్ ఎలా ఉంది? ఇప్పటివరకు ‘దందా’కి ఒక్కటంటే ఒక్క నెగెటివ్ రివ్యూ కూడా రాలేదు. ప్రతీ ఒక్కరూ ఈ ఫ్రెష్ మేకింగ్ స్టైల్, స్ట్రాంగ్ కంటెంట్‌ను విపరీతంగా పొగుడుతున్నారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సిరీస్ బాలేదని ఒక్కడు కూడా అనలేదు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం అనురాగ్ అన్నకి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ప్రతీ సీన్ చాలా ఫాస్ట్ పేస్డ్‌గా, ఎంగేజింగ్‌గా ఉందంటుంటే చాలా గర్వంగా ఉంది. సొంత కథ కాకుండా ‘దందా’తోనే డైరెక్టర్‌గా ఎందుకు డెబ్యూ చేశారు? నాకు పూరీ జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, ఉపేంద్ర లాంటి డైరెక్టర్ల మేకింగ్ అన్నా, ఆటిట్యూడ్ అన్నా చాలా ఇష్టం. చాయ్ షాట్స్‌లో ఉన్నప్పుడు వందలాది స్క్రిప్ట్‌లు విన్నాను. కానీ ‘దందా’ కథ చదువుతుంటే నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించింది. అచ్చం నా రా నెస్ (Raw style) ఉన్న కథలా అనిపించింది. విజయ్ అద్భుతంగా రాశాడు. క్రెడిట్స్ విషయంలో నాకు కానీ, విజయ్‌కి కానీ ఎలాంటి ఈగోలు లేవు. నేను కథను రీషేప్ చేయడానికి విజయ్ కూడా హ్యాపీగా ఒకే అన్నాడు. వర్టికల్ స్టోరీ టెల్లింగ్‌లో నా మార్క్ డైరెక్షన్‌తో ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలనుకున్నా. చాయ్ షాట్స్ ఆఫీస్‌లో నేను చేసిన డెమో చూసి అంతా ఫిదా అయిపోయారు. వర్టికల్‌లో సరైన స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవడంతో, ‘దందా’తో ఒక ప్రాపర్ సినిమాటిక్ ట్రెండ్ తీసుకురావాలని ఫిక్స్ అయ్యా. వర్టికల్ కంటెంట్ కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు? ప్రస్తుతం మైక్రో డ్రామాలను జనాలు విపరీతంగా చూస్తున్నారు. కానీ వర్టికల్ ఫార్మాట్‌లో ప్రతీ సీన్ గ్రిప్పింగ్‌గా ఉండాలి. మామూలు సినిమాల్లో అయితే ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో హైస్ అండ్ లోస్ ఉంటాయి. కానీ వర్టికల్‌లో ప్రతీ సీన్ ఒక క్లైమాక్స్ లాగే ఉండాలి! నిజం చెప్పాలంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు తీయడం కంటే మైక్రో డ్రామాలు తీయడం చాలా కష్టం. ఈ పేసింగ్ చూస్తే, బయట ఉన్న బిగ్ మూవీ డైరెక్టర్లలో 80% మంది మైక్రో డ్రామా తీస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సెటప్ చేయడానికి ఇక్కడ టైమ్ ఉండదు. మొదటి సెకన్ నుంచే ఆడియెన్స్‌ను హుక్ చేయాలి. ఇది చాలా ఛాలెంజింగ్ అండ్ ఎగ్జైటింగ్ జర్నీ. డైలాగ్స్ గురించి చెప్పండి? ఈ పవర్‌ఫుల్ డైలాగ్స్ అన్నీ అరవింద్ క్యారెక్టర్ జర్నీ నుంచే పుట్టుకొచ్చాయి. చిన్నతనం నుంచే లైబ్రరీలో ఉంటూ, మనుషులను గమనించడం వల్ల ఆ పాత్రకు ఒక డెప్త్ వచ్చింది. ఆ క్యారెక్టరే మాతో ఇంకా కొత్తగా, ఫ్రెష్‌గా లైన్స్ రాయించింది. కాస్టింగ్ సెలెక్షన్ ఎలా జరిగింది? అరవింద్ పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం, ఫైనల్‌గా దొరసాయి తేజను ఓకే చేశాం. ఆరంభంలో అతని చుట్టూ ఉన్న కాంట్రవర్సీలు చూసి కొన్ని అనుమానాలు ఉండేవి, కానీ కలిసిన తర్వాత తేజ ఎంత వండర్ఫుల్ పర్సనో అర్థమైంది. కథ వినగానే ఆశ్చర్యపోయి, వెంటనే మార్కెటింగ్, నంబర్స్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అంత క్లియర్ విజన్, లాంగ్ టర్మ్ థింకింగ్ ఉన్న వ్యక్తి తేజ. చాలామంది లీడ్ యాక్టర్లు ఇవ్వని 'బ్లైండ్ ట్రస్ట్' నా మీద, ‘దందా’ మీద ఉంచాడు. అలాగే నితిన్ ప్రసన్న గారికి కథ చెప్పగానే ఆయన వెంటనే ఒకే చెప్పారు. మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ గురించి? నేను నా ప్రాజెక్ట్‌లో కెమెరా షాట్ నుంచి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ వరకు ప్రతీ ఒక్కటి దగ్గరుండి డిజైన్ చేసుకునే టైప్ మేకర్‌ని. అందుకే నా విజన్‌ను అర్థం చేసుకునే టీమ్ నా పక్కన ఉండాలనుకున్నా. కేరళలో ఉన్న నా ఫ్రెండ్స్ ద్వారా కెమెరామెన్ అశ్విన్ లెనిన్ పరిచయమయ్యాడు. అతనికి ‘దందా’ విజన్ చెప్పగానే, కరెన్సీ నోట్ల ఆధారంగా డిజైన్ చేసిన ప్రత్యేకమైన కలర్ ప్యాలెట్‌ను క్రియేట్ చేసి, బెస్ట్ లెన్సెస్‌తో క్రేజీ విజువల్స్ ఇచ్చాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ రిషి ఎమ్ నా మంచి ఫ్రెండ్. షూటింగ్ ప్రారంభం కాకముందే మెజారిటీ మ్యూజిక్ కంపోజ్ చేసేశాడు! ఎంత కూల్ అంటే—నేను పలానా ఇన్‌స్ట్రుమెంట్ వాడమని చెప్పినా, లేదా అతను చేసిన కంపోజిషన్‌ను రిజెక్ట్ చేసినా ఏమాత్రం ఈగో తీసుకోకుండా కొద్ది నిమిషాల్లోనే మైండ్ బ్లోయింగ్ అవుట్‌పుట్ ఇచ్చేవాడు. టాలీవుడ్‌కి దొరికిన ఒక క్రేజీ అండ్ ఫ్రెష్ మ్యూజిక్ టాలెంట్ రిషి! రాజమౌళి గారు కేమియో చేశారా? (నవ్వుతూ) రాజమౌళి సర్ ఒక లెజెండ్.. హి ఈజ్ ది GOAT! నా డైరెక్షన్‌లో వచ్చే ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కావాలనే చిన్న కోరిక ఉండేది, కానీ ఆయన్ని నేరుగా అప్రోచ్ అయ్యే స్థాయి నాకు లేదు. అందుకే సైబర్ క్రైమ్‌పై ఆయన చేసిన ఓ అవేర్‌నెస్ వీడియోను ఆయనకిచ్చే ట్రిబ్యూట్‌గా ఈ సిరీస్‌లో వాడుకున్నాం. ‘దందా’తో ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నారా? నేను ‘దందా’ని 100% ఎంటర్‌టైన్‌మెంట్ మైండ్‌సెట్‌తోనే తీశాను. కానీ దాంతో పాటు సమాజానికి కాస్త ఉపయోగపడే విషయాలు చెబితే 'విన్-విన్' అవుతుంది కదా అనిపించింది. అందుకే సైబర్ క్రైమ్స్ వెనుక ఉన్న దారుణాలను వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూపించాం. సైబర్ నేరగాళ్లు వేల కోట్లు కొల్లగొడుతున్నారు, కానీ మనం వాళ్లను పట్టుకోలేకపోతున్నాం. ఒక చిన్న OTPతో లక్షలు మాయమైపోతున్నాయి. ప్రోటాగానిస్ట్ ద్వారా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూనే, ఈ సైబర్ నేరగాళ్ల అసలు రూపాన్ని బయటపెట్టి జనాల్లో అవేర్‌నెస్ తేవాలని ఈ కథను డిజైన్ చేశా. హీరోయిన్ క్యారెక్టర్ గురించి? మన సినిమాల్లో ఒక అమ్మాయి పాదాలను అంతగా ఫోకస్ చేసి చూపించలేదు (నవ్వుతూ). అరవింద్ చిన్నతనంలో ఎప్పుడూ నేల మీదే నిలబడి ఉండేవాడు, ఆ పర్స్పెక్టివ్ వల్లే అతనికి పాదాలను గమనించే అలవాటు వచ్చి ఉంటుంది. అక్షరను కలిసినప్పుడు కూడా నేను ఈ పాయింట్ గురించే మాట్లాడా (నవ్వుతూ). తను అద్భుతంగా నటించింది. అరవింద్‌గా తేజ, నీరుగా అక్షర పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. తేజ పర్ఫార్మెన్స్ గురించి మీ కామెంట్? తేజ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. తనని చూడటానికి జనాలు రూ. 200 లేదా రూ. 250 టికెట్ కొని థియేటర్‌కి వచ్చే స్థాయికి ఎదగాలనే కసి అతనిలో ఉంది. ‘దందా’ని గుడ్డిగా నమ్మి నాకోసం 1000% ఇచ్చాడు. ఎంత బ్లైండ్ ట్రస్ట్ అంటే.. తను చేసిన సీన్ కరెక్ట్‌గా వచ్చిందో లేదో చూడటానికి మానిటర్ వైపు కూడా చూడడు! తేజ నటనలోని అసలు పవర్ ఇంకా చాలామంది చూడలేదు. 28వ ఎపిసోడ్‌లో తను చెప్పిన మోనోలాగ్ డైలాగ్ ఒకే ఒక్క సింగిల్ టేక్‌లో చేశాడు! నన్ను మైండ్ బ్లోయింగ్ అనిపించాడు. తేజ గ్రేట్ నటుడు, టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ అవుతాడు.. ఇది నా గ్యారెంటీ! నిమిషం గ్యాప్ లేకుండా పనితో బిజీగా ఉన్నా, సెట్‌కి వస్తే కంప్లీట్ డెడికేషన్‌తో ఉంటాడు. నా నెక్స్ట్ ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిలిం పక్కా తేజతోనే ఉంటుంది.. అదీ ‘దందా’ కంటే ఐదు రెట్లు వైల్డ్‌గా ఉంటుంది! ‘దందా’ సక్సెస్‌పై మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నాలో ఉన్న ఈ ఫైర్ మా అమ్మ నుంచి వచ్చిందే! ఆమె తరచూ చెప్పే “రాజు కంటే మొండోడే బలవంతుడు” అనే డైలాగ్‌నే సిరీస్‌లో వాడాను. మా నాన్నకి హీస్ట్ సినిమాలు అంటే పిచ్చి ఇష్టం. ‘మనీ హీస్ట్’ సిరీస్‌ను ఎన్నోసార్లు చూశారు. నేను ఈ కథ చెప్పగానే, "ఇది పక్కా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది" అని చెప్పేశారు. ఫైనల్‌గా ‘దందా’ గురించి ఏం చెప్తారు? అసలైన "జెన్ జీ మాస్" అంటే ఏంటో తెలియాలంటే ‘దందా’ చూడాల్సిందే! ఒక్క సెకన్ కూడా వేస్ట్ కాకుండా ప్రతీ ఫ్రేమ్ పరిగెడుతుంది. సిరీస్ చూశాక మేమందరం మీ మైండ్‌లో ఉండిపోతాం. మైక్రో డ్రామానే కదా అని తక్కువ అంచనాతో చూడటం స్టార్ట్ చేయండి.. మా సిరీస్ మీ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది! మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతం ఒక 50 ఏళ్ల నేరస్థుడి చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ స్టోరీ రాస్తున్నా. అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోయే రెండు మూడు నెలల్లో వస్తుంది. https://www.instagram.com/reel/DbXN8DjFM5P/   Dora Sai Teja, Dhandha, Aditya Devulapalli, Interview  
పెద్ద పెద్ద నగరాల్లో లభించే హై-టెక్ మల్టీప్లెక్స్ సినిమా అనుభవాన్ని చిన్న పట్టణాల్లోని సినీ ప్రియులకు కూడా తక్కువ ధరలోనే చేరువ చేసేందుకు దేశంలోనే అతిపెద్ద థియేటర్ నెట్‌వర్క్ 'పీవీఆర్ ఐనాక్స్' భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 'స్మార్ట్ సినిమా' పేరిట రాబోయే మూడేళ్లలో టైర్-2, టైర్-3, టైర్-4 పట్టణాల్లో ఏకంగా 300 అధునాతన సినిమా స్క్రీన్లను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా మల్టీప్లెక్స్ అనగానే టికెట్ ధరలు, పాప్‌కార్న్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉండవనే టాక్ ఉంది. ఈ ఇమేజ్‌ను మార్చేలా పీవీఆర్ ఐనాక్స్ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసింది. ఈ 'స్మార్ట్ సినిమా' థియేటర్లలో గరిష్ఠ టికెట్ ధరను కేవలం రూ.189 గా నిర్ణయించారు. ఇది మెట్రో నగరాల్లో ఉండే సాధారణ టికెట్ ధరలతో పోలిస్తే దాదాపు 30 నుంచి 35 శాతం తక్కువ కావడం గమనార్హం. టికెట్ ధరలతో పాటు థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, నాచోస్ వంటి ఆహార పదార్థాల (F&B) రేట్లను కూడా సగం వరకూ తగ్గించి సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నారు. తొలి దశలో భాగంగా బీహార్‌లోని ముజఫర్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని బరాక్‌పూర్, యూపీలోని రాంపూర్ వంటి ప్రాంతాల్లో ఈ స్మార్ట్ స్క్రీన్లను ప్రారంభించబోతున్నారు. టికెట్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని పీవీఆర్ ఐనాక్స్ స్పష్టం చేసింది. ఈ థియేటర్లలో అత్యాధునిక 2K లేజర్ ప్రొజెక్షన్, 7.1 సౌండ్ సిస్టమ్, విలాసవంతమైన సీటింగ్ సౌకర్యాలను కల్పించనున్నారు. తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ఈ స్క్రీన్‌లను నిర్మిస్తున్నారు. ఇటీవలి కాలంలో టికెట్ రేట్లు పెరిగిపోవడం, ఓటీటీల హవా ఎక్కువవడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం కాస్త తగ్గింది. ఈ పరిస్థితిని మార్చి, చిన్న పట్టణాల ప్రేక్షకులను తిరిగి థియేటర్ల వైపు ఆకర్షించడానికే పీవీఆర్ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో సినీ అభిమానుల నుంచి విపరీతమైన ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలను బిగ్ స్క్రీన్ పై చూడాలనుకునే చిన్న పట్టణాల మూవీ లవర్స్‌కు ఈ స్మార్ట్ థియేటర్లు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. తక్కువ ధరలోనే లగ్జరీ మల్టీప్లెక్స్ అనుభూతి దక్కనుండటంతో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వసూళ్లకు ఇది మరింత బ‌లాన్ని చేకూరుస్తుంద‌ని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రవితేజ, శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురవడం ఖాయం.  ఓ కామెడీ ఎంటర్‌టైనర్ కోసం రవితేజ, శ్రీవిష్ణు చేతులు కలపనున్నారు. ఈ మల్టీస్టారర్ కు హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. 'రాజ రాజ చోర', 'స్వాగ్' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి.. ఈ ఇద్దరు హీరోల కోసం ఒక హిలేరియస్ ఫన్ రైడ్‌ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు వినికిడి. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుందట. ఇక ఈ సినిమాకి 'వీరాధి వీరులు కేరాఫ్ మహిళా మండలి' అనే డిఫరెంట్ అండ్ క్యాచీ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. టైటిల్ వింటుంటేనే కడుపుబ్బా నవ్వించే ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామా మన ముందుకు రాబోతోందని స్పష్టమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ థియేటర్లకు రప్పించేలా 2027 సంక్రాంతి రేసులో నిలపాలని మేకర్స్ పక్కా స్కెచ్ వేస్తున్నారు. రవితేజ, శ్రీవిష్ణు కలిస్తే 2027 సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర నవ్వుల జాతరే అని చెప్పొచ్చు.     Ravi Teja, Sree Vishnu, Multistarrer, Hasith Goli  
ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో విల‌క్ష‌ణ న‌టుడిగా, ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌దీప్‌సింగ్ రావ‌త్‌(74) మంగ‌ళ‌వారం సాయంత్రం క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన, ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన అకాల మరణవార్త వినగానే టాలీవుడ్, బాలీవుడ్ సహా పలు సినీ పరిశ్రమల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రావత్ కెరీర్ ప్రారంభంలో బి.ఆర్. చోప్రా ప్రతిష్టాత్మక టీవీ సీరియల్ 'మహాభారత్'లో అశ్వత్థామ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అమీర్ ఖాన్ నటించిన 'లగాన్'లో దేవా పాత్రతో మెప్పించిన ఆయన, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సై' చిత్రంలో భిక్షు యాదవ్‌గా టాలీవుడ్‌కి పరిచయమై సరికొత్త విలనిజానికి తెరతీశారు. క్రూరమైన కళ్లు, గంభీరమైన బాడీ లాంగ్వేజ్‌తో ఆయన పండించిన నెగెటివ్ షేడ్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టాయి. ఆ పాత్రకు గాను ఆయన ఫిలింఫేర్ ఉత్తమ విలన్ అవార్డును కూడా గెలుచుకున్నారు. అనంతరం 'ఛత్రపతి', 'దేశముదురు', 'జగడం', 'స్టాలిన్' వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో అగ్ర హీరోలకు సరిసమానమైన నటనను కనబరిచారు. సైనిక కుటుంబ నేప‌థ్యం నుంచి వచ్చిన ప్రదీప్ రావత్, ప్రారంభంలో బ్యాంకింగ్ రంగంలో పనిచేసి నాటకాలపై ఉన్న ఆసక్తితో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 36 ఏళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ సమయంలో సముద్రపు అలల మధ్య ప‌డిపోయారు ప్ర‌దీప్‌. ఎంతో క‌ష్టం మీద ఆయ‌న్ని బ‌య‌టికి తీసుకొచ్చారు. ఆయ‌న ప్రాణాల‌తో ఉండే అవ‌కాశం లేద‌ని చిత్ర యూనిట్ కూడా భావించింది. అయితే అదృష్ట‌వ‌శాత్తూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అది త‌న‌కు ఎంతో భ‌యాన‌క జ్ఞాప‌కం అని ప్ర‌దీప్ చెప్పేవారు. చావు అంచుల వ‌ర‌కు వెళ్లి రావ‌డం అనేది మామూలు విష‌యం కాదని, చిత్ర ప‌రిశ్ర‌మ‌, ప్రేక్ష‌కుల ఆశీస్సుల వ‌ల్లే బ్ర‌తికి బ‌య‌ప‌డ్డాన‌ని చెప్పేవారు.  ఆ త‌ర్వాతి కాలంలో ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌లు పోషించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ప్రదీప్ రావత్ మృతిపై టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు, దర్శకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 'లగాన్' కొలీగ్ యశ్‌పాల్ శర్మతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. "మా గజిని, దేవా ఇకలేరు" అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్, సీన్స్ గుర్తు చేసుకుంటూ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్ వండర్‌తో మన ముందుకు రాబోతున్నారు. అదే 'కరికాల'. 'శంభాల' ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ అడ్వెంచర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  "రాజులు, సింహాలు, తోడేళ్లు, మాయలతో కూడిన ప్రపంచం" అంటూ మూవీ టైటిల్‌ను రివీల్ చేస్తూ తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. సందీప్ కిషన్ రాజు అవతారంలో గుర్రంపై కత్తి పట్టుకుని, సింహాన్ని తరుముతున్నట్టుగా ఉన్న పవర్‌ఫుల్ పోస్టర్ అదిరిపోయింది. ఈ టైటిల్ పోస్టర్‌తో ఒక్కసారి అంచనాల్ని రెట్టింపు చేసేశారు.  ఈ మూవీని రెండు పార్టులుగా మేకర్లు ప్లాన్ చేశారు.  మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న రానుంది. రెండు పార్టుల రిలీజ్ డేట్‌లను ఒకే సారి ప్రకటించడం చూస్తుంటే.. మేకర్స్ ఎంత క్లారిటీగా, ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారో అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ ను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. 'శంభాల' విజయం తర్వాత, దర్శకుడు యుగంధర్ ముని, షైనింగ్ పిక్చర్స్ బృందం ఈ ‘కరికాల’ ప్రాజెక్ట్‌ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.  సరికొత్త ప్రపంచం, అద్భుతమైన కథనం, భారీ విజువల్స్ తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని మూవీ టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.    Sundeep Kishan, Karikaala, First Look, Ugandhar Muni  
గ్లామర్ ప్రపంచంలో తన ప్రత్యేకమైన నటనతో, ఫ్యాషన్ సెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్ట్రెస్ శోభితా ధూళిపాళ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ బ్యూటీ, తాజాగా తన రాజకీయ భావజాలంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారితీశాయి. సాధారణంగా చిత్రసీమలో ఉండే నటీనటులు రాజకీయ విషయాలపై స్పందించడానికి కాస్త వెనకాడుతుంటారు. ముఖ్యంగా తమ కెరీర్‌పై ఎక్కడ ప్రభావం పడుతుందోననే భయంతో పొలిటికల్ ఐడియాలజీని బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ శోభిత మాత్రం ఎటువంటి దాపరికం లేకుండా తన మనసులోని మాటను ఓపెన్‌గా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకు వామపక్ష భావజాలం అంటే చాలా ఇష్టమని, ఆ సిద్ధాంతాలు తనలో బలంగా ఉన్నాయని శోభిత వ్యాఖ్యానించారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఏదో ఒక రోజు కమ్యూనిజమే కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సిద్ధాంతాల పరంగా తనకున్న ఆలోచనలను స్పష్టంగా బయటపెట్టడంతో ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. మోడలింగ్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభితా ధూళిపాళ అడివి శేష్ సరసన 'గూఢచారి', 'మేజర్' వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్', హిందీ వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్' లలో తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇటీవలే అక్కినేని నాగచైతన్యతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గ్లామర్ ఫీల్డ్‌లో ఉంటూనే కమ్యూనిజం, వామపక్ష సిద్ధాంతాల గురించి ఆమె మాట్లాడటం నిజంగా విశేషమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. శోభిత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె బోల్డ్‌నెస్, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వాన్ని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం సినీ ఇండస్ట్రీలో ఉంటూ కమ్యూనిజం గురించి మాట్లాడటం ఏంటని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా తనదైన వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకునే శోభితా ధూళిపాళ, రాబోయే రోజుల్లో 'వెట్టువమ్' వంటి మరిన్ని విలక్షణమైన ప్రాజెక్టులతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నటిగా మాత్రమే కాకుండా తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే వ్యక్తిగా కూడా శోభిత మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు.
Sahaa has been creating a positive impression ever since the makers unveiled the World of Sahaa glimpse, promising a refreshing romance with a relatable backdrop. Starring Shiva Kumar Kasaram and Swetha Lakshman in the lead roles, the film has now taken its promotions a step further with the release of its first single, 'Okka Chinni Navve', an enchanting melody that beautifully captures the emotions of falling in love. Composed by Shekar Chandra, the song celebrates the joy, excitement and nervousness that come with a special person's smile. Suresh Banisetty's heartfelt lyrics blend seamlessly with Yogesh Rella's soulful rendition, resulting in a melody that is soothing and instantly memorable. The composition carries a pleasant repeat-listening quality, making it easy to connect with. Director Nishanth Doti keeps the visuals simple yet effective, presenting the romance in a slice-of-life style that feels genuine. Shiva Kumar Kasaram and Swetha Lakshman share natural chemistry on screen, and their effortless performances add warmth to every frame. The relatable moments between the lead pair give the song its charm and make their love story feel authentic. Produced by Teja Velpucharla under the Sumaira Studios banner, Sahaa continues to build curiosity with its appealing promotional material. With Okka Chinni Navve striking the right emotional chord, the film has further raised expectations among audiences. The makers are expected to announce the release date and more details about the romantic entertainer soon. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం.. అందులోనూ ఆయన కెరీర్ లో చివరి సినిమాగా వచ్చిన 'జన నాయగన్' భారీ డిజాస్టర్ అవ్వడం.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు అనౌన్స్ చేసిన ఈ లాస్ట్ ప్రాజెక్ట్‌పై మొదట్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరగరాస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, థియేటర్లలో సీన్ రివర్స్ అయింది. విడుదలకు ముందే ఈ సినిమా అనేక అడ్డంకులు దాటుకుని వచ్చింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, పొలిటికల్ డైలాగ్స్ వివాదం, మూవీ లీక్.. ఇలా ఎన్నో రకాల ప్రెజర్ల మధ్య జూలై 23న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు రూ.78 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ.. నెగెటివ్ టాక్ వల్ల రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.  దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన 'జన నాయగన్' మూవీ, ఇప్పటివరకు రూ.300 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. అయితే బడ్జెట్, బిజినెస్ పరంగా చూస్తే భారీ నష్టాలు తప్పేలా లేవు. 'జన నాయగన్' బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ, ఇప్పటిదాకా సుమారు రూ.140 కోట్ల షేర్ రాబట్టింది. ఇక సినిమా రన్ దాదాపు  ముగిసినట్లే. దాంతో డిజాస్టర్ గా మిగలనుంది. విజయ్ తన సినీ కెరీర్‌కు ఒక గ్రాండ్ గుడ్ బై చెప్తారని ఆశించిన ఫ్యాన్స్ కు 'జన నాయగన్' ప్లాప్ అవ్వడం నిజంగా పెద్ద షాక్.     Jana Nayagan, Box Office, Thalapathy Vijay, Jana Nayakudu  
Sundeep Kishan is set to reinvent himself with Karikala, an ambitious fantasy adventure that aims to transport audiences into a magical world of warriors, mythical creatures and epic battles. He seems to be highly inspired by Baahubali as he is going for two part release but with three to four months gap like Dhurandhar. The makers have unveiled the film's first look poster, offering the first glimpse into the scale and vision of director Ugandhar Muni, who impressed audiences with Shambala. The poster presents Sundeep Kishan in a fierce warrior avatar, charging into battle on a majestic black horse while wielding a sword. Adding to the grandeur is a roaring lion running alongside him, hinting at a world where nature and mythology coexist. The dense forests, towering cliffs and mystical atmosphere reinforce the film's tagline, "A Magical World," suggesting that Karikala will be a fantasy spectacle rather than a conventional period drama. One of the biggest announcements accompanying the first look is that Karikala will unfold across two chapters. Chapter 1 is scheduled to hit theatres on July 2, 2027, while Chapter 2 will follow on October 28, 2027. While the movie poster looks like it is attempting a warrior story like Baahubali with period action, the two part release is planned like Dhurandhar with four month gap, only.  Directed by Ugandhar Muni and produced by Mahidhar Reddy and Rajasekhar Annabhimoju under the Shining Pictures banner, Karikala appears to be one of the most ambitious projects in Sundeep Kishan's career. With its striking first look, fantasy setting and two-part storytelling format, the film has already generated curiosity among movie lovers eager to see the actor in a completely new avatar. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, నేషనల్ అవార్డు గ్రహీత ధనుష్ రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరో అని మళ్ళీ నిరూపించుకున్నారు. తాను విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు ఓ అద్భుతమైన కానుకను అందించి తన ఉదారతను చాటుకున్నారు. చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న తాయ్ సత్య మెట్రిక్యులేషన్ స్కూల్‌కు మూడు అంతస్తులతో కూడిన నూతన భవనాన్ని స్వయంగా నిర్మించి విరాళంగా ఇచ్చారు. ఈ నూతన భవనానికి పాఠశాల యాజమాన్యం గౌరవసూచకంగా 'ధనుష్ బ్లాక్' అని నామకరణం చేసింది. ధనుష్ పదో తరగతి వరకు ఇదే విద్యాలయంలో చదువుకోవడం విశేషం. ఇటీవల ఘనంగా జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో ధనుష్ పాల్గొని, ఆ భవనాన్ని విద్యార్థులకు అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి ధనుష్ తన క్లాస్‌మేట్, సినీ ఛాయాగ్రాహకుడు కుమరన్‌తో కలిసి విచ్చేశారు. పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ధనుష్.. తనకు విద్యను అందించిన గురువుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ టీచర్లతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగడంతో అక్కడి వాతావరణం ఎంతో భావోద్వేగంగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన సినిమాటోగ్రాఫర్ కుమరన్.. తమ స్కూల్ భవనాల పునర్నిర్మాణం గురించి తెలుసుకున్న ధనుష్ ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వచ్చారని తెలిపారు. కేవలం ఈ మూడు అంతస్తుల భవనమే కాకుండా, మిగిలిన పాత భవనాల పునరుద్ధరణకు, పాఠశాలలోని ఖాళీ స్థలాల్లో మరిన్ని క్లాస్‌రూమ్‌ల నిర్మాణానికి కూడా పూర్తి ఆర్థిక సాయం అందిస్తానని ధనుష్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక కెరీర్ పరంగా చూస్తే ధనుష్ ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో నటుడిగా, దర్శకుడిగా రెండు పురస్కారాలు దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో 'ఓం' అనే పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధనుష్ చేసిన ఈ గొప్ప సాయం గురించిన వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నైజం, చదువుకున్న బడిని మర్చిపోకుండా రీ-పే చేసే మనస్తత్వం ధనుష్ సొంతమని అభిమానులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పాఠశాలకు అందించిన ఈ అపురూప కానుకతో అందరి హృదయాలను గెలుచుకున్న ధనుష్, త్వరలోనే తన రాబోయే ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద కూడా మరిన్ని భారీ విజయాభినందనలు అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సహాయం.. మనిషికి ఉండాల్సిన మంచి గుణాలలో సహాయం చేయడం కూడా ఒకటి. ఆపదలో ఉన్నవారికి,  అవసరం లో ఉన్నవారికి,  ఇబ్బందులలో ఉన్నవారికి సహాయం చేయడం చాలామంచి లక్షణం.కానీ కొన్నిసార్లు, ఆలోచించకుండా చేసే సహాయం పెద్ద తలనొప్పిగా మారవచ్చు. చాణక్య నీతి ప్రకారం.. కొందరు వ్యక్తులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందులు పడతారని, అంతే కాకుండా కొందరు వ్యక్తులకు సహాయం చేస్తే.. సహాయం చేసిన వారే నాశనం అవుతారని, తీవ్ర సమస్యలో చిక్కుకుంటారని చెబుతారు. అలాంటి మూడు రకాల వ్యక్తుల గురించి కూడా ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దుర్మార్గులు, చెడ్డ గుణం కలిగిన స్త్రీ, పురుషులు.. చెడ్డ మనసు లేదా చెడు గుణం కలిగిన , కోపిష్టి స్వభావం ఉన్నవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వారికి సహాయం చేయడం అంటే మన కాళ్ళను  మనమే కాల్చుకోవడం లాంటిది. చెడ్డ   స్వభావం ఉన్నవారు ఎవరికీ స్నేహితులు కారు.  వారికి ఎంత దయ చూపినా,  అవకాశం దొరకగానే తిరిగి హాని చేయడానికి  వెనుకాడరు. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం  వల్ల సామాజిక హోదా , ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఏ విషయాలకు అయినా దూరంగా ఉండాలి. ఎప్పుడూ విచారంగా ఉండేవారు.. ఈ ప్రపంచంలో కొందరు ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పటికీ, వారు తమ విధిని, పరిస్థితులను ఎప్పుడూ  నిందించుకుంటూ ఉంటారు. ఇలాంటి నెది నెగిటివ్  మనస్తత్వం ఉన్నవారికి సహాయం చేయడం మానుకోవాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు తమ జీవితంలో ఎప్పటికీ సంతోషంగా లేదా సంతృప్తిగా ఉండలేరు.  అలాంటి  వారికి సహాయం చేస్తే, వారి ప్రతికూల శక్తి  జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా వారికి సహాయం చేసేవారు కూడా మానసిక ఒత్తిడికి గురై  సంతోషాన్ని కోల్పోతారు. మూర్ఖుడు.. మూర్ఖుడికి , బుద్ధిహీనుడికి ఏదైనా చెప్పడం,  మూర్ఖుడికి సలహా ఇవ్వడం లేదా సహాయం చేయడం అత్యంత మూర్ఖపు పనిగా చెబుతారు. తమ మంచి చెడులను తాము తెలుసుకోలేని వ్యక్తికి ఏదైనా వివరించడం పూర్తిగా సమయం వృధా చేసినట్టే. అలాంటి   సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నించినప్పుడు, వారు తరచుగా  చెప్పేదాన్ని అపార్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు సహాయం అందించే వ్యక్తిని తమ శత్రువుగా భావిస్తారు. వారితో వాదించడం లేదా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం వల్ల  మనశ్శాంతిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. సహాయం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.. ఇతరులకు సహాయం చేయడం అంటే తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడం కాదు. సహాయం చేసే గుణం మంచిదే అయినప్పటికీ, ,తెలివిని  ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా సహాయం చేసే ముందు, వారి ఉద్దేశాలను, ప్రవర్తనను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఎదుటి వ్యక్తి మీ సహాయం చేసే గుణాన్ని  దుర్వినియోగం చేయవచ్చని మీకు అనుమానం వస్తే, వెంటనే వెనక్కి తగ్గడం మంచిది. మీ దయా గుణాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేలా మీ హద్దులను మీరే ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి. సరైన వ్యక్తికి సహాయం చేయడం సరైన వ్యక్తి సహాయం చేయడం చాలా మంచిది. మీరు అవసరంలో ఉన్న, నిజాయితీపరుడైన, నిష్కపటమైన వ్యక్తికి సహాయం చేసినప్పుడు,  తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతారు. సరైన వ్యక్తికి సహాయం చేయడం మనశ్శాంతిని ఇస్తుంది , సమాజంలో  గౌరవాన్ని పెంచుతుంది. మన సహాయ గుణాన్ని సరైన చోట ఉపయోగించాలని చాణక్య నీతి  బోధిస్తుంది. మీరు మీ శక్తిని, ధనాన్ని సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అందువల్ల, ఎల్లప్పుడూ  మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయాలి.                                    *రూపశ్రీ.  
 తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి..!++ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు, తల్లిదండ్రులకు తెలియకుండానే వారి కొన్ని అలవాట్లు, వారి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. ఏ తల్లిదండ్రులు కూడా ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కోరుకోరు.. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది,  వారు తమ పరిసరాల నుండి త్వరగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఏమైనా మాట్లాడితే అది వారి భవిష్యత్తును చాలా గందరగోళంగా మారుస్తుంది.  చిన్నతనంలో పిల్లలకు ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తేనే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. తాము కూడా తెలియకుండానే తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకెళ్లే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.. పిల్లల తప్పుకు పోల్చి తిట్టడం.. చాలా మంది తల్లిదండ్రులు, తమ పిల్లల తప్పుకు కోపం తెచ్చుకుని, వారిని ఇతర పిల్లలతో పోల్చడం మొదలు పెడతారు.  ఇలా పోల్చడం ఎప్పుడైతై  మొదలవుతుందో అప్పుడు పిల్లలు ఇతరులను చూపించి, వారితో పోల్చి తిడతారు కూడా.  మార్కుల విషయంలో కావచ్చు,  తెలివి తేటల విషయంలో కావచ్చు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో కావచ్చు,  చురుగ్గా ఉండే విషయంలో కావచ్చు..  ఇలా  ప్రతిదానికి తల్లిదండ్రులు పిల్లలను పోల్చి మాట్లాడితే..  పిల్లలు చాలా బాధపడతారు, తమను తాము పనికిరానివారిగా భావిస్తారు. ఇక్కడే వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. తిట్టడం.. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలను తప్పులు చేసినందుకు కఠినంగా తిడతారు. కానీ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినది.. వారు పిల్లలని, ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారని, అలాంటప్పుడు  తరచుగా తప్పులు జరుగుతాయని అర్థం చేసుకోవాలి.   పిల్లలను తప్పులకు పదేపదే తిడితే, వారు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి భయపడతారు. తప్పు చేయడం చెడ్డ విషయమని, మళ్ళీ తిట్లు పడతాయని భావించి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి, లేదా ప్రయత్నించడానికి కూడా భయపడి ప్రయత్నాలు మానేస్తారు. ఎమోషన్స్ ను లైట్ తీసుకోవడం.. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు.  వారు భయపడినప్పుడు, బాధపడినప్పుడు లేదా కలత చెందినప్పుడు,  "ఇంత చిన్న విషయానికి ఏడవకు"  అనడం లేదా "ఇది పెద్ద విషయమేమీ కాదు" అని తోసిపుచ్చేయడం.. వంటివి తల్లిదండ్రులు చేస్తుంటారు.  దీనివల్ల  తమ భావాలకు విలువ లేదని  పిల్లలు భావిస్తారు. దీనివల్ల, తమను ఎవరూ అర్థం చేసుకోరనే భావనతో వారు తమ భావాలను, ఆలోచనలను దాచుకుంటారు. ఇది వారి నమ్మకాన్ని బలహీనపరుస్తుంది, దాని ప్రభావం వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా పడుతుంది ఓవర్ ప్రొటెక్షన్,  హెల్పింగ్.. చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు సహాయం చేసే నెపంతో, వారి స్కూల్ బ్యాగులు సర్దడం, పిల్లల ఇష్టాలతో పని లేకుండా  తామే బట్టలు షాపింగ్ చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రతి పనిని తామే చేస్తారు. దీనివల్ల పిల్లలు తమ పనులు తాము చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. పిల్లలు ఏదైనా పనిని  తామే చేసినప్పుడు వారికి తమ సామర్థ్యం పెరుగుతుంది. అలా కాకుండా అన్నీ తల్లిదండ్రులే చేస్తుంటే పిల్లలకు వారి సామర్థ్యం గురించి తెలియదు.  క్రమంగా, వారు చిన్న చిన్న విషయాలకు కూడా తమ తల్లిదండ్రులపై ఆధారపడతారు తక్కువ చేసి మాట్లాడటం.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తిడతారు లేదా బంధువులు, స్నేహితులు లేదా అతిథుల ముందు వారి బలహీనతలను  బయటపెడతారు. దీనివల్ల పిల్లలు చాలా షేమ్ గా ఫీలవుతారు. తమను తాము తక్కువగా భావించుకుంటారు. పదేపదే అందరి ముందు  అవమానపడటం వల్ల,  అందరి ముందు ఓపెన్ మాట్లాడటానికి , ఏదైనా చెప్పడానికి భయపడతారు. అది వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అభిరుచులు రుద్దడం.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు విషయంలో గానీ, అభిరుచుల విషయంలో గానీ తమకు నచ్చినది చేయాలని కోరుకుంటారు. పిల్లల సొంత ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను  పట్టించుకోరు. పిల్లలకు తమకు నచ్చింది ఎంచుకోవడం,  నచ్చిన పని చేయడం వంటి అవకాశాలు లేనప్పుడు తమ నిర్ణయాలకు విలువ లేదని పిల్లలు భావిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి, అలాగే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయడానికి  దారితీస్తుంది.                                *రూపశ్రీ  
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
ప్రతిరోజూ ఉదయం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు బలపడటమే కాకుండా, గుండె పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతాయి. రోజూ అలసట, ఒత్తిడి, ఆందోళన, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి భస్త్రిక ప్రాణాయామం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లోతుగా, వేగంగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ మెరుగుపడి శక్తి పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సహజంగా బయటకు పంపే శరీర ప్రక్రియలకు కూడా ఇది తోడ్పడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్ స్రవంతి రఘు భస్త్రిక ప్రాణాయామాన్ని సరైన విధంగా ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనే అంశాలను సులభంగా వివరించారు. మీ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసి, నిపుణుల సూచనల ప్రకారం భస్త్రిక ప్రాణాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా కొత్త యోగా సాధన ప్రారంభించే ముందు వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం.  ఈ వీడియోలో ప్రముఖ నిపుణురాలు డా. పూర్ణిమ నాగరాజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి, పిల్లల్లో నమ్మకాన్ని ఎలా పెంచాలి, వారు ఏ పరిస్థితిలోనైనా తమ మనసులోని మాటను చెప్పేలా ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలను సులభంగా వివరించారు. అలాగే పిల్లల మాటలను మధ్యలో అడ్డుకోకుండా వినడం, విమర్శించకుండా స్పందించడం, భయపెట్టకుండా మార్గనిర్దేశం చేయడం, కుటుంబంలో ఓపెన్ కమ్యూనికేషన్‌ను పెంపొందించడం వంటి ముఖ్యమైన పేరెంటింగ్ సూచనలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన ఈ వీడియో పిల్లలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల కొద్ది తాగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నేటికాలంలో వైద్యులు కూడా పెద్ద ఎత్తునే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చక్కెరను ఎడాపెడా వాడిన వారిలో చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ పేషెంట్లుగా మారారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. కేవలం ఒక వారం రోజుల పాటూ చక్కెర వాడకాన్ని ఆపి చూడమని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా వారు చెబుతున్నారు.  అసలు వారం రోజుల పాటూ పంచదార వాడటం మానేస్తే  ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే జరిగే మార్పులు.. చక్కెర అలవాటు ఉన్నవారు ఉన్నపళంగా చక్కెర వాడటాన్ని ఆపేస్తే.. మొదటి ఒకటి రెండు రోజులు తీపి తినాలని అనిపిస్తుంది. కానీ క్రమంగా శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. మునుపటి కంటే ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఉండటాన్ని గమనించవచ్చు.  దీన్ని అనుభూతి కూడా చెందవచ్చు. చర్మంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. చర్మంలో మెరుపు వస్తుంది.  ముఖ్యంగా చర్మం మీద మొటిమలు,  దద్దుర్లు.. వంటివి క్రమంగా తగ్గడం గమనించవచ్చు. చక్కెర వాడటం ఆపేస్తే జీవక్రియ మెరుగవుతుంది.  గతంలో అంటే.. చక్కెర వాడుతున్నప్పుడు కంటే.. చక్కెర వాడటం మానేసిన తర్వాత జీవక్రియ వేగంగా మారుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా మారతాయి. అధిక బరువు ఉన్నవారు చక్కెర వాడటం మానేస్తే.., క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.  వారం రోజులలో స్పష్టంగా మార్పు కనిపించకపోయినా.. చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా బరువు తగ్గడం సులువు అవుతుంది.                                       *రూపశ్రీ.