Publish Date:Jun 19, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్టు కాబోతున్నారా? కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేసి ఆ తరువాత ఆయనతో విభేదించి బయటకు వచ్చ బీజేపీ గూటికి చేరిన ఈటల రాజేందర్ మాటల సంకేతమదేనా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేసిన సిట్ ఇప్పుడు బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నది. అందులో భాగంగానే ఈటల రాజేందర్ వాంగ్మూలం కూడా తీసుకోనున్నది. ఈ మేరకు ఇప్పటికే ఈటలకు సిట్ సమాచారం ఇచ్చింది.
దీనిపై మీడియాతో మాట్లాడిన ఈటల సంచలన విషయాలు చెప్పారు. దానిని బట్టే ఆయన టార్గెట్ కేసీఆర్ అని అర్ధమౌతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను సిట్ కు వాంగ్మూలం ఇస్తానని మీడియా ముఖంగా చెప్పిన ఈటల.. ఫోన్ ట్యాపింగ్ లో తొలి బాధితుడిని తానేనని అన్నారు. తన ఫోనే కాదు, తన కుటుంబ సభ్యులు, డ్రైవర్, గన్ మెన్, బంధువులు, స్నేహితుల ఫోన్లూ కూడా అప్పట్లో ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాను సిట్ ఎదుట చెబుతానని వెల్లడించారు. అన్ని ఆధారాలు, రుజువులతో సహా సిట్ ఎదుటకు వెళ్లి వాంగ్మూలం ఇస్తానన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమనీ, ఇందులో ప్రమేయం ఉన్న వారందరికీ శిక్షపడాలని చెప్పారు. కేసు దర్యాప్తు సాగుతున్నకొద్దీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని వేళ్లూ మాజీ సీఎం కేసీఆర్ వైపే చూపుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిర్థారణ అయ్యిందని అంటున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు తాను ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఇప్పటి వరకూ అంగీకరించకపోయినప్పటికీ ఇప్పటి దాకా ఈ కేసులో అరెస్టైన వారు, విచారణకు హాజరైన వారు కూడా ఆయన ఆదేశాల మేరకే పని చేశామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఈటల వాంగ్మూలం కీలకంగా మారిందంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల.. కాళేశ్వరం అవినీతితో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకోవడమే కాకుండా, ఏమైనా అవకతవకలు జరిగితే కేసీఆర్, హరీష్ లే అందుకు బాధ్యులని సంకేతం ఇచ్చే విధంగా మాట్లాడారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-kcr-arrest-39-200297.html
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు.
గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్కు కుక్కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.
గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి అడుగుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్లో భోజనం అందుకున్నారు.
ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
మొన్నటి విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగం చదువుతుండగా ఆ పండితుడు చెప్పిందేంటంటే జగన్ కి స్త్రీ మూలక సమస్యలు ఎక్కువగా వస్తాయని. ఆ సరికే ఆయన తన తల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గట్రా వ్యవహారాలు నడుస్తున్నాయ్.