అన్నీ ఉన్నా.. తెలంగాణ కమలం క్యాడర్ లో నిర్వేదం !

Publish Date:Jun 19, 2025

Advertisement

ఇప్పుడు ఎటు చూసినా యుద్ధమే కనిపిస్తోంది .. దేశాల మధ్యనే  కాదు, రాజకీయ పార్టీల మధ్యన కూడా యుద్ద వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ..  ప్రత్యర్ధి  పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే, పార్టీల లోపల సాగుతున్న అంతర్గత కుమ్ములాటలలో  కూడా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో..  ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో ఏమి జరుగుతోందో వేరే చెప్పనక్కరలేదు. అధికార కాంగ్రెస్ పార్టీలో పదవులు, పంపకాల పంచాయతీ నడుస్తుంటే, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో కుటుంబ కలహాల గొడవల కథ  నడుస్తోంది.  

ఆదలా ఉంటే..  రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు  ఎమ్మెల్సీలు, అన్నిటిని మించి కమిటెడ్  క్యాడర్, అంతకు మించి కేంద్రంలో అవిచ్ఛన్నంగా సాగుతున్న 11 ఏళ్ల మోదీ పాలన, ఎదురు లేని ఆర్థిక స్థోమత, ఇలా ఎన్ని ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మాత్రం  అలాగే, అంతే అధ్వానంగానే వుందని పార్టీ వర్గాలు ఒక విధమైన నిర్వేదాన్ని వ్యక్త పరుస్తున్నాయి. ముఖ్యంగా గత కొంత కాలంగా  రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి  చుక్కాని లేని నావలా..  స్తబ్దుగా, నిస్తేజంగా ఉండి పోయిందని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. నిజానికి బీజేపీ సీనియర్ నాయకుడొకరు అన్నట్లుగా బీజేపీకి అన్నీ ఉన్నాయి కానీ..  అల్లుడి నోట్లో శని కారణంగా బీజేపీకి ముందడుగు పడడం లేదు. అయినా..  పార్టీ స్తబ్దుగా ఉన్నా, అంతర్గత కలాహాలు, కుమ్ములాటల విషయంలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఏమాత్రం తీసి పోవడం లేదని అంటున్నారు. 

నిజానికి అంతర్గత కుమ్ములాటల కారణంగానే..  2023 అసెంబ్లీ ఎన్నికల్లో కమల దళానికి  గెలుపు బస్సు మిస్సయిందని అప్పట్లోనే అంతర్గత విశ్లేషణలలో పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించింది. ఈ నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ రాష్ట్ర నేతల నెత్తిన అక్షింతలు వేశారనే ప్రచారం జరిగింది. కనీసం 30 సీట్లలో గెలిచే అవకాశం, అనుకూల వాతావరణం ఉన్నా.. ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలు, ముఖ్యంగా అధ్యక్ష పదవినుంచి బండి సంజయ్ కుమార్ ను తొలిగించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ చేయి జార్చుకుందనేది పార్టీ లోపల, వెలుపల వినిపించిన మాట.  

అదెలా ఉన్నా.. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలుచుకోవడంతో పాటుగా ,ఈ మధ్య కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో  రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. ఈ పరిణామాలను గమనిస్తే..  తెలంగాణలో కమల దళానికి అనుకూల వాతావరణం ఇప్పటికీ ఉందనీ అయితే,  బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో విబేధాల కారణంగా, పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. 

అదలా ఉంటే.. ఇంచుమించుగా సంవత్సరం పైగా నానుతూ, ఎటూ తేలకుండా సాగుతూ వస్తున్న పార్టీ  రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక, నియామకం వ్యవహరం అటో ఇటో తేలేవరకు పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని.. అంతవరకు  గోషామహల ఎమ్మెల్యే.. రాజా సింగ్ రెండు మూడు నెలకు ఒకసారి ఇలా పార్టీని బజారుకు ఈడ్చే సంఘటనలు జరుగుతూనే ఉంటాయని  పాత తరం  సీనియర్ నాయకులు  అంటున్నారు.

అలాగే రాజా సింగ్  పార్టీలోకి ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అనే విషయాన్ని పక్కన పెడితే..  ఆయనకు పార్టీ   పునాది హిందుత్వం పట్ల  సంపూర్ణ విశ్వాసం వుంది.  ప్రజల్లో బలముంది. వరసగా మూడుసార్లు ఒకే నియోజక వర్గం నుంచి గెలిచిన చరిత్ర వుంది. అంతే కాదు..  2018 ఎన్నికల్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ ఓడి పోయినా..  రాజా సింగ్ ఒక్కరు మాత్రమే గెలిచారు. గోషామహల్ సీటును నిలబెట్టుకున్నారు. కాబట్టి..  పార్టీ నాయకత్వం వ్యక్తిగత వ్యాఖ్యలు విమర్శలను పక్కన పెట్టి  ఆయన కోరుతున్న విధంగా ఆయన సేవలను ఏమేరకు ఉపయోగించుకోగలిగితే  ఆమేరకు ఉపయోగించుకోవడం మంచిందని పార్టీ పెద్దలు హితవు చెపుతున్నారు. అలాగే.. ఇంకా జాప్యం చేయకుండా  పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్రతువును కానిస్తే..  పార్టీ మళ్ళీ పట్టాల మీదకు వస్తుందని క్యాడర్ ఆశాభావంతో ఉన్నారు.

By
en-us Political News

  
పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉన్న పార్టీలో ఉన్న‌ట్టు ఉండి ఉంటే వీళ్ల ప‌రిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదేమో. కానీ అత్యాశ కొంప ముంచేసింది. పెట్టిన చేతినే క‌ర‌వ‌డంతో పాము, మొస‌లినే మించి పోయారీ ఇద్ద‌రూ. కార‌ణం ఈ భూ ప్ర‌పంచంలో పెట్టిన చేతినే క‌రిచే బుద్ధి కేవ‌లం పాము, మొస‌లికి మాత్ర‌మే ఉంటుంద‌ట‌.ఆ
క్యాప్షన్ కొత్తగా ఉందన్న మాటే కానీ మేటర్ మాత్రం చాలా చాలా పాతదే. పెద్దగా కంగారు పడకండి. కారణం ఏంటంటారా? అప్పుడే అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారట అతి- ఉత్సాహి జగన్. ఇప్పటికే వంద మంది పేర్లు వంద సీట్లకు ఖరారు చేసేశారట.
హైద‌రాబాద్ న‌డి బొడ్డున 1982 మార్చి 29న పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీఆర్ఎస్ అయినా పుట్టిన పుష్క‌ర కాలానికిగానీ అధికారంలోకి రాలేదు. అదే టీడీపీ ఏకంగా 9 నెల‌ల్లోనే అధికారం చేప‌ట్టి ప్ర‌పంచ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే మ‌రెవ‌రికీ సాధ్యం కాని ఒక చ‌రిత్ర‌ను సృష్టించింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
ప్రపంచ అపర కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా పార్టీ పేరుతో నూతన పార్టీ ప్రకటించారు. అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్చ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్ మస్క్ తెలిపారు.
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ 427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్‌ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు.
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ను అరెస్ట్ చేసి 81 లక్షల రూపాయల విలువైన 26 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు.
అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ వద్ద గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగులగొట్టి త్రవ్వకాలకు పాల్పడిన 13 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ర్యాగింగ్ కు పాల్పడిన 13 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి చెప్పారు.
విశాఖలో కోకైన్ కలకలం రేపింది ఓ ఆఫ్రికన్ వద్ద 25 గ్రాముల కొకై న్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు రాష్ట్రంలో అసత్యపు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.