Publish Date:Apr 30, 2022
వైసీపీమాజీ మంత్రుల తీరు చూస్తుంటే.. పార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనిపించక మానదు. సీఎం అభీష్టం మేరకు ఆయన అప్పగించిన బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని వారు చెప్పిన మాటలు పెదవుల చివరి నుంచి వచ్చినవేనన్నఅనుమానాలు పార్టీ కేడర్ లోనే వ్యక్తమౌతున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుజిల్లాలో చేసిన రచ్చమరువక ముందే.. ఆ స్థాయిలో కాకపోయినా మరో మాజీ మంత్రి పేర్ని నాని తన అసమ్మతినీ, అసంతృప్తినీసున్నితంగానే అయినా గుర్తించదగ్గ స్థాయిలో ప్రదర్శించారు. కేంద్ర మంత్రి పర్యటనలో మాజీ మంత్రి పేర్ని నాని అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. పర్యటన ఆద్యంతం ఒక ప్రేక్షకుడిలా దూర దూరంగా ఉండిపోయారు.
గిలకల దిండి హార్బర్ పరిశీలనకు కేంద్ర మత్స్యశాఖ మంత్రి మురుగన్ శుక్రవారం పర్యటించారు. మంత్రి సిదిరి అప్పలరాజుతో కలిసి కేంద్ర మంత్రి గిలకలదిండి హార్బర్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని కూడా హాజరయ్యారు. అయితే ఆయన కనీసం మంత్రుల దగ్గరకు కూడా రాలేదు. ఏదో సంబంధం లేని కార్యక్రమానికి హాజరైనట్లుగా వారికి దూరంగా ఉండిపోయారు. మంత్రి సిదరి అప్పలరాజు స్వయంగా వెళ్లి పనుల పరిశీలనకు రావలసిందిగా కోరినప్పటికీ పేర్ని నాని పట్టించుకోలేదు.
ఆ తరువాత జరిగిన సభలో మాత్రం మంత్రి మాట్లాడారు. ఆ మాటలు కూడా ముక్తసరిగా, ఆయన సహజ వాగ్ధాటిని భిన్నంగా ఉన్నాయి. కేంద్ర మంత్రి తెలుగులో చక్కగా మాట్లాడతారని ప్రశంసించి...తాను పనుల పరిశీలను దూరంగా ఉండటానికి ఎప్పుడూ చూసే పనులే కాదా అని ముక్తాయింపు ఇచ్చారు.
పేర్ని నాని కేంద్ర మంత్రి పర్యటనకు హాజరై కూడా దూరదూరంగా మెలగడం, ముక్త సరిగా మాట్లాడటానికి కేబినెట్ లో స్థానం దక్కలేదన్న అసంతృప్తే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటే.. పార్టీ వర్గాలు తాను ఉంటే కొత్త మంత్రి స్వేచ్ఛగా మెలగలేరన్న భావనే పేర్ని నాని ఈ కార్యక్రమంలో అంటీముట్టనట్లు వ్యవహరించడానికి కారణమని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/perni-nani-distances-himself-from-central-ministers-programmee-25-135253.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!