అవినీతి ‘ద్వారం’ పూడి ఆటకట్టినట్టేనా?

Publish Date:Nov 29, 2024

Advertisement

కాకినాడ పోర్టు పేరు వినగానే ఎవరికైనా మొదట గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరే. రేషన్ బియ్యం అక్రమ రావాణాతో కోట్లు వెనకేశారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నంత కాలం ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి ద్వారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాము అధికారంలోకి వస్తే పోర్టు మాఫియాను కూకటి వేళ్లతో పెకలించేస్తామనీ, అవినీతి ‘ద్వారం’పూడి ఆటకట్టిస్తాననీ శపథం కూడా చేశారు. అటు ద్వారంపూడి కూడా పవన్ కల్యాణ్ ని అనుచితంగా దూషిస్తూ పరుష వ్యాఖ్యలు కూడా చేశారు. సరే ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ సర్కార్ పతనమైంది. వైసీపీకి కనీసం విపక్ష హోదా కూడా రాలేదు. అత్యంత అవమానకర రీతిలో 175 స్ధానాలకు గానూ కేవలం 11 స్థానాలలోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాకినాడ నుంచి ద్వారం పడి చంద్రశేఖరరెడ్డి ఘోర పరాజయాన్ని చవి చూశారు.

తెలుగుదేశంకూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి రేషన్ బియ్యం అక్రమరవాణాను నిరోధించగలిగారు. ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్నీ సీజ్ చేశారు. రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాలపై నిఘా వేసి నియంత్రించారు. దీంతో కాకినాడలో బియ్యం మాఫీయా కొంత కాలం సైలెంట్ అయిపోయింది. ఈ మాఫియా డాన్ ద్వారంపూడే అన్నది అందరికీ తెలిసిన విషయమే. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లే వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని తన బియ్యం దందాను యథేచ్ఛగా సాగించిన ద్వారం పూడి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది కాలం సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ తన దందాను ప్రారంభించారని తాజా పరిణామాలను బట్టి అవగతమౌతోంది. మూడు రోజుల కిందట వేల టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఓడను పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు.    

ఇప్పుడు పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోనిక దిగడంతో అవినీతి ద్వారంపూడి ఆటకట్టినట్లేనని అంటున్నారు. బియ్యాన్ని అక్రమంగా పోర్టుకు తరలించే దారులన్నీ మూసేసి, ఇక కేంద్రం అధీనంలోని పోర్టు సిబ్బంది తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ అవినీతి అనకొండల ఆటకట్టించడానికి కంకణం కట్టుకున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో కాకినాడలో ద్వారంపూడికి సహకరిస్తున్న అధికారులనూ వదిలేది లేదని హెచ్చరించారు. స్థానిక అధికారలు అండదండలు, సహాయసహకారాలూ లేకుండా అంత పెద్ద మొత్తంలో బియ్యం పోర్టుకు ఎలా చేరిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.  

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.