తెలుగుదేశం కు ఓ గవర్నర్ పదవి.. కేంద్రం ఆఫర్ నిజమేనా?

Publish Date:Nov 29, 2024

Advertisement

తెలుగుదేశం, బీజేపీల మధ్య 2014-2019 మధ్య కాలంలో సంబంధాలు బెడిసికొట్టడానికి విభజన హామీల అమలు, రాష్ట్రానికి కేటాయింపులు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్ లతో  పాటు మరో అంశం కూడా కారణం అయ్యింది. అదే గవర్నర్ పదవి. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఓ గవర్నర్ పదవి ఇస్తానన్న హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అప్పట్లో మోత్కుపల్లి నర్సింహులును ఏదో ఓ రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తానన్న వాగ్దానం చేశారు. అయితే ఆ ఐదేళ్ల కాలంలో అది జరగలేదు. ఈ లోగానే విభజన హామీల అమలు, వాగ్దానాలను నెరవేర్చడంలో అప్పటి మోడీ సర్కార్ మొండి వైఖరి కారణంగా తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. దీంతో అప్పటి గవర్నర్ పదవి హామీ నెరవేరలేదు. గవర్నర్ గిరీ రాలేదన్న అలకతో మోత్కుపల్లి అప్పట్లో తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిపోయారు. అది వేరే సంగతి.

ఇక ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత  కేంద్రంలో మోడీ సర్కార్ తెలుగుదేశం మద్దతుపై మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తనంత తానుగానే తెలుగుదేశం కు ఓ గవర్నర్ పదవి ఇచ్చేందుకు ఆఫర్ చేసిందని అంటున్నారు. ఇలా మిత్రపక్షాలకు గవర్నర్ పదవి ఇవ్వడమన్నది కొత్తేమీ కాదు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరికి అప్పటి కేంద్రం గవర్నర్ పదవులను కట్టబెట్టిన సంగతి విదితమే.  ఇప్పుడు కేంద్రం గవర్నర్ పదవి ఆఫర్ అన్నది వాస్తవమే అయితే ఆ పదవి కోసం కూడా తెలుగుదేశంలో పోటీ తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

సీనియర్ నాయకులు అశోకగజపతిరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా కూడా తొలి నుంచీ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ముఖ్యంగా యనమల, అశోకగజపతిరాజులు చంద్రబాబుకు సన్నిహితులుగా గుర్తింపు పొందారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే పార్టీ కష్టకాలంగా గట్టిగా నిలబడ్డారు. నిజంగా తెలుగుదేశం నుంచి ఒకరిని గవర్నర్ గా పంపించాలని కేంద్రం భావిస్తే చంద్రబాబు వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారన్న చర్చ ఇప్పుడు  పార్టీలో జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
సురేష్ బాబు చేసిన అక్ర‌మాలపై టీడీపీ కార్పొరేట‌ర్లు చేసిన ఫిర్యాదులపై విచారణ జరిగింది. కార్పొరేష‌న్ ప‌రిధిలో చేప‌ట్టే ప‌నుల‌ను బినామీల రూపంలో త‌న కుటుంబానికి చెందిన కాంట్రాక్టు సంస్థ‌ల‌కు సురేష్ బాబు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన మాట వాస్తవమేనని తేలింది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.