పళనిస్వామి వస్తే ఏం లాభం?

Publish Date:Feb 16, 2017

Advertisement

 

ఎట్టకేళకు తమిళనాడు రాజకీయాలకు కాస్త కొలిక్కి వచ్చాయి. శశికళ వీరవిధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటూ గవర్నరు ఆహ్వానించడంతో ఆ కుర్చీకి కొత్త కళ వచ్చింది. సచివాలయానికి చేరుకుందామనుకున్న శశికళ సెంట్రల్‌ జైలుకి చేరుకోవడంతో.. ముఖ్యమంత్రి పీఠం మీద ఆసక్తి నెలకొంది. ఈ వివాదం మీద ఇప్పటివరకూ ఆచితూచి వ్యవహరిస్తున్నా గవర్నరు న్యాయనిపుణుల సలహాతో ఇప్పుడు ఇహ పళనిగారిని ఆహ్వానించక తప్పలేదు.

 

తమిళ రాజకీయాలలో పళనిస్వామిది ఓ ప్రముఖ పాత్ర. ఎంజీఆర్‌ చనిపోయిన తరువాత జయకి అండగా నిలిచిన అతికొద్దిమంది నేతలలో పళని ఒకరు. అలా అన్నాడీఎంకేలో ఆయనది దాదాపు 30 ఏళ్ల ప్రస్థానం. రైతు కుటుంబంలో జన్మించినా, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభుత్వంలోనే ఎన్నదగిన నేతలలో ఒకరుగా నిలిచేవారు. ప్రస్తుతానికి రహదారులు, నౌకాయానాల శాఖ మంత్రిగా అధికారం చెలాయిస్తున్నారు. ఇంత అనుభవం ఉంది కాబట్టి తమిళమార్కు రాజకీయాలలో పళని పండిపోయారని ఒప్పుకోక తప్పదు.

 

నిజానికి జయలలిత చనిపోయిన వెంటనే ఆ స్థానంలో పళనిస్వామిని కూర్చోపెట్టాలని శశికళ భావించారు. అయితే అత్యధిక శాసనసభ్యులు దీనికి నిరాకరించడంతో పన్నీర్‌ను నిలబెట్టక తప్పింది కాదు. తనకి దక్కని ముఖ్యమంత్రి పదవి శశికళకైనా దక్కాలని పళని చేయని ప్రయత్నం అంటూ లేదు. అందుకోసమే ముఖ్యమంత్రి పదవి అంటే ఏమాత్రం ఆశ లేదని చెప్పిన శశికళను అదే పదవి కోసం వెంపర్లాడేలా ఎగదోశారు. ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా గోల్డెన్‌ బే రిసార్టులకు తరలించడంలోనూ ఆయనది ముఖ్యపాత్రని చెబుతారు. ఊహించని రీతిలో ఇప్పుడు శశికళ చిప్పకూడు తినక తప్పకపోవడంతో, ఆమెకు తోడుగా నిలిచిన పళని తెర మీదకు వచ్చాడు. తన బదులు పళనిని ముఖ్యమంత్రి పీఠం మీద నిలపడంలో అటు శశికళ పంతమూ నెగ్గినట్లయ్యింది.

 

నిజానికి తమిళనాట రాజకీయాలు ఎప్పుడోనే బ్రష్టుపట్టిపోయాయి. ద్రవిడ ఉద్యమంతో తమిళజాతిని తలెత్తుకునేలా చేసిన నాయకుల వారసులు ఇప్పుడు వ్యక్తిగత పూజలందుకునేందుకు తొందరపడుతున్నారు. అవినీతి, కుటుంబ పాలన, ఆడంబరం, కుతంత్రాలు, హత్యారాజకీయాలతో అక్కడి నేతలు ఎప్పుడోనే నీతులు తప్పారు. మరి ఆ తరహా రాజకీయాలకు పళనిస్వామి ఏ రంగు పులుముతారో చూడాలి. జైల్లో ఉన్న శశికళ మనసుని ఎరిగి ఆమె కనుసన్నలలోనే నడుచుకుంటారా? తనదైన శైలిలో విచక్షణాయుతంగా పాలన సాగిస్తారా? మిగిలిన పాలనాకాలాన్ని తూతూమంత్రంగా లాగించేస్తారా? అన్న ప్రశ్నలకు త్వరలోనే ఓ జవాబు రానుంది.

 

ఒకటి మాత్రం నిజం! మురికిపట్టిన తమిళరాజకీయాలు మళ్లీ కోలుకోవాలంటే చాలాకాలమే పడుతుంది. అది తమిళుర చేతుల్లోనే ఉంది. సాధారణంగా తమిళురకు స్వాభిమానం ఎక్కువ. తమ భాషని కాపాడుకునేందుకు వారు ఉద్యమిస్తారు, జల్లికట్టు వంటి ఆచారాన్ని కాపాడుకునేందుకూ వారు ఉద్యమిస్తారు. మరి తమ నేతల విషయంలో ఎందుకని వారు చూసీ చూడనట్లు ఊరుకుంటున్నట్లు? స్వాభిమానం ఉన్నచోట శృతిమించిన వ్యక్తిపూజలు ఎలా సాధ్యమయ్యాయి? ఈ ప్రశ్నలు కనుక వారిలో మెదిలితే తమిళనాట మార్పు రాక మానదు!!!

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.