పాకిస్తాన్‌ పాలు పోసి పెంచిన తాలిబన్‌

Publish Date:Mar 29, 2016

Advertisement

 

27 మార్చి- లాహోర్‌లోని గుల్షన్‌-ఏ-ఇక్బాల్‌ పార్కు.  ఆదివారం, ఆపైన ఈస్టర్‌ పర్వదినం కావడంతో సమయాన్ని సరదాగా గడిపేందుకు వందలాది మంది క్రిస్టియన్లు పార్కులో గుమికూడారు. అకస్మాత్తుగా ఏదో పేలిన శబ్దం. ఏం జరిగిందో మెదడు గ్రహించేలోపే, కళ్ల ముందు మంటలు! పార్కులో అంతెత్తున ఉన్న చెట్లు కూడా భగభగ మండుతూ కనిపించాయి. మనుషుల శరీరాలు గాల్లోకి ఎగిరెగిరి పడ్డాయి. ఈ ఘోరాన్ని చూడలేక 70 మంది కళ్లు మూశారు. జీవితాంతం ఆ దారుణాన్ని గుర్తుంచుకునేలా 300 మంది కొన ప్రాణాలతో బయటపడ్డారు. ఇక్బాల్‌ అంటే అరబ్బీ భాషలో విజయం అన్న అర్థం కూడా వస్తుంది. కానీ ఇక్కడ మానవత్వం పరాజయం పాలైంది.

 

సంఘటన జరిగిన కొద్దిసేపటికే ఏదో ఘనకార్యం చేసినట్లు... తామే ఈ దారుణానికి పాల్పడ్డామంటూ తాలిబన్‌ అనుబంధ సంస్థ  జమాన్‌-ఉల్‌-అహ్రార్‌ నుంచి ప్రకటన వెలువడింది. నిజానికి ఇది తాలిబన్‌ కనుసన్నలలోనే జరిగిందనడంలో ఎవరికీ ఏ అనుమానాలూ లేవు. ప్రభుత్వాల దృష్టిని మళ్లించేందుకు, కఠినమైన ఆంక్షలను తప్పించుకునేందుకు తీవ్రవాద సంస్థలు.. ఇలా రకరకాల పేర్లతో విషాన్ని కక్కుతూ ఉంటాయి. విషమున్న పాము ఏ పేరుతో కాటు వేస్తేనేం!

 

తీవ్రవాదులు లాహోర్‌ను ఎంచుకోవడం పాకిస్తాన్‌ను సైతం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే పాకిస్తాన్‌లోకెల్లా అతి ప్రశాంతమైన నగరమని లాహోర్‌కు పేరు. స్వాతంత్ర్యం ముందు నుంచీ కూడా మేధావులకూ, ధనికవర్గాలకూ లాహోర్ పెట్టింది పేరు. ఇప్పటి ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ పుట్టింది కూడా లాహోర్‌లోనే! లాహోర్‌ జోలికి రానంతవరకూ, షరీఫ్‌ తీవ్రవాదాన్ని పెద్దగా పట్టించుకోరనే అపప్రథ కూడా ఉంది. అలాంటి చోట విధ్వంసాన్ని సృష్టించడమే కాదు ‘మేం ఈ దాడి ద్వారా నవాజ్‌ షరీఫ్‌కు ఓ సందేశాన్ని పంపిస్తున్నాం. మేం లాహోరులో అడుగుపెట్టాం! ఇక మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మా ఆత్మాహుతి దళాలు మరిన్ని దాడులకు పాల్పడుతూనే ఉంటాయి’ అంటూ జమాన్‌-ఉల్‌-అహ్రార్‌ ఓ హెచ్చరికను సైతం వినిపించింది. దీంతో తీవ్రవాదాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తే, వీలైతే ప్రోత్సహిస్తే... ఎలాంటి ఫలితం దక్కుతుందో షరీఫ్‌కు తెలిసొచ్చింది.

 

90వ దశకంలో వేళ్లూనుకుని, తరువాతి కాలంలో ఆఫ్ఘనాస్తాన్‌నే పాలించే స్థితికి తాలిబన్‌ చేరుకుందంటే అదంతా పాకిస్తాన్ చలవే! 1996-2001 సంవత్సరాల మధ్య ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ సాగించిన పాలన ప్రపంచానికే ఓ పీడకల. షరియా పేరు చెప్పుకుని తాలిబన్ విధించిన శిక్షలకు సమాజం నివ్వెరపోయింది. ఒకవైపు మత రాజ్యాన్ని నెలకొల్పామని చెబుతూనే, స్త్రీల మీద లెక్కలేనన్ని అరాచకాలని సాగించింది. అంతకంటే దారుణం ఏమిటంటే ప్రపంచమంతా ఈ విషయాన్ని చూసీచూడనట్లు ఉండటం. పైగా తాలిబన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు అధికారికంగా గుర్తించడం!

 

తాలిబన్ నేస్తమైన అల్‌ఖైదా కనుక అమెరికా ట్విన్‌టవర్స్ మీద దాడి చేసుండకపోతే అక్కడ వారి పాలన నిరవధికంగా సాగి ఉండేది. అల్‌ఖైదా నేత బిన్‌లాడెన్‌ను తమకి అప్పగించకపోవడంతో, తాలిబన్‌ అమెరికా ఆగ్రహానికి గురి కావల్సి వచ్చింది. అయినా పాకిస్తాన్‌ వెనుకడుగు వేయలేదు. ఒకపక్క ఉగ్రవాదం మీద పోరులో అమెరికాతో కలిసి నడుస్తున్నామని చెబుతూనే, తాలిబన్లకు తమ దేశంలో శరణు కల్పించింది. ఈ విషయమై పాకిస్తాన్ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం కలగక మానవు. పాకిస్తాన్‌ విదేశీవ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్ మాట్లాడుతూ తాలిబన్‌ తమ కనుసన్నలలోనే ఉన్నారని పేర్కొన్నారు. పైగా తమ దేశంలో వారికి కావల్సిన సదుపాయాలన్నీ అమర్చడం వల్లే వారు తమ చెప్పుచేతల్లో ఉంటున్నారనీ, తద్వారా తాము ప్రపంచశాంతికి దోహదపడుతున్నామనీ సర్తాజ్ పేర్కొన్నారు!

 

కానీ మొన్న జరిగిన దాడిని గమనిస్తే ఎవరి చెప్పుచేతల్లో ఎవరు ఉన్నారో అర్థమైపోతోంది. తాలిబన్‌ మళ్లీ పడగ విప్పుతోంది. పాకిస్తాన్‌ పశ్చిమభాగాన తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటోంది. అక్కడి పేషావర్‌ లోయలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటోంది. ఇప్పుడు ఏకంగా లాహోర్ మీదే దాడి చేసి తాము దేశం అంతటా విస్తరించామని ప్రకటించింది. పంజాబు (పాకిస్తాన్‌) రాష్ట్రానికి రాజధాని అయిన లాహోర్‌ను చేరుకుంటే, దానికి అనుకుని ఉన్న భారతదేశాన్ని చేరుకోవడం అంత కష్టం కాదు. కాబట్టి ప్రస్తుత పరిణామం మన రక్షణకు కూడా ఆందోళన కలిగించేదే!

 

ప్రస్తుత దాడిని పాకిస్తాన్‌ ఎంత తీవ్రంగా తీసుకుంటుందో చెప్పలేం! ఎందుకంటే ఇది అక్కడి మైనారటీలైన క్రైస్తవుల మీద జరిగిన దాడి. పాకిస్తాన్‌లోని అల్పసంఖ్యాకుల మీద ఇలాంటి దాడులు జరగుతూనే ఉన్నాయి. 2013లో పెషావర్‌లోని ఓ చర్చి మీద జరిగిన దాడిలో కూడా 80 మందికి పైగా మరణించారు. అల్పసంఖ్యాకులను భయభ్రాంతులను చేసేందుకు, వారిని దేశం నుంచి తరిమివేసేందుకు, అక్కడి తీవ్రవాద సంస్థలు ఇలాంటి దాడులకు పాల్పడుతూనే ఉంటాయి.

 

కానీ ఈ దాడికి మరిన్ని కారణాలను కూడా చెబుతున్నారు విశ్లేషకులు. పాకిస్తాన్‌లో షరియా చట్టాన్ని (మతచట్టం) ఖచ్చితంగా అమలుచేయాలనీ, దైవదూషణ చట్టలను మరింత కఠినతరం చేయాలనీ ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. మరి అటు మతభావనలనీ, ఇటు తీవ్రవాదాన్నీ నవాజ్ షరీఫ్‌ ఎంతవరకూ వేరుచేయగలరో చూడాలి. అన్నింటికీ మించి తీవ్రవాదానికి తరతమ బేధాలు ఉండవనీ, ప్రోత్సహించినవారినే బలితీసుకునే చరిత్ర దానికి ఉందని షరీఫ్‌ గుర్తెరిగితే.... అది ప్రపంచానికే కాదు, పాకిస్తాన్‌ భవిష్యత్తుకు కూడా మంచిది. లేకపోతే ఇలాంటి నరమేధాల గురించి కలచివేసే వార్తలు మరిన్ని వినాల్సి ఉంటుంది!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.