బొగ్గు స్కాం- మన జీవితాలకి మసిపూశారు!

Publish Date:Mar 30, 2016

Advertisement

 

బొగ్గు ఓ పరిమిత వనరు. కానీ మనిషి అత్యాశ మాత్రం అపరిమితం! ఆ ఆశకి అధికారం కూడా తోడైతే ఇక చెప్పేదేముంది. చేతులకు మసి అంటుకోకుండా టన్నుల కొద్దీ బొగ్గుని స్వాహా చేయవచ్చు. ఏదో ఒక దశలో విషయం బయటపడితే, తమకే పాపం తెలియదంటూ అమాయకంగా తప్పుకోవచ్చు. అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కలిసి ఆడిన ఈ నాటకంలో నష్టపోయింది మాత్రం సామాన్యుడే! 1.86 లక్ష కోట్లని కేంద్ర ప్రభుత్వం కోల్పోయిందని కంట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నిర్ధరించిన బొగ్గు స్కాం కథే ఇది. బహుశా స్కాం పూర్తయి ఉంటే, ఈ నష్టం పదిలక్షల కోట్లకి పైనే తేలి ఉండేది.

 

భారతదేశంలో అపారమైన బొగ్గు నిల్వలున్నాయన్న విషయం ప్రపంచానికంతటికీ తెలుసు! అయితే ఈ నిల్వలను తవ్వుకునే అవకాశం ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో ఎలాంటి శాస్త్రీయమైన పద్ధతీ ఉండేది కాదు. 1993 నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ద్వారా ఈ గనులను కేటాయించడం మొదలుపెట్టారు. దీంతో కమిటీ ఇష్టప్రకారం గనులను ఎవరికి పడితే వారికి అప్పగించే అవకాశం చిక్కింది. నామమాత్రపు విలువకే సదరు సంస్థలు అపారమైన ఖనిజాన్ని తవ్వుకునేవి. 90వ దశాబ్దంలో కూడా ఇలాంటి అశాస్త్రీయమైన పద్ధతి ద్వారా గనులను కేటాయించేవారంటే ఆశ్చర్యం కలగక మానదు.

 

2004లో ఈ ఇష్టారాజ్య విధానానికి స్వస్తి చెప్పాలనీ, వేలం వేయడం ద్వారా బొగ్గగనులను అర్హులకు కేటాయించాలనీ నిపుణులు సూచించారు. కానీ అప్పటి ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోనేలేదు సరికదా.... విజృంభించి మరీ దేశంలో ఉన్న బొగ్గు గనులన్నింటినీ కేటాయించడం మొదలుపెట్టింది. 1993 నుంచి 2005 వరకు 70 బొగ్గు గనులను కేటాయిస్తే 2006 నుంచి 2009 వరకు... కేవలం నాలుగేళ్ల వ్యవధిలో 145 గనులను కేటాయించి పారేశారు. ఈ సమయంలో బొగ్గు శాఖా మంత్రిగా ఉన్నది సాక్షాత్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌!

 

మచ్చలేని చంద్రునిలా కనిపించే మన్మోహన్‌ సింగ్‌కు ఈ విషయంలో ఏ పాపం తెలియదని అందరూ నమ్మారు. మన్మోహన్‌ సింగ్‌ కూడా తనకే పాపం తెలియదనీ, అంతా కమిటీలే నిర్ణయించాయని చేతులు దులిపేసుకున్నారు. అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి.పారేఖ్‌ మీదకి నేరాన్ని తోసేశారు. కానీ పి.సి.పారేఖ్‌ నోరు విప్పడంతో మన్మోహన్ అసమర్థత బయటపడింది. ఎవరికి పడితే వారికి గనులను కేటాయించే విధానం మోసపూరితమైనదని, తాను 2004లోనే మన్మోహన్‌కు లిఖితపూర్వకంగా అందించానని, అయినా తన మాటని ఎవ్వరూ ఖాతరు చేయలేదని పారేఖ్‌ ఆరోపించారు. ఈ స్కాంలో మన్మోహన్‌కు ఆర్థికమైన లాభం ఏదీ దక్కి ఉండకపోవచ్చు. కానీ ఏదో దారుణమైన పొరపాటు జరుగుతోందని మన్మోహన్‌ మనస్సాక్షికి తెలియకుండా ఉండి ఉంటుందా! మన్మోహన్‌ మాత్రమే కాదు. తరువాత కాలంలో బొగ్గుశాఖ మంత్రిగా ఉన్న దాసరి నారాయణరావు కూడా ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ గనులను జిందాల్ స్టీల్‌కు కేటాయించేందుకు, దాసరి కొంత ఆర్ధిక లాభాన్ని కూడా ఆశించారని కూడా సీబీఐ భావించింది.

 

మొత్తానికి బొగ్గు గనులను కేటాయించే సందర్భంలో భారీ కుంభకోణం జరిగిందని తేలిపోయింది. 2012 నుంచి సుప్రీం కోర్టు నేతృత్వంలో సీబీఐ, బొగ్గు కుంభకోణం గురించి దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. దర్యాప్తు గడుస్తున్న కొద్దీ వెల్లడైన వాస్తవాలు సామాన్యులకు దిగ్భ్రాంతిని కలిగించసాగాయి...

 

- బడాబడా కంపెనీలు బినామీల పేరుతో కొన్ని గనులను దక్కించుకున్నాయి.

- ఏమాత్రం అర్హత లేని కంపెనీలు ఇష్టమొచ్చిన సమాచారాన్ని చూపించి, తాము అర్హులుగా నిరూపించుకుని, కొన్ని గనులను దక్కించుకున్నాయి.

- టాటీ స్టీల్‌, జిందాల్‌ స్టీల్ వంటి కంపెనీలు నామమాత్రపు ఖర్చుతో భారీ గనులను దక్కించుకున్నాయి.

- సుభోద్ కాంత్ సహాయ్, జగద్రక్షకన్‌ వంటి కేంద్ర మంత్రులు తమకు చెందిన సంస్థల కోసం గనులను దక్కించుకున్నారు.

 

ఇంత జరిగిన తరువాత కూడా ఎవరికి ఏమేరకు శిక్షలు పడతాయే చెప్పలేం. ఎందుకంటే రాజకీయ నేతలేమో, నేరాన్ని కమిటీ మీదకు తోసేస్తున్నారు. కమిటీలోని అధికారులేమో తమకు అందిన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. కాబట్టి చివరికి శిక్షలు పడేది తప్పుడు సమాచారాన్ని అందించిన సంస్థల యజమానులకే కావచ్చు. అన్నింటికీ మించిన ఓ విచిత్రం ఏమిటంటే ఈ గనులను ఏ ప్రాతిపదిక మీదన కట్టబెట్టారు అని తేల్చే 100కి పైగా ఫైళ్లు అదృశ్యం కావడం. అవును! 1993-2003 వరకు గనుల కేటాయింపుకి సంబంధించిన 157 ఫైళ్లు కనిపించుట లేదు! కాబట్టి ఆ సమయంలో జరిగని అక్రమాలకు కారకులను పట్టుకునే అవకాశం చేజారిపోయినట్లే!

 

ప్రస్తుతానికైతే ఇలా విచక్షణారహితంగా కట్టబెట్టిన గనులను పునస్సమీక్షించి, అవసరమైనంత మేర రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మున్ముందు వేలం ద్వారానే గనులను కేటాయించాలనీ నిర్ణయించింది. 2015లో ఇలా కేవలం 11 గనులను కేటాయించినందుకే కేంద్రానికి 80 వేల కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. కానీ ఇప్పటివరకూ జరిగిన నష్టం సంగతో! సామాన్యుడు కుటుంబంతో కలిసి బయట భోజనం చేయాలనుకున్నా రకరకాల పన్నులతో అతణ్ని వేధించే వ్యవస్థలు, లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం ఏదో ఒక స్కాం రూపంలో నేతల చేతుల్లోకి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోవడం గమనిస్తుంటే... పిచ్చెత్తి జుత్తు పట్టుకోవడం కంటే సామాన్యడు మరేం చేయగలడు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.