రామోజీ, కేసీఆర్ సమావేశం పర్యవసానాలు ఏమిటో?

Publish Date:Dec 18, 2014

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య, వారిరువురి పార్టీల మధ్య ఏదో ఒక అనిర్వచనీయమయిన బలమయిన బంధం ఒకటుందనే సంగతి అందరికీ తెలుసు. శత్రువు యొక్క శత్రువు మిత్రుడవుతాడనే సిద్దాంతం ప్రకారం వారిరువురూ కూడా చంద్రబాబు నాయుడుని, తెలుగుదేశం పార్టీని తీవ్రంగా ద్వేషిస్తున్నారు కనుక భిన్న దృవాలయిన వారిరువురూ దగ్గయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తండ్రి చనిపోయిన తరువాత ఆయన స్థానంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదామని ఆశించిన జగన్మోహన్ రెడ్డి ఆశ నేటికీ నెరవేరలేదు. ఎన్నికలలో తన పార్టీ ఓటమికి చంద్రబాబే కారణమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల తరువాతయినా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంటుందా? అనే అనుమానం కలుగుతోంది. బహుశః అందుకే జగన్ ఆయనను అంతగా ద్వేషిస్తున్నారని భావించవచ్చును.

 

ఇక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ది వేరే రకమయిన సమస్య. ఆయన తెలంగాణాలో తన పార్టీకి మరే ఇతర పార్టీ నుండి అసలు పోటీ ఉండకూడదని భావిస్తుంటారు. కానీ తెలుగుదేశం అక్కడ గట్టిగా నిలద్రొక్కుకోవాలని ప్రయత్నించడమే కాకుండా, తెలంగాణాలో బలంగా ఉన్న బీజేపీతో జత కట్టింది కూడా. ఆ రెండు పార్టీలు కలిసి తమ తెరాసకు పెను సవాలుగా నిలుస్తున్నాయనే క్రోధంతోనే కేసీఆర్ చంద్రబాబును ద్వేషిస్తున్నారని చెప్పవచ్చును.

 

రాష్ట్ర విభజన తరువాత వడ్డించిన విస్తరి అనుకొన్న తెలంగాణా రాష్ట్రంలో కూడా విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మ హత్యలు వంటి అనేక సమస్యలు పుట్టుకు వస్తుండటం, అదే సమయంలో కనీసం కార్యాలయం కూడా లేని పరిస్థితుల్లో ఆంధ్రాలో చంద్రబాబు సరిగ్గా అటువంటి సమస్యలన్నిటినీ ఒకటొకటిగా చాలా నేర్పుగా పరిష్కరించుకొంటూ ముందుకు వెళుతుండటం, తత్కారణంగా ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కోఅవలసి రావడం వంటి అనేక కారణాలు ఆయన చంద్రబాబు నాయుడుని ద్వేషించేలా చేస్తున్నాయని చెప్పవచ్చును.

 

కేసీఆర్, జగన్ లకు మరో ఉమ్మడి శత్రువు కూడా ఉన్నారు. అతనెవరో కాదు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు. కానీ రామోజీరావుని జగన్ ద్వేషిస్తునంతగా కేసీఆర్ ఆయనను ద్వేషించడం లేదని చెప్పవచ్చును. ఆయన ఆంధ్రాకు చెందినవారు కావడం, తను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకి సన్నిహితుడుకావడం చేతనే కేసీఆర్ ఇంతకాలం ఆయనకు దూరంగా ఉంటున్నారు. కానీ ఈ అకారణ ద్వేషం వలన నష్టమే తప్ప ఎటువంటి లాభమూ ఉండదనే ఆలోచనతోనే బహుశః కేసీఆర్ ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయనను కలిసి ఉండవచ్చును.

 

నిజానికి కేసీఆర్ తను ముఖ్యమంత్రి అయితే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దున్నించి చదును చేస్తానని ఒకప్పుడు శపథం చేసారు. కానీ అదే కేసీఆర్ ఇప్పుడు స్వయంగా మంత్రులను వెంటేసుకొని రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు వెళ్ళారు? వెళ్లి ఆయనతో ఏమి రహస్య మంతనాలు చేసారు? ఆనక రామోజీ రావును, ఆయన కట్టిన ఫిలింసిటీని, త్వరలో కట్టబోయే ఓం సిటీని ఎందుకు పొగిడారు? వారి సమావేశ పర్యవసానాలు ఏ నూతన రాజకీయ పరిణామాలకి దారి తీయబోతున్నాయి? అని ప్రజలందరూ ఆలోచించడం సహజమే. కానీ ప్రజలందరికంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఆందోళన చెందడం సహజం.

 

ఎందువలన అంటే జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాకు, రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే సంగతి అందరికీ తెలుసు. కారణాలు కూడా అందరికీ తెలిసినవే. అటువంటి తన బద్ధ శత్రువు దగ్గరకు తన మిత్రుడు కేసీఆర్ వెళ్లి సమావేశంకావడం, తరువాత ఆయనను పొగడటాన్ని జీర్ణించుకోవడం జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టమే. ఒకవేళ రామోజీరావు మధ్యవర్తిత్వంతో కేసీఆర్, చంద్రబాబు నాయుడు మళ్ళీ దగ్గరయితే అప్పుడు తన పరిస్థితి ఏమిటని జగన్మోహన్ రెడ్డి మధనపడుతుండవచ్చును. అదే జరిగితే, ఇప్పటికే రెండు రాష్ట్రాల రాజకీయాలలో, మీడియాలో ఒంటరయిపోయిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు పూర్తిగా ఒంటరివారయిపోతారు. అప్పుడు ఎటు చూసినా శత్రువులే తప్ప మిత్రుడనే వాడు ఒక్కడు కూడా కనబడడు. అందువలన జగన్ ఆందోళన చెందడంలో అసహజమేమీ లేదు. అయితే ఆయన ఇంతవరకు బయటపడలేదు. కానీ నేడు కాకపోతే రేపయినా అందరూ బయటపడక తప్పదు.

 

ఏమయినప్పటికీ వారిరువురి సమావేశం వలన రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలు తొలగించుకొనే ప్రయత్నాలు మొదలయ్యి, ఇరువురు ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకొనేందుకు సిద్దపడితే, దాని వలన రెండు రాష్ట్రాలకు, ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. రెండు రాష్ట్రాలలో కూడా అభివృద్ధి జోరందుకొంటుంది. కనుక జగన్ ఆందోళన గురించి పట్టించుకొనవసరం లేదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.