ఏపీలో మొదలైన ఆపరేషన్ ఆకర్ష్!?

Publish Date:Aug 30, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆపరేషన్ ఆకర్ష్ మెదలైందా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే ఔనని అనక తప్పదు. వైసీపీ నుంచి వలసల వెల్లువ కొనసాగుతున్నది. ఇప్పటికే ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీకీ, తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసేశారు. పార్టీకీ, పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి, బీద మస్తాన్ రావులు ఇద్దరూ కూడా తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాను తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయకత్వంలో పని చేయాలని భావిస్తున్నట్లు మోపిదేవి వెంకటరమన విస్పష్టంగా చెప్పేశారు. బీద మస్తాన్ రావు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరి చేరికకూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. అయితే వీరి చేరికకు చంద్రబాబు ఆమోదం తెలపడం పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.

ఈ ఇద్దరిలో ఒకరైన మోపిదేవి వెంకటరమణ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. వాన్ పిక్ కేసులో మోపిదేవి వెంకట రమణ ప్రధాన ముద్దాయి. అలాగే జగన్ అక్రమాస్తుల కేసులలో కూడా కూడా మోపిదేవి ఉన్నారు. అంతే కాకుండా రేపల్లె కు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు అనేక ఏళ్ల పాటు మోపిదేవి కారణంగా నానా ఇబ్బందులూ ఎదుర్కొన్నారు. ఇప్పుడు మోపిదేవి తెలుగుదేశం గూటికి చేరితే వారు ఆయనతో కలిసి పని చేయాల్సి వస్తుంది. ఇక బీద మస్తాన్ రావు విషయానికి వస్తే ఆయన గతంలో తెలుగుదేశంలోనే ఉండేవారు. అయితే పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పార్టీని వదిలి వెళ్లిపోయారు. అయినా కూడా తెలుగుదేశం నాయకత్వం ఇటువంటి చేరికలు జగన్ ను, జగన్ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు అవసరమని చెబుతోంది.   పార్టీకీ, పదవులకు రాజీనామా చేసి వస్తే ఓకే అని చంద్రబాబు అంటున్నారు.  క్యాడర్ కూడా ఈ విషయాన్ని అర్ధం చేసుకోవలసి ఉంటుంది. మోపిదేవి, బాదం మస్తాన్ రావులు మాత్రమే కాదు.. ఇంకా పలువురు వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామాల బాటలోనే ఉన్నారని తెలుస్తోంది. ఆ పార్టీకి ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన వారంతా కూటమి పార్టీల్లోకి  సర్దుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయి. రాజ్యసభ సభ్యులే కాదు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా పార్టీని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకీ, తన మండలి సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. ఆమె రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైనా, పార్టీ ద్వారా పలు అవకాశాలు అందిపుచ్చుకుని ఎదిగారు. అయితే తెలుగుదేశం ప్రతిపక్షంలోకి రాగానే పోతుల సునీత వైసీపీ గూటికి చేరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్ లపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. చివరికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రాహ్మణిలను కూడా ఆమె అనుచితంగా విమర్శించారు.  ఆమె బీజేపీ గూటికి చేరనున్నారు.  
అయితే రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం అంటూ తెలుగుదేశం అగ్రనాయకత్వం ఇటువంటి  చేరికలపై పెద్దగా అభ్యంతరం పెట్టడం లేదు. నిబంధనలను పట్టించుకోకుండా అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెబుతూనే.. వైసీపీని బలహీనం చేయడం, అలాగే మండలిలో ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. కేవలం రాజ్యసభ నుంచి మాత్రమే కాకుండా మండలిలో కూడా పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు గోడ దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోతుల సునీతతో మొదలు పెట్టి తాజాగా ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి కూడా తమ మండలి సభ్యత్వాలకు రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. వీరి బాటలోనే మరింత మంది ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ తనకు బలం ఉంది అని భావిస్తున్న రాజ్యసభ, శాసనమండలిలో ఆ పార్టీని బలహీనం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.