ఏపీలో వాడిపోతున్న కమలం.. బీజేపీ హైకమాండ్ ఏం చేస్తోంది?

Publish Date:Nov 6, 2024

Advertisement

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌లోపేతానికి ఆ పార్టీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తూ ఒక్కో రాష్ట్రాన్ని త‌మ ఖాతాలో వేసుకుంటున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముఖ్యంగా త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బ‌లోపేతం అవుతోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా ప్ర‌ణాళిక‌తో ఆ పార్టీ నేత‌లు ముందుకెళ్తున్నారు. త‌మిళ‌నాడులోనూ బీజేపీ బ‌లోపేతానికి వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. మ‌రోవైపు క‌ర్ణాట‌క‌లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేలా బీజేపీ ఇప్ప‌టి నుంచే వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతంపై మాత్రం బీజేపీ పెద్ద‌లు దృష్టి సారించ‌డం లేదు. ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ లు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం విదిత‌మే. అయితే, ఎన్నిక‌ల త‌రువాత తెలుగుదేశం, జ‌న‌సేన  అధిష్టానాలు త‌మత‌మ‌ పార్టీల బ‌లోపేతం చేయడంపై దృష్టి సారించాయి. బీజేపీ నేత‌లు మాత్రం ఆ  దిశగా ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. మ‌రోవైపు బీజేపీ అధిష్ఠానం కూడా రాష్ట్రంలో పార్టీ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. 

ఏపీలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ లు రాష్ట్ర అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టిసారించారు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ అరాచ‌క పాల‌న‌తో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుప‌డిపోయింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం హోదాలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చ‌డంతోపాటు.. అభివృద్ధిని పూర్తిగా ప‌క్క‌న‌ ప‌డేశారు. ఫ‌లితంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఒక ప‌క్క అమ‌రావ‌తి రాజ‌ధానిలో భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌పై దృష్టిసారించ‌డంతోపాటు.. పోలవ‌రం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్రంలో ర‌హ‌దారుల నిర్మాణం, మరమ్మతులు ఇలా అన్నిరకాలుగా అభివృద్ధిపై చంద్ర‌బాబు దృష్టిసారించారు. ఇద‌లా ఉంటే చంద్ర‌బాబు, లోకేశ్ పార్టీ బ‌లోపేతంపైనా దృష్టిసారించారు. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ నుంచి ప‌లువురిని త‌మత‌మ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఇప్ప‌టికే వైసీపీ సీనియ‌ర్ నేతలు టీడీపీ, జ‌న‌సేనలలో చేరారు. మ‌రికొంద‌రు ఆయా పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విష‌యంలో కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ మాత్రం వెనుక‌బ‌డిపోయింది. బీజేపీ  పెద్ద‌లు రాష్ట్రంలో పార్టీ ఉందన్న సోయ లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

 కూట‌మి ప్ర‌భుత్వంలో బీజేపీ నేత‌ల‌కు అన్యాయం జ‌రుగుతున్నద‌ని బీజేపీ రాష్ట్ర పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రిగా అవ‌కాశం క‌ల్పించి స‌ముచిత న్యాయం చేసిన‌ప్ప‌టికీ.. నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ విష‌యంలో.. ఇటీవ‌ల టీటీడీ పాల‌క వ‌ర్గం ఎంపిక విష‌యంలో బీజేపీకి ఇసుమంతైనా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నెల‌లో ఏపీ ప్ర‌భుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక వైస్‌ఛైర్మన్‌ను నియమించింది. 7 కార్పొరేషన్లలో 64 మందికి సభ్యులుగా అవకాశం కల్పించింది. ఇందులో బీజేపీ నేత‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. 20 కార్పొరేష‌న్ చైర్మ‌న్ల‌లో కేవ‌లం ఒక్క కార్పొరేష‌న్ (20 సూత్రాల అమ‌లు క‌మిటీ – లంకా దిన‌క‌ర్) ను మాత్ర‌మే బీజేపీకి కేటాయించారు. ఐదుగురు బీజేపీ నేత‌ల‌ను స‌భ్యులుగా నియ‌మించారు. దీనికితోడు ఇటీవ‌ల టీటీడీ పాల‌క వ‌ర్గం నియామ‌కంలోనూ బీజేపీకి అన్యాయం జ‌రిగింద‌ని ఆపార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తిరుపతికి చెందిన సీనియర్‌ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి పాలక మండలిలో చోటు ద‌క్కించింది. మ‌రొక బీజేపీ నేత‌కు టీటీడీ పాల‌క‌వ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పిస్తే బాగుండేద‌న్నభావన బీజేపీ రాష్ట్ర నాయకుల్లో వ్యక్తం అవుతోంది. అయితే, ఎన్టీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్  రాష్ట్ర బీజేపీ నేత‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. 

బీజేపీ కేంద్ర పెద్ద‌లుసైతం ఏపీలో పార్టీ బ‌లోపేతంపై పెద్ద‌గా దృష్టిసారించ‌డం లేదు. దీంతో పార్టీలోని ఓ వ‌ర్గం నేత‌లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల్లోకి ప‌లువురు వైసీపీ నేత‌లు చేరారు. బీజేపీ రాష్ట్ర అధిష్టానం, కేంద్ర అధిష్టానం పెద్ద‌లు మాత్రం పార్టీలో చేరిక‌ల విష‌యంపై అస‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని, త‌ద్వారా క్షేత్ర‌ స్థాయిలో పార్టీ క్యాడ‌ర్ లో నిస్తేజం నెల‌కొంటుంద‌ని  పార్టీ రాష్ట్ర నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విష‌యాన్ని కేంద్రం పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ వారు పట్టించుకోలేదు. కేంద్ర పార్టీ పెద్ద‌లు జోక్యం చేసుకొని ప్ర‌భుత్వ నామినేటెడ్ ప‌దవుల్లో రాష్ట్ర‌ బీజేపీ నేత‌ల‌కు వీలైన‌న్ని ఎక్కువ ప‌ద‌వులు ద‌క్కేలా చూడాల్సింది పోయి.. రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితిని సైతం ప‌ట్టించుకోక‌పోవ‌టంతో కొంద‌రు నేత‌లు ఏకంగా పార్టీ మారే ఆలోచ‌న సైతం చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, త్వ‌ర‌లో మ‌రో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు సిద్ధ‌మ‌య్యారు. వ‌చ్చే వారం రోజుల్లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు జోక్యం చేసుకొని.. రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌కు ఏమేర‌కు ఎక్కువ నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కేలా చూస్తార‌నే విష‌యంపై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంది.

By
en-us Political News

  
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.