ఏపీ సీఐడీ మాజీ చీఫ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కర్మఫలం అనుభవించక తప్పదుగా?

Publish Date:Nov 6, 2024

Advertisement

జగన్ హయాంలో కొందరు ఐపీఎస్ అధికారులు రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం తమ విధులను విస్మరించి ఏలిన వారి సేవలో తరించడమే పరమార్ధంగా భావించారు. జగన్ అధికారం శాశ్వతమన్న భ్రమల్లో ఆయన మెప్పు కోసం నానా గడ్డీ కరిచారు. పనిలో పనిగా సొంత లబ్ధి కోసం అడ్డదారులు తొక్కి అక్రమ సంపాదనకు తెరతీశారు. 

ఇప్పుడు జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి కొలువుదీరింది. దీంతో వైసీపీ కార్యర్తల్లా వ్యవహరించిన అధికారులు జగన్ అండ చూసుకుని చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థతి ఏర్పడింది. ఇప్పటికే పలువురు అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. వారి పాపాలు, అకృత్యాలకు చట్టం ముందు దోషిగా నిలబడక తప్పని పరిస్థితి ఎదురైంది. అలాంటి వారిలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ఒకరు. ఇప్పటికే లూప్ లైన్ లో ఉన్న సంజయ్ ఇప్పుడు కేసులు, విచారణలు ఎదుర్కొని కటకటాలు లెక్కించక తప్పని పరిస్థితిలో ఉన్నారు.  

తాము అఖిల భారత సర్వీసు అధికారులమని మరిచి.. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా నడుచుకుని, వాళ్లు చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా రెచ్చిపోయిన అధికారులంతా ఇప్పుడు ఎప్పుడు ఏ కేసులో అరెస్టు అవుతామా అన్న భయంతో వణికి పోతున్నారు. అలాంటి వారిలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ఒకరు.   కూటమి సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత సంజయ్‌కి పోస్టింగ్ ఇవ్వలేదు.  అంతే కాదు.. పలు అక్రమాల్లో అడ్డంగా దొరికిన ఆయనపై చర్యలకు ఇప్పుడు రంగం సిద్ధం అయ్యింది.  సంజయ్‌ అక్రమాల చిట్టా మామూలుగా లేదు. వివిధ శాఖల అధిపతిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు..చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. 

సంజయ్‌ ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పని చేసినప్పుడు..అధికార హోదాను అడ్డుపెట్టుకొని కోటి రూపాయలు దుర్వినియోగం చేశారు. ఆ విషయాన్ని  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో కుమ్మకై ఆ సంస్థకు అప్పనంగా చెల్లింపులు చేసినట్లు తేలింది.  బిడ్డింగ్‌లో రిగ్గింగ్‌ చేయడంతో పాటు టెండర్లు కట్టబెట్టడంలో  నిబంధనలను బేఖాతరు చేసినట్లు  గుర్తించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ విభాగం ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సంజయ్‌పై కేంద్ర సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని  సిఫార్సు చేసింది. 

 ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ గా ఉన్న సమయంలో సంజయ్ ఆ శాఖలో ఐపాడ్‌లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. టెండర్లు, కాంపిటీటివ్‌ బిడ్లు లేకుండానే  తన ఇష్టారీతిగా ఆర్డర్లు ఇచ్చేశారు.  బిల్లులూ సబ్‌మిట్‌ చేయలేదు.  వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్, ట్యాబ్‌ల సరఫరా కోసం భారీగా బిల్లులు చెల్లించేశారు. అంతే కాదు ఎస్సీ, ఎస్టీలకు చట్టాలపై అవగాహన కల్పిస్తానంటూ తనకు తానుగా ఓ భారీ బాధ్యతను తీసుకున్న సంజయ్ అప్పటి జగన్ సర్కార్ నుంచి ఏకంగా కోటి రూపాయలు దండుకున్నారు.  ఆ సొమ్ములో ఆయన ఎస్సీఎస్టీలకు చట్టాలపై అవగాహనా కార్యక్రమాలంటూ ఖర్చు చేసింది కేవలం మూడు లక్షల ర ూపాయలు మాత్రమే.  ఈ విషయాలన్నీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక తేల్చిన విషయాలే.  

ఇక తనను ఏరి కోరి సంజయ్ ను సీఐడీ చీఫ్‌ పిలిచి పీఠం ఎక్కించిన జగన్ మెప్పు కోసం ఆయన స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయంలో అత్యుత్సాహం చూపిన సంగతి విదితమే.  సరే అడ్డగోలుగా, కనీసం నోటీసు ఇవ్వకుండా, కారణం కూడా చెప్పకుండా చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత సంజయ్ వ్యవహరించిన తీరు మరింత దారుణంగా ఉంది. చంద్రబాబు అక్రమ అరెస్టు సక్రమమే అని చెప్పేందుకు నానా రకాలుగా ప్రయత్నించారు. అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలుతో కలిసి హస్తినలో ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబు అరెస్టును సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో ప్రభుత్వోద్యోగిగా తన పరిమితులను కూడా ఆయన అధిగమించేశారు.  ఇప్పుడు నాటి పాపాలకు శిక్ష అనుభవించడానికి ఎదురు చూస్తున్నారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక ప్రకారం ఐపీఎస్ సంజయ్ పై చర్యలకు రంగం సిద్ధమైందంటున్నారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.