ఫ్రంటూ లేదు గింటూ లేదు.. కేసీఆర్ నిర్వేదానికి కారణమేంటంటే?

Publish Date:Apr 22, 2022

Advertisement

కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం బీజేపీకి అధికారాన్ని సంపాదించి పెట్టింది. యూపీఏ 1, యూపీఏ 2 వైఫల్యాల ప్రభావంతో 2014 ఎన్నికల సమయంలో మోడీ నినాదం కాంగ్రెస్ ముక్త భారత్ పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో పాటు నాడు బీజేపీ అధికారంలోనికి రావడానికి నల్లధనంపై పోరాటం, విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తాం వంటి వాగ్దానాలూ బీజేపీ విజయానికి దోదహపడ్డాయి. అయితే ఎనిమిదేళ్ల తరువాత కూడా కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్నే నమ్ముకుని ముందుకు సాగుదాం అనుకుంటున్న కమలనాథుల కలలు నెరవేరడం లేదు.
కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఉన్నది పేరుకే ఎన్డీయే సర్కార్. కానీ ఎన్డీయే కూటమిలో సొంత గళం వినిపించగలిగే భాగస్వామ్య పక్షం దాదాపు లేదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో బీజేపీయేతర పార్టీలు ఏకమైతే తప్ప మోడీని దీటుగా ఎదుర్కొనడం సాధ్యం కాదన్న నిశ్చితాభిప్రాయానికి దాదాపు అన్ని పార్టీలూ వచ్చేశాయి. 
గతంలో అయితే...అయితే ఎన్డీయే, కాకపోతే యూపీఏ అన్నట్లుగా కూటములు ఉండేవి. అయితే 2014 తరువాత నుంచి దేశంలో కాంగ్రెస్ ప్రభావం గణనీయంగా తగ్గడంతో ఆ పార్టీ వెనుక కూటమి కట్టేందుకు పార్టీలు పెద్దగా ఆసక్తి కనబరచని పరిస్థితి ఏర్పడింది. కానీ 2024 ఎన్నికలు సమీపానికి వచ్చే సరికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాలు, ఆ పార్టీకి ఉన్న పార్లమెంటు సభ్యుల బలంతో సంబంధం లేకుండా ఆ పార్టీ లేకుండా బీజేపీయేతర కూటమి ఏర్పడే అవకాశం లేదన్న నిర్ధారణకు బీజేపీయేతర పార్టీలు వచ్చేశాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఓట్లూ, సీట్లూ  విషయంలో గతంలోలా కమాండింగ్ పొజిషన్ లో లేకపోయినా, ఆ పార్టీ లేకుండా బీజేపీని ఢీ కొనడం అంత తేలిక కాదని బీజేపీయేతర పార్టీలన్నీ దాదాపుగా నిర్ధారణకు వచ్చేశాయి. క్షేత స్థాయిలో ఆ పార్టీకి ఇప్పటికీ ఉన్న బలమైన పునాదులే అందుకు కారణం
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటే...

కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ జాతీయ స్థాయిలో ఫ్రంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపాదనకు జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల నుంచి స్పందన లేకుండా పోయింది. ఆ దిశగా జరిగిన ప్రయత్నాలలో భాగంగా జరిగిన సమావేశాలలో కాంగ్రెస్ లేకుండా బీజేపీయేతర ఫ్రంట్ అసంభవమన్న అభిప్రాయాన్నే టీఆర్ఎస్ మినహా మిగిలిన బీజేపీయేతర పార్టీలన్నీ వ్యక్తం చేశాయి. దీంతో కేసీఆర్ పరిస్థితి వ్రతమూ చెడింది...ఫలతమూ దక్కలేదన్నట్లుగా తయారైంది. ఫ్రంట్ నేతగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామనుకున్న ఆయన ఆశలకు ఆదిలోనే హంసపాదు పడింది. 
ఆది నుంచీ బీజేపీకి అన్ని విషయాలలోనూ మద్దతుగా నిలబడిన ఆయన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో బీజేపీ వ్యతిరేకులలో చాంపియన్ అనే ముద్ర కోసం ఆ పార్టీ వ్యతిరేక విధానాన్ని అవలంబించారు. అందులో భాగంగానే వడ్ల కొనుగోలు నుంచి....తెలంగాణకు మోడీ సర్కార్ అన్యాయం చేసిందంటూ ఆ పార్టీపై రణభేరి మోగించారు. 
ఆయన మోడీ సర్కార్ వ్యతిరేక వైఖరి కారణంగానే రాష్ట్రంలో అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న బీజేపీ ప్రతి విమర్శలతో పుంజుకుని తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగిందా అన్న భావన కలిగేలా కార్యక్రమాల జోరు పెంచింది. 
ఇప్పుడు మూడో ఫ్రంట్ ప్రయత్నాలు తుస్సుమనే సరికి కేసీఆర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీల ను ఢీ కొంటూ..ఒంటరిగా జాతీయ రాజకీయ యవనికపై తన ముద్ర చాటుకోవడానికి ప్రయత్నించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ దశలోనే ఆయన ఫ్రంటూ లేదు గింటూ లేదు...నేనే జాతీయ పార్టీ పెడతా అంటూ ప్రకటన చేసేశారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయి గుర్తింపునకు తాపత్రేయ పడటం కేసీఆర్ తోనే ప్రారంభం కాలేదు. ఆయనతోనే అంతం కాదు. కానీ ఇప్పటికప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం వల్ల అదనంగా చేకూరే ప్రయోజనమేమిటన్నదానిపైనే అందరి సందేహాలూ... 
-ఐక్యంగా లేకుంటే నష్టమే అని..
ఢిల్లీలో కనీసం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానైనా కలవడానికి ఇష్టపడని ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ క్రేజీవాల్‌ కూడా బీజేపీని ఎదుర్కోనే క్రమంలో కాంగ్రెస్‌ కు దగ్గరవుతున్నట్లు సంకేతాలిచ్చారు. రాబోయే గుజరాత్‌ ఎన్నికల్లో అవసరమైతే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే దిశగానూ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాము ఐక్యంగా లేకపోతే బీజేపీకే ప్రయోజనం అనే విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించినట్లు తాజా ఉమ్మడి లేఖద్వారా తేటతెల్లం అయింది. కానీ కేసీఆర్‌ ను కనీసం బీజేపీ వ్యతిరేకిగా గుర్తించకపోవడం బహుశా మొన్నటిదాకా ఆయన వ్యవహరించిన తీరే కారణమనే విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏడేళ్లపాటు బేషరతుగా మద్దతు పలికి, మోదీ సర్కార్‌ చేసిన అన్ని చట్టాలనూ సమర్థించిన కేసీఆర్‌.. ఇప్పుడు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీని విభేదిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
బీజేపీ అనుకూల పార్టీలను ఒప్పించడంలో విఫలం..
ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా ఇప్పటిదాకా కేసీఆర్‌ కాంగ్రెస్‌తో కలిసి ఉన్న పార్టీల నేతలను కలిసి మాట్లాడారే తప్ప.. బీజేపీతో కలిసి ఉన్న పార్టీలను కలిసి, వాటిని ఒప్పించే ప్రయత్నాలు చేయలేదు. కనీసం పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం జగన్‌ ను కూడా కలవని వైనాన్ని ప్రధాన ప్రతిపక్షాలు గమనిస్తున్నాయి. కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న కూటమి వల్ల విపక్షాల ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. అందుకే సంయుక్త ప్రకటనలో కేసీఆర్‌ పేరును చేర్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు.. కేసీఆర్‌–టీఆర్‌ఎస్‌లో బీజేపీ వ్యతిరేక పంథాలో నిలకడ ఎంత? అనే ప్రశ్న తలెత్తుతోందని విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.