Publish Date:Jul 27, 2022
అది మహారాష్ట్ర థానె జిల్లా భీవాండీ పట్టణం. ఐదేళ్ల పిల్లవాడు బికు బికుమంటూ భయాందోళనల మధ్య తండ్రి రిజ్వాన్తో ఉంటున్నాడు. వాడికి అమ్మా..నాన్నా.. అంటూ మాటలు వచ్చేప్పటికే తల్లిదం డ్రులు విడిపోయారు. కారణాలు వాళ్ల బంధు వులు అనేక చెబుతు న్నారు. కానీ రెండు కుటుంబాల పెద్దవాళ్ల వాదోపవాదాలు, తండ్రి మూర్ఖత్వం, తల్లి రోదనల మధ్య పసికందు ఒంటరితనానికి గురవు తున్నాడు. పసివాడేగనుక తల్లిని చూడాలని, ఆమె పాటా, మాటా వినాలని, ఆమె పెట్టే గోరుముద్దలు తినాలనే ఉంటుంది. కానీ అది అసాధ్యం చేసేడు ఆ కసాయి తండ్రి.
ఫాహిమ్ రిజ్వాన్ తన భార్యతో విడిపోయిన తర్వాత కూడా పిల్లాడు కేవలం ఐదేళ్లవాడే గనుక తల్లి వచ్చి కలవడమో, పిల్లాడిని తీసి కెళ్లడామో చేయాలని బంధువులు, హితులు, రిజ్వాన్ స్నేహితులూ ఎంతో చెప్పారు. రిజ్వాన్ అందరికీ, చెప్పినవన్నీ వింటూ తలూపాడు అంతే. తనను కాదనుకున్నప్పుడు పిల్లవాడిని ఎందుకు చూపా లన్న పట్టుదలకు పోయాడు. అంతే పిల్లాడిని ఆమెతో కలవకుండా వీలయినన్ని అడ్డంకులు పెట్టేడు. అయినా ఎవరితో ఒకరితో తల్లిని కలవడం రిజ్వాన్ బొత్తిగా భరించలేకపోయాడు. అతనిలో తండ్రి చనిపోయాడు. రాక్షసుడు లేచాడు. పిల్లవాడిని తన కొడుకు అనే కనీసపు స్పృహా కోల్పో యాడు. అంతే అతను సిగెరెట్ తాగుతూ పిల్లాడికి దానితో వాతలు పెట్టేడు. పిల్లడు బిక్కటిల్లాడు. తల్లి దూరంగా ఉంది. ఆమెకు వాడి రోదన తెలియదు.
ఇలాంటి భయాందోళనల మధ్య ఆ పిల్లవాడు ఇంకెన్నాళ్లు బతుకు సాగించాలో తెలీదు. తండ్రిగా రిజ్వాన్ ఓడిపోయాడు. తల్లికి విడాకులు గోడగా మారింది. పిల్లవాడు బేలగా వీధి వంకే చూస్తున్నాడు. పోలీసులు మాత్రం ఇంకా రిజ్వాన్ను అరెస్టు చేయ లేదు. వాళ్లకి ఇంకా ఏవో సాక్ష్యాలు కావాలట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-father-affection-in-rizwan-25-140693.html
Publish Date:Sep 10, 2026
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.