వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటన అంతా స్వోత్కర్ష.. పరనిందే!

Publish Date:Jul 27, 2022

Advertisement

సీఎం జగన్ రెండు రోజుల వరద బాధిత ప్రాంతాల లో రెండు రోజుల పర్యటన ముగిసింది. అయితే ఈ పర్యటనలో ఆయన బాధితులకు ఒక్కటంటే ఒక్క హామీ   ఇవ్వలేదు.  బాధితులకు ఊరట ఒక్కటంటే ఒక్క ప్రకటన లేదు. వరద నష్టం ఊసే లేదు. ఏదో ఒక వంతెనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు చేసిన ప్రకటన తప్ప ఎవరికీ  పైసా ప్రకటించింది లేదు. అయితే తానేం చేయలేననీ, చేయగలిగింది ఏమీ లేదని చెప్పడానికి మాత్రం ఆయన ఒక్క నిముషం కూడా ఆలోచించలేదు. జగన్ పర్యటన సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగమంతా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే మోహరించింది.

కానీ వరద బాధితుల కన్నీరు తుడిచేందుకు ఒక్క చేయి ప్రయత్నించిన దాఖలాలు లేవు. వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటన అంతా తనను తాను పొగుడుకోవడానికీ విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికేనా అన్నట్లుగా సాగంది.  ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల రూపాయల ఆర్థిక సాయం బాధితులందరికీ అందిందని ఘనంగా ప్రకటించేశారు. పశువుల కోసం గ్రాసం  కూడా అందించామనీ, వాటికే కనుక నోరుంటే ఇంతటి విపత్తులోనూ తమను అంత శ్రద్ధగా పట్టించుకున్నందుకు అవి కూడా తనను ప్రశంసించి ఉండేవని చెప్పుకున్నారు.   ఆయన పర్యటన మొత్తం స్వోత్కర్ష పర నింద లక్ష్యంగానే సాగింది.  వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటిస్తే ఏదో ఒక సాయం, ఎంతో కొంత పరిహారం ఇస్తామని ప్రకటిస్తారు. జగన్ ఆ పని కూడా చేయలేదు. వరద ముంపు బాధితులను పరామర్శించలేదనీ, ఆయా ప్రాంతాలలో పర్యటించలేదనీ విపక్షాల విమర్శల కారణంగానే ఏదో పర్యటించేశానని చెప్పుకోవడానికే ఆయన పర్యటన సాగింది.

పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి తమ ప్రభుత్వం ఇచ్చిన రూ. రెండు వేలు..  ఉల్లిపాయలు, టమాటాలే చాలా ఎక్కువ అన్న చందంగా వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటన సాగింది. వాస్తవానికి ఈ పర్యటనలో ముఖ్యమంత్రిని కలిసిన వారంతా ఎంపిక చేసిన వారే. మొత్తం పర్యటన అంతా చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారం సాగింది. విలేకరులను అనుమతించలేదు.  ఇక పోలవరం నిర్వాసితుల విషయంలో ఈ పర్యటనలో జగన్ మరీ దారుణంగా వ్యవహరించారు.   కేంద్రం నిధులిస్తే తప్ప పోలవరం నిర్వాసితులకు తాను చేయగలిగిన సాయం ఏమీ లేదని నిస్సిగ్గుగా ప్రకటించేశారు.  పునరావాసం బాధ్యత రాష్ట్రానిదేనని కేంద్రం విస్పష్టంగా చెబుతున్నా జగన్ కేంద్రం నిధులిస్తేనే పునరావాసం అని చెప్పారంటే.. వారికి శూన్య హస్తం చూపించినట్లు.  

మొత్తంగా వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ జరిపిన రెండు రోజుల పర్యటన బాధితుల్లో జగన్ ప్రతిష్టను మరింత దిగజార్చడానికే ఉపయోగపడింది. పరిశీలకులు కూడా జగన్ పర్యటనను చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలలో జరిపిన పర్యటనతో పోల్చి చూస్తున్నారు. వరద ముంపు సమయంలోనే విపక్ష నేత చంద్రబాబు బాధితులను పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబుకు వరద బాధితులు ఆయనకు తమ బాధలు చెప్పుకోవడానికి గోదావరి వరద మళ్లీ వచ్చిందా అన్నట్లుగా పోటెత్తారు.  బాధితులను కలుసుకోవడానికి ఆయన బురదలో నడిచారు. ట్రాక్టర్ ఎక్కి డ్రైవర్ పక్కనే కూర్చున్నారు. స్వయంగా ట్రాక్టర్ దిగి బాధితుల వద్దకు వెళ్లారు. అదే జగన్ పర్యటనలో జనం జాడ లేదు. పార్టీ నేతలు ఎంపిక చేసిన వారు వినా ఆయనను చూడడానికి వచ్చిన వారే కనిపించలేదు. ఖాళీ వీధుల్లో ఆయన నమస్కారాలు పెట్టుకుంటూ తిరిగారు. ఇవన్నీ బయటకు పొక్కకూడదన్నట్లు మీడియాను ఆయన పర్యటిస్తున్న ప్రాంతాలలోకి అనుమతించలేదు. విపక్ష నేతగా చంద్రబాబు వరద ప్రాంతాలలో పర్యటించి చేయగలిగింది బాధితుల్లో భరోసా నింపడమే. వరద   నష్టానికి సాయంఆయన ప్రకటించలేరు. అయినా జనం ఆయన ఇచ్చే భరోసాయే చాలు అన్నట్లుగా ఆయన పర్యటన ఆసాంతం ఆయన వెంటనే ఉన్నారు. అదే ముఖ్యమంత్రి జగన్ తన పర్యటనలో బాధితులకు సాయం ప్రకటించే అవకాశం ఉంది. అధికారం ఉంది. ప్రభుత్వాధినేతగా అది చేయాలి కూడా. అయినా సరే ఆయన పర్యటన పట్ల జనం ఆసక్తి చూపలేదు.  

By
en-us Political News

  
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.