కమిషనర్ కనిపించరు.. మంత్రి వినిపించుకోరు: తెలంగాణ కార్మిక శాఖలో సమస్యల తిష్ట

Publish Date:May 6, 2022

Advertisement

తెలంగాణ కార్మిక శాఖ నిస్తేజంగా మారిపోయింది. ఆ శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ లేరు. ఇన్ చార్జి కమిషనర్ గా ఉన్న నదీమ్ అహ్మద్ కనిపించరు. ఆ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వినిపించుకోరు. దీంతో ఆ శాఖలో సమస్యలు తిష్ట వేశాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికై..తరువాత తెరాస గూటికి చేరిన చామకూర మల్లారెడ్డి 2018 ఎన్నికలలో తెరాస నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనతి కాలంలోనే మంత్రిగా ప్రమోషన్ పొందారు. విద్యా సంస్థల అధినేతగా ఆయన చాలా చాలా బిజీగా ఉంటారు. మంత్రి పదవి అన్నది హోదాగానే తప్ప.. ఆ శాఖపై పట్టు సాధించే దిశగా  ఇప్పటి వరకూ ఆయన ప్రయత్నించింది లేదని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఈ మూడేళ్లలో కార్మిక శాఖపై మంత్రి చామకూర మల్లారెడ్డి ఒక్క సారి కూడా పూర్తి స్థాయి సమీక్ష చేయలేదంటే పరిస్థితి ఏమిటన్నది ఎవరికైనా అవగతమౌతుంది.

మంత్రి ఇలా తన శాఖ పట్ల అంటీముట్టనట్టుగా ప్రవర్తిస్తుంటే.. అది చాలదన్నట్లు కార్మిక శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో.. ఇన్ చార్జ్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నదీమ్ అహ్మద్ ఆదనపు బాధ్యతపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయన వారానికి ఒకటి రెండు సార్లు కార్యాలయానికి రావడమే గగనమంటున్నారు. దీంతో కార్మిక శాఖలో ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోక అపరిష్కృతంగా మిగిలిపోయాయి.

ముఖ్యంగా 75వ షెడ్యూల్ లోని   రెండు కోట్ల మంది ఉద్యోగుల వేతన పెంపు సమస్య ఏళ్ల తరబడి పెండింగ్ లోనే ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం మంత్రి, కమిషనర్ లను ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో పొందిన వేతనాలే నేటికీ తమకు అందుతున్నాయనీ, ఈ ఎనిమిదేళ్లుగా పైసా జీతం పెరగలేదని వారు వాపోతున్నారు. ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు మేలు చేసే ఉద్దేశంతోనే తమ సమస్య విషయంలో మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, మంత్రి ఆసక్తి చూపకపోవడంతో ఇన్ చార్జి కమిషనర్ కూడా పట్టించుకోవడం లేదనీ వారు ఆరోపిస్తున్నారు.  నెలల తరబడి పెండింగ్ లో ఉన్నా తమ వేతనాల ఫైలును ఇప్పటి వరకూ ప్రభుత్వం వద్దకు పంపించలేదని అంటున్నారు. 
కనీస వేతన మండలి సిఫార్సులకు కూడా అతీగతీ లేకుండా పోయిందని కార్మికులు చెబుతున్నారు.  కార్మిక శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ ను నియమిస్తే సమస్యలు ఏదో ఒక మేరకు పరిష్కారమౌతాయని వారంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  ఇక మంత్రి మల్లారెడ్డి స్వయంగా విద్యా, వైద్య సంస్థలను నిర్వహిస్తున్నా..కార్మికుల సంక్షేమం ప్రయోజనాల విషయంలో పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని కార్మికులు విమర్శిస్తున్నారు.  సీఎం జోక్యం చేసుకుని కార్మిక శాఖ గాడిలో పడేలా చర్యలకు ఉపక్రమించాలనీ, మంత్రి మల్లారెడ్డి కార్మిక సమస్యల పరిష్కారం దిశగా పని చేసేలా మార్గనిర్దేశనం చేయాలని కార్మికులు కోరుతున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.