నిన్నవెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ అధిష్టానం ఇంకా పూర్తిగా జీర్ణించుకోక ముందే, దానినెత్తిన మరో పిడుగు పడబోతోంది. ఈ రోజు డిల్లీలో సమావేశమయిన కాంగ్రెస్ యంపీలు లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, సాయి ప్రతాప్, హర్షకుమార్, యస్పీవై రెడ్డి, సబ్బంహరి తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెచ్చేందుకు లేఖపై సంతకాలు చేసారు. ఈ రోజు సాయంత్రంలోగా దానిని స్పీకర్ మీరా కుమార్ కి అందజేయనున్నారు. కానీ చిరంజీవి, పురందేశ్వరి, కిల్లి కృపా రాణీ, జేడీ శీలం, కావూరి, పళ్ళంరాజు తదితరులు మాత్రం వేనుకంజవేసినట్లు తెలుస్తోంది.
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశ పెట్టాలంటే కనీసం 55 మంది సభ్యుల మద్దతు తెలపాల్సి ఉంటుంది. కాంగ్రెస్ యంపీలు స్వయంగా తమ స్వంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నారు గనుక సభలో ఇతర పార్టీల సభ్యులు కూడా దానికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. స్పీకర్ కాంగ్రెస్ యంపీల అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి అంతకంటే అవమానం మరొకటి ఉండబోదు.
ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో ఓటమితో క్రుంగిపోతున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఇది జీర్ణించుకోవడం కష్టమే. గనుక వారిని బుజ్జగించే పని మొదలుపెడుతుందేమో! అప్పుడు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు వారు కోరినట్లు తెలంగాణా బిల్లులో ఏమయినా మార్పులు చేర్పులకి అంగీకరిస్తే అప్పుడు టీ-కాంగ్రెస్ నేతలు అవిశ్వాసం ప్రతిపాదిస్తారేమో చూడాలి. ఏమయినప్పటికీ సోనియాగాంధీకి కాంగ్రెస్ నేతలు ఆమె పుట్టిన రోజున చాలా అరుదయిన కానుక సమర్పించుకొంటున్నారని ఒప్పుకోక తప్పదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-confidence-on-congress-39-28216.html
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.