Publish Date:Jun 14, 2013
రాష్ట్ర విభజన జరుగుతున్నతీరు చూసి ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, చివరికి స్వంత పార్టీ నేతలు కూడా సిగ్గుపడుతున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్నట్లు ముందుకు సాగిపోతోంది. ఈ ప్రక్రియ మొదలు పెట్టిననాటి నుండి నేటి వరకూ కూడా ఇదొక అధికారిక, రాజ్యాంగ వ్యవహారంలా కాక, కాంగ్రెస్ పార్టీ స్వంత వ్యవహారంలా, ఒక చెత్త సస్పెన్స్ టీవీ సీరియల్లాగా అనేక మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా పారదర్శకత అనే పదం కనబడకుండా జాగ్రత్తపడుతూ కాంగ్రెస్ అధిష్టానం తెలుగు ప్రజలకి కూడా తెలియకుండా అత్యంత రహస్యంగా వారి రాష్ట్రాన్ని విభజిస్తోంది.
ఇక ఈ పరమ చెత్త సీరియల్లో ఈ రోజు ఎపిసోడ్లో సస్పెన్స్ ఏమిటంటే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన వద్దకు వచ్చిన తెలంగాణా బిల్లుని ఈరోజే చూసి, రాష్ట్ర శాసనసభకు పంపుతారా? లేక దానిపై ఏవయినా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా? అనేది తేలాలి. ఇక ఈ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ ఏమిటంటే, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన ఈ రోజు సాయంత్రమే దక్షిణాఫ్రికాకు రెండు రోజుల పర్యటనకు బయలుదేరబోతున్నారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్దంగా జరగడం లేదని ఇప్పటికే ఆయనకు అనేక పిర్యాదులు వచ్చిన కారణంగా, ఆయన దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తరువాతనే తెలంగాణా బిల్లుని సావకాశంగా పరిశీలించుతారా? లేక కాంగ్రెస్ ఒత్తిడి మేరకు ఈరోజే హడావుడిగా ఆమోదముద్ర వేసేసి శాసనసభకు పంపుతారా? అనేది మరో సస్పెన్స్. ఇంకా ఇటువంటి ట్విస్టులు ఎన్నెన్నిచూడాలో మున్ముందు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-bill-39-28215.html
ప్రముఖ నటుడు సోనూసూద్ సోమవారం (జూన్ 2) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలుగుదేశం పార్టీ స్కాట్లాండ్ ఎన్నారై విభాగం ప్రారంభమైంది. మినీ మహానాడు 2025 తో ఘనంగా ఈ విభాగాన్ని ప్రారంభించారు. ఎడిన్ బర్గ్ నగరంలోని అప్ హాల్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఎక్సైజ్ కార్యాలయం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం (జూన్ 1) సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
మంత్రి లోకేష్ ఆరు సూత్రాలంటే..వైసీసీ క్రిమినల్ ఐడియాలజీని ఆవిష్కరిస్తోందని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు సైకిల్తో కొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని ఆయన అన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శన క్యూలైన్లలో అది కూడా ఆలయం లోపల కొందరు వైసీపీ నేతలు కావాలనే భక్తులను రెచ్చగొడుతూతురని ఆయన అన్నారు.
హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్-2025 పోటీల్లో 72వ మిస్ వరల్డ్గా థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాత సువాంగ్శ్రీ టైటిల్ గెల్చుకున్న విషయం తెలిసిందే. సుచాత మరిన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. థాయ్ లాండ్ లోని ఫుకెట్ లో సుచాత జన్మించారు.
సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్ టీమ్ఇండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. లఖ్నవూలోని ఓ లగ్జరీ హోటల్లో వీరి నిశ్చితార్థం ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబం ఆంటే తెలియని వారు లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ఎంత మేలు చేసారో నేటికి చాల మంది మరచిపోయి ఉండరు.
కనిపించవు కానీ నీలో కూడా ఒక స్మార్ట్ పొలిటీషియన్ ఉన్నాడయ్యా నాగార్జునా.. అనే వాళ్లుంటారు. నాగార్జున ఏమంత సామాన్యంగా పావులు కదపరు. ఆయన స్కెచ్ వేస్తే అందుకంటూ ఒక లెక్కుంటుందని అంటారు.
ఏపీలో వ్యాప్తంగా మళ్లీ రేషన్ షాపులు తెరుచుకున్నాయి. 29,796 రేషన్ దుకాణాల్లో సరకులు పంపిణీ చేస్తున్నారు.