Publish Date:Jun 14, 2013
రాష్ట్ర విభజన జరుగుతున్నతీరు చూసి ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, చివరికి స్వంత పార్టీ నేతలు కూడా సిగ్గుపడుతున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్నట్లు ముందుకు సాగిపోతోంది. ఈ ప్రక్రియ మొదలు పెట్టిననాటి నుండి నేటి వరకూ కూడా ఇదొక అధికారిక, రాజ్యాంగ వ్యవహారంలా కాక, కాంగ్రెస్ పార్టీ స్వంత వ్యవహారంలా, ఒక చెత్త సస్పెన్స్ టీవీ సీరియల్లాగా అనేక మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా పారదర్శకత అనే పదం కనబడకుండా జాగ్రత్తపడుతూ కాంగ్రెస్ అధిష్టానం తెలుగు ప్రజలకి కూడా తెలియకుండా అత్యంత రహస్యంగా వారి రాష్ట్రాన్ని విభజిస్తోంది.
ఇక ఈ పరమ చెత్త సీరియల్లో ఈ రోజు ఎపిసోడ్లో సస్పెన్స్ ఏమిటంటే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన వద్దకు వచ్చిన తెలంగాణా బిల్లుని ఈరోజే చూసి, రాష్ట్ర శాసనసభకు పంపుతారా? లేక దానిపై ఏవయినా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా? అనేది తేలాలి. ఇక ఈ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ ఏమిటంటే, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన ఈ రోజు సాయంత్రమే దక్షిణాఫ్రికాకు రెండు రోజుల పర్యటనకు బయలుదేరబోతున్నారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్దంగా జరగడం లేదని ఇప్పటికే ఆయనకు అనేక పిర్యాదులు వచ్చిన కారణంగా, ఆయన దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తరువాతనే తెలంగాణా బిల్లుని సావకాశంగా పరిశీలించుతారా? లేక కాంగ్రెస్ ఒత్తిడి మేరకు ఈరోజే హడావుడిగా ఆమోదముద్ర వేసేసి శాసనసభకు పంపుతారా? అనేది మరో సస్పెన్స్. ఇంకా ఇటువంటి ట్విస్టులు ఎన్నెన్నిచూడాలో మున్ముందు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-bill-39-28215.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.