బీజేపీతో నితీష్ కుమార్ కటీఫ్?

Publish Date:Mar 18, 2013

Advertisement

 

దేశంలో ప్రతిపక్ష పార్టీలలో నరేంద్ర మోడీ తరువాత అంతటి పేరు సంపాదించుకొన్న వ్యక్తి ఎవరంటే, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అని చెప్పవచ్చును. వీరిద్దరూ కూడా తమ తమ రాష్ట్రాలను ప్రగతి పధంలో తీసుకు వెళ్లేందుకు చేస్తున్న కృషి కారణంగానే సుప్రసిద్దులయ్యారని చెప్పవచ్చును.

 

అయితే, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ నాయకత్వంలో అన్నివిధాల బ్రష్టు పట్టిన బీహార్ రాష్ట్రాన్ని చక్కదిద్దడం సాధారణ విషయం ఏమి కాదు గనుక, వీరిద్దరిలో నితీష్ కుమార్ ఎక్కువ శ్రమించవలసి ఉంటుంది. గనుక తన రాష్ట్రం త్వరితగతిన ప్రగతి సాధించాలంటే బీహార్ కు ‘ప్రత్యేక రాష్ట్ర హోదా’ అవసరమని ఆయన వాదన. తన వాదనను మరింత బలంగా వినిపించేందుకు ఆదివారం నాడు డిల్లీలో లక్షమందితో ఆయన అధికార ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే, తన డిమాండ్ సాధనకు ఆయన ఎంచుకొన్న మార్గం, ఆయనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమా లేక బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీయేతో తెగతెంపులు చేసుకొని, కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యుపీయే కూటమిలో చేరెందుకా? అనే సందేహం తలఎత్తేలా చేస్తోంది.

 

అయన ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తన రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమయితే కూటములకు అతీతంగా ఏ ప్రభుత్వానికయినా మద్దతు ఇచ్చేందుకు తానూ సిద్ధం అని ప్రకటించడం గమనిస్తే ఆయన యుపీయే కూటమిలో చేరేందుకు సిద్ధం అని కాంగ్రెస్ పార్టీకి సంకేతాలు పంపినట్లు అర్ధం అవుతోంది. ఆయన తన ర్యాలీకి బీజేపీని ఆహ్వానించకపోవడం, అభివృద్ధి అంటే ప్రభుత్వాన్ని ఒక వ్యక్తిగత సంస్థగా మార్చడం కాదని గుజరాత్ ముఖ్యమంత్రి మోడీపై పరోక్షంగా విమర్శలు చేయడం కూడా అదే సూచిస్తోంది.

 

నితీష్ కుమార్ ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నపటికీ, ఆయన వ్యతిరేఖిస్తున్న నరేంద్ర మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదించడమే ఆయనను ఎన్డీయే నుండి బయటకి వెళ్లేందుకు కారణమవుతోందని చెప్పవచ్చును. అంతేకాక మరో బలమయిన కారణం కూడా ఉంది. నితీష్ కుమార్ తానూ ప్రధాని పదవికి అనర్హుడిని స్వయంగా చెప్పుకొంటున్నపటికీ, ఒకవేళ బీజేపీలో అంతర్గత పోటీ గనుక ఏర్పడినట్లయితే, అప్పుడు అందరికీ ఆమోద యోగ్యుడయినా వ్యక్తిగా తానూ ఆ పదవిని దక్కించుకోవచ్చుననే ఆలోచన ఆయనకుందనేది బహిరంగ రహస్యమే.

 

అయితే, బీజేపీ అనూహ్యంగా మోడీని ముందుకు తీసుకు రావడంతో ఆయనకు నిరాశ తప్పలేదు. అందువల్లే ఆయన నరేంద్ర మోడీ ప్రధాని పదవికి అభ్యర్ధిత్వాన్ని మొదట నుండి వ్యతిరేఖిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో 2002 సం.లో మోడీ అధ్వర్యంలో జరిగిన మారణఖాండ కూడా ఆయనను వ్యతిరేఖించడానికి మరో కారణంగా చెప్పవచ్చును.

 

ఒకవేళ బీజేపీ మోడీని కాకుండా మరొకరిని ఎవరినయినా తన ప్రదాని అభ్యర్ధిగా ప్రతిపాదించి ఉంటే బహుశః ఆయన ఎన్డీయే కూటమిని వీడే ఆలోచన చేసేవారు కారేమో. అయితే, 2014సం.ల ఎన్నికలలో ఎలాగయినా సరే కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ, దేశవ్యాప్తంగా కాకపోయినా ఉత్తరాది రాష్ట్రాలలో మంచి సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించిన నరేంద్ర మోడీని కాదనుకొని వేరొకరిని తన రధసారధిగా చేసుకొని రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. కనుక మోడీనే తమ ప్రధాని అభ్యర్దని దాదాపు ఖాయం చేసుకోవడంతో నితీష్ కుమార్ కు ప్రత్యామ్నాయం చూసుకోక తప్పలేదు.

 

బీజేపీ కూడా నితీష్ కుమార్ తమ కూటమి నుండి బయటకి వెళ్లిపోయినట్లయితే, వచ్చే ఎన్నికలలో బీహార్ రాష్ట్రంలో ఆయనకి వ్యతిరేఖంగా పోటీకి సిద్ధం అని ప్రకటించడంతో, ఇక వారిరువురు మద్య ‘శాస్త్రోక్తంగా విడాకులు’ తీసుకోవడమొకటే మిగిలి పోయిందని చెప్పవచ్చును.

 

అయితే, నితీష్ కుమార్ ఎన్డీయేను వీడి యుపీయే ‘హస్తం’ గనుక అందుకొంటే ఇక ఆయన జీవిత కాలంలో దేశానికి ప్రధాని అయ్యే ఆలోచన కూడా మానుకోవచ్చును. ఎందుకంటే యుపీయేలో ఆ పదవి శాశ్వితంగా సోనియా గాంధీ కుటుంబానికే రిజర్వు చేయబడింది గనుక. అందువల్ల నితీష్ కుమార్ కేవలం తన రాష్ట్ర ప్రగతిని మాత్రమే గనుక కోరుకొంటే నిరభ్యంతరంగా ఆయన యుపీయే హస్తం అందుకోవచ్చును. కానీ, ప్రధాని పదవిపై ఆశలుంటే మాత్రం ఆయన ఎన్డీయే కూటమికే అంటిపెట్టుకొని ఉండటం మేలు. తద్వారా ఇవాళ్ళ కాకపోయినా రేపయినా ఆయనకు ఆ అవకాశం దక్కవచ్చును.

 

ఏది ఏమయినప్పటికీ, ఎన్డీయే కూటమిని వీడటం వలన నితీష్ కుమార్ కు కొత్తగా వచ్చే నష్టం లేకపోయినప్పటికీ, అటువంటి సమర్ధుడు ప్రజాకర్షక నాయకుడినీ, ఆయన పార్టీ మద్దతునీ కోల్పోవడం ఎన్డీయే కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకె తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.