నిర్భయ పేరును మనం దురుపయోగం చేస్తున్నామా?

Publish Date:Mar 17, 2013

Advertisement

 

మూడు నెలల క్రితం డిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఉదంతం తరువాత దేశం యావత్తు స్పందించడం, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందిస్తూ, త్వరితగతిన కేసును విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పరచడమే కాకుండా, జస్టిస్ వర్మ కమిటీని వేయడం, ఆ కమిటీ కూడా విస్తృత అధ్యయనం చేసి కేవలం నెలరోజుల్లోనే తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించడం జరిగాయి. కేంద్రప్రభుత్వం కూడా వెంటనే స్పందిస్తూ వర్మ కమిటీ చేసిన సిఫార్సులలో కొన్నిటిని స్వీకరించి, మరికొన్నిటికి సవరణలతో త్వరలో పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు తీవ్ర కృషిచేయడం అభినందనీయమే.

 

కానీ, డిల్లీ ఉదంతం తరువాత మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే తీవ్ర శిక్షలు ఉంటాయని స్పష్టం అయినప్పటికీ, మన దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నాటి నుండి నేటి వరకూ మహిళలపై అదే తరహ అత్యాచారాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పైగా అవి ఇదివరకు కంటే ఎక్కువవడం చాలా ఆందోళనకరంగా మారాయి.

 

‘అతిధి దేవో భవా’ అనే ఒక గొప్ప ఆలోచనకి, సంస్కృతికి మూలమయిన మన భారతదేశంలోనే మొన్న స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఒక విదేశీ పర్యాటకురాలిపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సామూహిక అత్యాచారం జరగడం మనల్ని ప్రపంచదేశాల ముందు తలదించుకోనేలా చేసింది. మళ్ళీ అదే రాష్ట్రంలో గల ఇండోర్ నగరంలో మొన్న శుక్రవారం నాడు బస్సులో ప్రయాణిస్తున్న ఒక నిస్సహాయ మహిళపై మరో సామూహిక అత్యాచారం జరగడం దేశంలో మహిళలకు భద్రత లేదని నిరూపించడమే కాకుండా, మహిళల పట్ల పురుష సమాజపు ఆలోచనలలో కూడా ఎటువంటి మార్పు రాలేదని, అది అంత త్వరగా రాదని కూడా నిరూపించాయి.

 

‘ఎక్కడ మహిళలు గౌరవింపబడుతారో అక్కడ దేవతలు నివసిస్తారు’ అని ‘స్త్రీలను గౌరవించడం మన సంస్కృతి’ అని ‘కలకంటి కన్నీరు ఇంటికీ, సమాజానికి అరిష్టం’ అనే గొప్ప విశ్వాసాలు గల మన దేశంలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతుండటం మన దేశానికి మన సంస్కృతికీ కూడా చాల అవమానం.

 

ప్రజలు సినిమాలలో మంచికి బదులుగా చెడునే స్వీకరించినట్లుగానే, డిల్లీ ఉదంతం తరువాత సమాజంలో ఆ తరహా సంఘటనలు పునరావృతమవడం గమనిస్తే, ఆ సంఘటన కొందరికి ప్రేరణ కలిగించినట్లు అర్ధం అవుతోంది.

 

మానసిక శాస్త్ర నిపుణులు ఇటువంటివి ఒక అంటురోగం (సామాజిక మానియా) వంటివని అభిప్రాయపడుతున్నారు. మంచికీ చెడుకీ కూడా సమాజం ఈ మానియాకు లోనవుతుందని తెలిపారు. అటువంటప్పుడు బాధ్యతా కలిగిన ప్రభుత్వాలు, ప్రజలు, మీడియా, ప్రజా సంస్థలు, స్వచ్చంద సంస్థలు అన్నీకూడా చేతులు కలిపి ఒక మంచి భావనలను సమాజంలోకి చొచ్చుకుపొయేలా చేయవలసి ఉండగా, మన ప్రభుత్వాలు డిల్లీలో ఘోర అకృత్యానికి బలైన బాధితురాలిని వీర నారీమణిగా అభివర్ణిస్తూ ఆమె పేరిట పధకాలు, అవార్డులు, చివరికి రైళ్లకు కూడా ‘నిర్భయ ఎక్స్ ప్రెస్’ వంటి పేర్లు కూడా పెడుతూ ఒక ఘోర అకృత్యాన్ని శాస్వితంగా మన కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేయడం దురదృష్టం.

 

అటువంటి సంఘటనల నుండి పాఠాలు నేర్చుకొని, మళ్ళీ అటువంటి సంఘటనలు దేశంలో మరెక్కడా పునారావృతం కాకుండా ఉండేందుకు సమాజంలో తేవలసిన మార్పులను గురించి, మహిళల పట్ల పురుష సమాజం ఆలోచనల్లో తేవలసిన మార్పుల గురించి, మహిళల భద్రతకు దేశంలో చేప్పట్టవలసిన చర్యల గురించి అవసరమయిన ప్రక్రియలను సమాజంలోకి వ్యాపింప జేయవలసిన ప్రభుత్వాలు, తద్వ్యతిరేఖపు ఆలోచనలును తన చర్యల ద్వారా సమాజంలోకి చొప్పిస్తున్నట్లు కనిపిస్తోంది.

 

మన దేశంలో జరిగిన ఈ ఘోర అక్రుత్యంపై యావత్ ప్రపంచమూ కూడా తనదైన శైలిలో స్పందించడం ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తోంది. అయితే, ఇటీవలే అమెరికా ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా మన దేశానికి ‘నిర్భయ అవార్డు’ను కూడా ప్రకటించడం, ప్రభుత్వం తో సహా అనేక మంది చాలా సంతోషపడ్డారు. అయితే, మనం ఏదో ఒక ఘనకార్యం చేసినందుకు ఆ అవార్డు రాలేదు. ఒక ఘనమయిన సంస్కృతీ, సంప్రదాయాలకు పెట్టింది పేరయిన మనదేశం ప్రపంచదేశాల మద్య సిగ్గుతో తలదించుకొనేలా జరిగిన ఒకానొక సంఘటనకు ఇచ్చిన అవార్డు అది అని మనం గ్రహించగలిగితే అది మనకి అవార్డు కాదు అమెరికా కొట్టిన చెప్పు దెబ్బ అని మనకి అర్ధం అవుతుంది.

 

ఒకప్పుడు ఎక్కడో మారు మూల గ్రామాలలో జరిగే ఇటువంటి అకృత్యాలు, నేడు దేశ, రాష్ట్ర రాజధానులలో జరగుతుండటం వలన ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించగలుగుతోంది. అన్ని రంగాలలో ముందడుగు వేస్తున్న మహిళలకు ముఖ్యంగా పెద్దపెద్దనగరాలలో ఉన్నత విద్యలు , ఉద్యోగాలకు వస్తున్న మహిళలకు ఊహించని ఈ పరిణామాలు కలవరం కలిగించడమే కాకుండా, వారి అభ్యున్నతికీ ప్రతిబందకంగా మారుతున్నాయి. క్రమంగా ఒక అంటు రోగంలా దేశమంతా వ్యాపిస్తున్న ఈ సమస్యని ఇక ఎంత మాత్రం ఉపేక్షించ వలసిన విషయం కాదు. ఉపేక్షించడం అంటే పక్కవారి ఇంటికి మంట అంటుకొంటే మనం ఉపేక్షిస్తే ఏమవుతుందో అదే జరుగవచ్చును.

 

గుజరాత్ వంటి రాష్ట్రాలు అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుడిని తన బ్రాండ్ ఎంబాసిడరుగా నియమించుకొంటే, మన భారత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి విదేశాలలో ప్రకటనలు ఇస్తూ విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తత్ఫలితంగా అనేకమంది విదేశీ పర్యాటకులు మన దేశంలో పర్యటించేందుకు వస్తున్నారు కూడా. అయితే, విదేశీయులను ఆకర్షించడానికి చేసే కృషిలో, చేసే ఖర్చులో, చూపే శ్రద్ధలో కనీసం పదోవంతు కూడా (విదేశీ) మహిళల భద్రతపైనా చూపకపోవడం గర్హించాల్సిన విషయం. ముందుగా మహిళల పట్ల మన పురుష సమాజం ఆలోచనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేయడం, దేశంలో మహిళలకు భద్రత కల్పించడం, మన దేశంలో పర్యటించేందుకు వస్తున్న విదేశీ (మహిళల) యుల రక్షణకు తగిన ఏర్పాట్లతో బాటు, వారికి తగిన భరోసా కలిగించడం వంటి చర్యలు చేపడితే అది మనకు మేలు కలిగిస్తుంది తప్ప ఏదో ఒక ఘనకార్యం చేసినట్లు ‘నిర్భయ’ పేరును వాడుకోవడం వల్ల సమాజం మీద మంచి కంటే చెడు ప్రభావమే ఎక్కువ ఉంటుందని జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇకనయినా, ప్రజలు, ప్రభుత్వాలు, పోలీసులు, స్వచ్చంద సంస్థలు, మేధావులు మేల్కొని ఈ దిశలో వెంటనే ప్రయత్నాలు చేయడం చాల మంచిది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.